అన్వేషించండి

CM Jagan Review : త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు, సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : మే 16న రైతు భరోసా, జూన్ 15లోపు పంట బీమా రైతులకు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు వ్యవసాయ ఉపకరణాలను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

CM Jagan Reveiw On Agriculture sector : మే 16న రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, పంట బీమా పరిహారం చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. మే 16న రైతు భరోసా, జూన్‌ 15లోపు రైతులకు పంట బీమా పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మూడు వేల ట్రాక్టర్లు, 4014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏఓ చాంఫియన్ అవార్డుకు ఎంపికైనందుకు వ్యవసాయ శాఖ అధికారులను సీఎం అభినందించారు. 

మే 11న మత్స్యకార భరోసా 

మే 16న రైతు భరోసా, జూన్‌ 15లోగా పంట బీమా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ అన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ నాటికి రైతులకు పెట్టుబడి సాయం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జూన్‌ మొదటి వారంలోనే రైతులకు 3 వేల ట్రాక్టర్లతో కలిపి 4014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అలాగే మే 11న మత్స్యకార భరోసా జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్బీకే, ఇ-క్రాపింగ్‌ చాలా ముఖ్యమైనవి అని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామస్థాయిలో ఆర్బీకేల కార్యకలాపాలు, ఇ– క్రాపింగ్‌ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సోషల్‌ ఆడిట్‌ కూడా సక్రమంగా నిర్వహించి రైతులకు పథకాలు అందించాలని సీఎం జగన్ అన్నారు. 

4 శాతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు 

రైతులకు ఎక్కడ మద్దతు ధరలు లభించకపోయినా వెంటనే అధికారులు స్పందించాలని సీఎం జగన్ ఆదేశించారు. రైతులను ఆదుకునే చర్యలను తీసుకోవాలన్నారు. ఆర్బీకేల్లో కియోస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఉండేలా చూసుకోవాలని సీఎం అధికారులకు సూచనలు చేశారు. 2021 ఖరీఫ్‌లో 90.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అయినట్లు, రబీ 2021-22లో 54.54 లక్షల ఎకరాల్లో పంటసాగు అయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 2020-21లో ఆహార ఉత్పత్తులు 165.07 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2021-22లో 171.7 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చినట్లు వెల్లిడించారు. గత ఏడాదితో పోలిస్తే ఆహార ఉత్పత్తులు 4 శాతం పెరిగినట్లు తెలిపారు. 

మూడో పంట సాగు 

రాష్ట్రంలో మూడో పంటకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకూ 66,803 హెక్టార్లలో మూడోపంట సాగు చేసినట్లు వెల్లడించారు. ఇది లక్ష హెక్టార్లు దాటే అవకాశాలున్నాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే 477శాతం మూడో పంట సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చే పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం అయిందని అధికారులు తెలిపారు. ఈ కనెక్షన్లు దాదాపు 30 శాతం విద్యుత్‌ ఆదా అయ్యిందన్నారు. కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అయిదని అధికారులు తెలిపారు. రైతులు వాడని కరెంటును ఉచిత విద్యుత్‌ పేరుతో లెక్క కడుతున్నట్లు తెలిపారు. తర్వలో వ్యవసాయ బోర్లకు మీటర్లు అమర్చాలని ఆదేశించారు. 

కిసాన్ డ్రోన్ల నిర్వహణ

కిసాన్‌ డ్రోన్లు, నిర్వహణ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వ ఇటీవల రూపొందించిన మార్గదర్శకాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి ఆర్బీకేల పరిధిలో చదువుకుని పరిజ్ఞానం ఉన్న రైతులతో ప్రత్యేకంగా డ్రోన్‌ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటు చేసి, శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్ అందించాలన్నారు. రైతులందరికీ శిక్షణ ఇవ్వడానికి ఒక మాస్టర్‌ ట్రైనర్‌ ఏర్పాటుచేయాలన్నారు. డ్రోన్‌తో ఫెస్టిసైడ్స్‌, ఫెర్టిలైజర్స్‌ వేయొచ్చో వివరించేలా రూపొందించిన వీడియోలను రైతుల్లో అవగాహన పెంచాలని సీఎం తెలిపారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget