అన్వేషించండి

Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!

Agri Gold Assets Auction: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6 నెలల్లో అందరికీ చెల్లింపులు చేయనున్నారు.

Justice For Agri Victims:  ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 11 లక్షల మంది కుటుంబాలను దశాబ్ద కాలంగా పీడిస్తున్న అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. బాధితులకు న్యాయం చేయడంలో గత ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనతపై మండిపడ్డ సీఎం, రాబోయే ఆరు నెలల్లోగా బాధితులందరికీ వారి సొమ్ము చెల్లించి ఈ అధ్యాయానికి ముగింపు పలకాలని అధికారులను ఆదేశించారు. ఇది కేవలం హామీ మాత్రమే కాదని, ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 19 లక్షల మంది బాధితులలో, సింహభాగం అంటే 11 లక్షల మంది ఏపీలోనే ఉన్నారు. వీరి క్లెయిమ్స్‌ను అత్యంత పారదర్శకంగా పరిశీలించడం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్   అటాచ్ చేసిన రూ. 4,141 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. న్యాయపరమైన చిక్కులను తొలగించి, వివాదరహిత ఆస్తులను వెంటనే విక్రయించి నగదును సమీకరించాలని కేబినెట్ తీర్మానించింది.                       

గత వైఎస్సార్సీపీ హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయ ప్రక్రియ నత్తనడకన సాగడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో కేవలం రూ. 20 వేల లోపు డిపాజిట్ చేసిన దాదాపు 10.40 లక్షల మందికి మాత్రమే కొంత మేర ఊరట లభించింది. కానీ, అంతకంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేసి, తమ జీవితకాల సంపాదనను కోల్పోయిన లక్షలాది మంది మధ్యతరగతి బాధితులు ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ జాప్యానికి కారణమైన అధికారుల తీరును తప్పుబట్టిన సీఎం, తక్షణమే లిక్విడేషన్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు.

రాజకీయంగా కూడా అగ్రిగోల్డ్ బాధితుల అంశం ఏపీలో అత్యంత ప్రభావితమైనది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఆస్తుల వేలం ద్వారా వచ్చే నిధుల కోసమే వేచి చూడకుండా, అవసరమైతే ప్రభుత్వ పరంగా ముందస్తుగా కొంత నిధిని కేటాయించి బాధితులకు సర్దుబాటు చేసే అంశంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిపాజిట్ దారుల జాబితాను జిల్లా వారీగా సిద్ధం చేసి, చెల్లింపుల ప్రక్రియను డీబీటీ  ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి చేర్చేలా టెక్నాలజీని వాడుకోనున్నారు.

 అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. ఏళ్ల తరబడి కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన బాధితులకు, ఆరు నెలల గడువు అనేది ఒక పెద్ద ఊరట. ప్రభుత్వం చెప్పిన విధంగానే ఆస్తుల వేలం వేగంగా జరిగి, బాధితుల సొమ్ము వారికి చేరితే.. అది కూటమి ప్రభుత్వానికి పెద్ద రాజకీయ విజయంగా మారుతుందనడంలో సందేహం లేదు.            

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయండి, ఏమైనా జరిగితే బీఆర్ఎస్‌దే బాధ్యత – జగదీష్ రెడ్డి
కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయండి, ఏమైనా జరిగితే బీఆర్ఎస్‌దే బాధ్యత – జగదీష్ రెడ్డి
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Kesineni Nani Vs Kesineni Chinni: విజయవాడలో కాల్ మనీ రాకెట్ - ఎంపీ కేశినేని చిన్నిపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ
విజయవాడలో కాల్ మనీ రాకెట్ - ఎంపీ కేశినేని చిన్నిపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ప్రతీ నిరుద్యోగి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ప్రతీ నిరుద్యోగి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
గత నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు - టాటా డబుల్ ట్రీట్‌, మారుతికి ఉత్పత్తి దెబ్బ
జూన్‌లో జనం ఎక్కువగా కొన్న టాప్‌-10 కార్లు - మారుతి డిజైర్‌ను దాటేసిన పంచ్ & నెక్సాన్
Embed widget