అన్వేషించండి

CM Jagan Review : ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి, అధికారులకు సీఎం జగన్ క్లాస్

CM Jagan Review : ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలు పారదర్శన విధానాలు అమలు చేయాలని సీఎం జగన్ అన్నారు. 2018-19తో పోలిస్తే 2021-22లో మద్యం వినియోగం బాగా తగ్గిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

CM Jagan Review : ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం జ‌గ‌న్ గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయాలను సమకూరుస్తున్న శాఖల అధికారులతో సీఎం ప్రత్యేకంగా స‌మావేశం అయ్యారు.  ఆదాయాల పరంగా వివిధ శాఖలు, వాటి లక్ష్యాలను సమీక్షించిన సీఎం, లీకేజీలు లేకుండా పారదర్శక విధానాలు అమలు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని అధికారులు సీఎంకు వివ‌రించారు. 2018–19తో పోలిస్తే లిక్కర్‌ అమ్మకాలు 384.31 లక్షల కేసులు కాగా, ఇప్పుడు 2021–22లో 278.5 లక్షలకు తగ్గిందని అధికారులు తెలిపారు. 2018–19లో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా, 2021–22లో 82.6 లక్షల కేసులకు తగ్గిందని అధికారులు సీఎం కు తెలిపారు. 

మద్యం వినియోగం తగ్గింది-సీఎం జగన్ 

2018–19లో మద్యం విక్రయాలపై ఆదాయం రూ.20,128 కోట్లుకాగా, 2021–22లో మద్యం విక్రయయాలపై ఆదాయం రూ. 25,023 కోట్లుగా ఉందని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ధర‌లు షాక్‌ కొట్టేలా పెట్టడంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందన్న అభిప్రాయాన్ని  సీఎం జ‌గ‌న్ వ్యక్తం చేశారు. బెల్టుషాపులు ఎత్తివేయడం, ధరలు విపరీతంగా పెంచడంతో వినియోగాన్ని బాగా నియంత్రించామని సీఎం అన్నారు. గడచిన ఆరు నెలల్లో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తంగా 20,127 కేసులు నమోదు చేశామని అధికారులు సీఎంకు వివ‌రించారు. ఇందులో 16,027 మందిని అరెస్టు చేయగా, 1,407 వాహనాలు సీజ్‌ చేశామన్నారు. నాటుసారా తయారీ వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు అధికారులు. 

కాలేజీలు, యూనివర్సిటీల ముందు ఎస్ఈబీ నెంబర్ 

నాటుసారా తయారీలో ఉన్న వారిని దాని నుంచి బయటపడేయాలని కౌన్సిలింగ్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  స్వయం ఉపాధి పెంచి, గౌరవప్రదమైన ఆదాయాలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటికి విద్యార్థులు, యువత లోనుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలేజీ, యూనివర్సిటీల ముందు ఎస్‌ఈబీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్‌ఈబీ నంబర్‌తో బోర్డులు పెట్టాలన్నారు. ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించి వ్యవహారాలు ఉండకూడదన్నారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని, సెప్టెంబరు నెలాఖరుకల్లా ఈ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.  గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలన్న సీఎం, వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాలన్నారు.  

గంజాయి సాగుపై దాడులు 

క్రమం తప్పకుండా గంజాయి సాగుపై దాడులు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే వివిధ పంటలకు సంబంధించి విత్తనాలు అందించామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 2500 ఎకరాల్లో వేరే పంటలు సాగు చేశారని తెలిపారు. పండించిన పంటలను జీసీసీ ద్వారా కొనుగోలు చేస్తామని అధికారులు వెల్లడించారు.  ఇంకా 1600 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్నారు. మిగిలిన చోట్ల ఎక్కడైనా గంజాయి సాగు చేస్తే.. దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయిని వదిలేసి వివిధ పంటలు సాగు చేస్తున్న వారికి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చి, వారికి రైతు భరోసా వర్తింపు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏసీబీకి సంబంధించిన 14400 నంబర్‌ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్దా కనిపించాలని సీఎం ఆదేశించారు.  గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు, పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఎస్పీకార్యాలయం వరకూ, పీడీఎస్‌ షాపుల వద్ద కూడా ఏసీబీ నెంబర్ బోర్డులు కనిపించాలని అదేశించారు.  

ఎర్రచందనం విక్రయాలపై 

పాస్‌పోర్టు ఆఫీసుల తరహాలో సబ్ రిజిస్టర్ ఆఫీసులను తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మైనింగ్‌కు సంబంధించి అన్నిరకాల అనుమతులు పొంది, లైసెన్స్‌లు తీసుకున్న వారు ఆ గనుల నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలన చేయాలన్నారు. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని కలెక్టర్‌తో కలిసి లైసెన్స్‌లు పొందిన చోట ఆపరేషన్స్‌లో ఉండేలా చూడాలన్నారు. ఒకవేళ ఆపరేషన్స్‌లో లేకపోతే కారణాలు కనుక్కొని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయాలన్నారు. అన్ని అనుమతులూ పొంది ఆపరేషన్స్‌ చేయకపోతే ఆదాయం రాదన్నారు.  ఎర్రచందనం విక్రయానికి అన్నిరకాల అనుమతులు వచ్చాయని అధికారులు సీఎం కు తెలిపారు.  అక్టోబరు – మార్చి నెలల మధ్య 2640 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం విక్రయానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎర్రచందనం విక్రయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రేడింగ్‌లో థర్డ్ పార్టీ చేత కూడా పరిశీలన చేయించాలని సీఎం జ‌గ‌న్ సూచించారు.

Also Read : chandrababu CM : మొదటి సారి సీఎంగా ప్రమాణం చేసి నేటికి 27 ఏళ్లు - చంద్రబాబు ఎమోషనల్ రెస్పాన్స్ చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Anna Konidala Adopts Elephant Tiger: పుట్టినరోజున బిగ్ హార్ట్ - విశాఖ జూలో ఏనుగు, పులిని దత్తత తీసుకున్న అన్నా కొణిదెల
పుట్టినరోజున బిగ్ హార్ట్ - విశాఖ జూలో ఏనుగు, పులిని దత్తత తీసుకున్న అన్నా కొణిదెల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Former AU VC PVGD Prasada Reddy Suspended: ఏయూ వర్సిటీలో సంచలనం - మాజీ వీసీ ప్రొ. ప్రసాద్‌రెడ్డి సస్పెన్షన్ - పదవీ విరమణ రోజే షాక్!
ఏయూ వర్సిటీలో సంచలనం - మాజీ వీసీ ప్రొ. ప్రసాద్‌రెడ్డి సస్పెన్షన్ - పదవీ విరమణ రోజే షాక్!
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget