అన్వేషించండి

CM Jagan Review : త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు, సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : మే 16న రైతు భరోసా, జూన్ 15లోపు పంట బీమా రైతులకు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు వ్యవసాయ ఉపకరణాలను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

CM Jagan Reveiw On Agriculture sector : మే 16న రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, పంట బీమా పరిహారం చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. మే 16న రైతు భరోసా, జూన్‌ 15లోపు రైతులకు పంట బీమా పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మూడు వేల ట్రాక్టర్లు, 4014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏఓ చాంఫియన్ అవార్డుకు ఎంపికైనందుకు వ్యవసాయ శాఖ అధికారులను సీఎం అభినందించారు. 

మే 11న మత్స్యకార భరోసా 

మే 16న రైతు భరోసా, జూన్‌ 15లోగా పంట బీమా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ అన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ నాటికి రైతులకు పెట్టుబడి సాయం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జూన్‌ మొదటి వారంలోనే రైతులకు 3 వేల ట్రాక్టర్లతో కలిపి 4014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అలాగే మే 11న మత్స్యకార భరోసా జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్బీకే, ఇ-క్రాపింగ్‌ చాలా ముఖ్యమైనవి అని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామస్థాయిలో ఆర్బీకేల కార్యకలాపాలు, ఇ– క్రాపింగ్‌ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సోషల్‌ ఆడిట్‌ కూడా సక్రమంగా నిర్వహించి రైతులకు పథకాలు అందించాలని సీఎం జగన్ అన్నారు. 

4 శాతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు 

రైతులకు ఎక్కడ మద్దతు ధరలు లభించకపోయినా వెంటనే అధికారులు స్పందించాలని సీఎం జగన్ ఆదేశించారు. రైతులను ఆదుకునే చర్యలను తీసుకోవాలన్నారు. ఆర్బీకేల్లో కియోస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఉండేలా చూసుకోవాలని సీఎం అధికారులకు సూచనలు చేశారు. 2021 ఖరీఫ్‌లో 90.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అయినట్లు, రబీ 2021-22లో 54.54 లక్షల ఎకరాల్లో పంటసాగు అయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 2020-21లో ఆహార ఉత్పత్తులు 165.07 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2021-22లో 171.7 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చినట్లు వెల్లిడించారు. గత ఏడాదితో పోలిస్తే ఆహార ఉత్పత్తులు 4 శాతం పెరిగినట్లు తెలిపారు. 

మూడో పంట సాగు 

రాష్ట్రంలో మూడో పంటకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకూ 66,803 హెక్టార్లలో మూడోపంట సాగు చేసినట్లు వెల్లడించారు. ఇది లక్ష హెక్టార్లు దాటే అవకాశాలున్నాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే 477శాతం మూడో పంట సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చే పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం అయిందని అధికారులు తెలిపారు. ఈ కనెక్షన్లు దాదాపు 30 శాతం విద్యుత్‌ ఆదా అయ్యిందన్నారు. కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అయిదని అధికారులు తెలిపారు. రైతులు వాడని కరెంటును ఉచిత విద్యుత్‌ పేరుతో లెక్క కడుతున్నట్లు తెలిపారు. తర్వలో వ్యవసాయ బోర్లకు మీటర్లు అమర్చాలని ఆదేశించారు. 

కిసాన్ డ్రోన్ల నిర్వహణ

కిసాన్‌ డ్రోన్లు, నిర్వహణ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వ ఇటీవల రూపొందించిన మార్గదర్శకాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి ఆర్బీకేల పరిధిలో చదువుకుని పరిజ్ఞానం ఉన్న రైతులతో ప్రత్యేకంగా డ్రోన్‌ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటు చేసి, శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్ అందించాలన్నారు. రైతులందరికీ శిక్షణ ఇవ్వడానికి ఒక మాస్టర్‌ ట్రైనర్‌ ఏర్పాటుచేయాలన్నారు. డ్రోన్‌తో ఫెస్టిసైడ్స్‌, ఫెర్టిలైజర్స్‌ వేయొచ్చో వివరించేలా రూపొందించిన వీడియోలను రైతుల్లో అవగాహన పెంచాలని సీఎం తెలిపారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Janasena Rajya Sabha Nominee Lingamaneni Ramesh: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - ఏ క్షణమైనా అధికారిక ప్రకటన
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - ఏ క్షణమైనా అధికారిక ప్రకటన
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget