అన్వేషించండి

Atchannaidu: ఏపీలో యూరియా కొరత, రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్

AP Farmers | ఏపీలో యూరియా, ఎరువుల కొరతపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. మూడు రోజుల్లోగా యూరియా రైతులకు అందుబాటులోకి వస్తుందని శుభవార్త చెప్పారు.

Urea availability in Andhra Pradesh | విజయవాడ: రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సరఫరా వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆ శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల సరఫరా యథావిధిగా సాగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారంతో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, మార్క్‌ఫెడ్ ఎండీ మనజీర్ జిలానీ సామున్, ఇతర అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కమిషనర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. 2025 ఖరీఫ్ సీజన్‌ కోసం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 16.73 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని వెల్లడించారు. ఇందులో యూరియా అవసరం 6.22 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 2.60 లక్షల మె. టన్నులు, ఎంఓపీ 0.70 లక్షల మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 0.94 లక్షల మె. టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 6.30 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని వివరించారు.

ఎరువుల రాక ఆలస్యంతో సరఫరాలో జాప్యం

కేంద్రం నుంచి ఆగస్ట్ నెలలో రావలసిన కొన్ని ఎరువులు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 10.39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయని, ప్రారంభ నిల్వలతో కలిపి మొత్తం 17.53 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఢిల్లీ రావు పేర్కొన్నారు. ఇప్పటివరకు 10.96 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేసినట్టు తెలిపారు. 6.56 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్రంలోని సహకార సంఘాలు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.


Atchannaidu: ఏపీలో యూరియా కొరత, రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు ఇబ్బందులు ఎదురైతే, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అవసరమైన ప్రాంతాలకు మార్క్‌ఫెడ్ గోదాముల్లోని నిల్వలను త్వరితంగా పంపాలన్నారు. ప్రైవేట్ డీలర్లు యూరియా, డీఏపీ వంటి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సమాచారం ఉన్నందున, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రానికి రావలసిన పెండింగ్ ఎరువుల విషయంపై కేంద్ర మంత్రి నడ్డాను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఎరువులలో 19,000 మెట్రిక్ టన్నులు RFC రామగుండం నుంచి, 30,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్, 18,500 మెట్రిక్ టన్నులు గంగవరం పోర్ట్ ద్వారా రావాల్సి ఉందన్నారు. ఇవి త్వరలో రాష్ట్రానికి చేరేలా చర్యలు తీసుకుంటామని, రైతులు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.

యూరియా కొరత విషయంలో, తదుపరి 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఎవరు కావాలనే కొరత సృష్టించినా ఉపేక్షించబోమని, రైతులకు ఇబ్బందులు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఫర్టిలైజర్స్ జేడీ కృపాదాస్, మార్క్‌ఫెడ్ జీఎం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Embed widget