అన్వేషించండి

CM Jagan : ప్రతి ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు, సచివాలయానికి రూ.20 లక్షలు, గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan : గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధికి ప్రతి ఎమ్మెల్యేకు రూ. 2కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

CM Jagan : గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైసీపీ రిజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. వైసీపీ నేతలకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ఎమ్మెల్యేకు నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షలు కేటాయించినట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు. సచివాలయాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు నిధులు విడుదల చేస్తారని సీఎం ప్రకటించారు. తాను చేయాల్సింది చేస్తున్నానని, ఇక బాధ్యత అంతా మీదే అన్నారు. చేసిన పని చెప్పుకుని సానుకూలత తీసుకురాకపోతే ఎవరూ క్షమించరని పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు సీఎం జగన్‌ సున్నితంగా హెచ్చరించారు. 

టార్గెట్ 175 

సీఎం జగన్ మాట్లాడుతూ పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో అనేక  సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నాయన్నారు. మళ్లీ అధికారం చేపట్టాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. వారి మద్దతు ఉంటే 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేమని సీఎం జగన్ అన్నారు. 

ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు 

రాష్ట్రంలోని ప్రతీ సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజల నుంచి వినతులను తీసుకుని ప్రాధాన్యతా ప్రకారం  డబ్బు ఖర్చు చేయాలన్నారు. ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబంధించి ముందుగానే కలెక్టర్లకు డబ్బు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ జీవో విడుదల చేసినట్లు తెలిపారు. సీఎం అభివృద్ధి నిధి నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. సచివాలయాలకు ఇచ్చే నిధులకు ఇది అదనమని వెల్లడించారు. గడప, గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చే నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలన్నారు. వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు, లేదా గరిష్టంగా 21 రోజులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు.  ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేసేందుకు 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించాలని సీఎం ఆదేశించారు. 

Also Read : Somu Veerraju : మంత్రి పదవి ఎలా సంపాదించారో తెలుసు, కొట్టు సత్యనారాయణపై సోము వీర్రాజు ఫైర్

Also Read : YS Jagan On Opposition : రాష్ట్రం పరువు తీస్తున్నారు - విపక్షాలపై జగన్ విమర్శలు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget