అన్వేషించండి

Atchannaidu: ఏపీలో యూరియా కొరత, రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్

AP Farmers | ఏపీలో యూరియా, ఎరువుల కొరతపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. మూడు రోజుల్లోగా యూరియా రైతులకు అందుబాటులోకి వస్తుందని శుభవార్త చెప్పారు.

Urea availability in Andhra Pradesh | విజయవాడ: రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సరఫరా వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆ శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల సరఫరా యథావిధిగా సాగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారంతో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, మార్క్‌ఫెడ్ ఎండీ మనజీర్ జిలానీ సామున్, ఇతర అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కమిషనర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. 2025 ఖరీఫ్ సీజన్‌ కోసం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 16.73 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని వెల్లడించారు. ఇందులో యూరియా అవసరం 6.22 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 2.60 లక్షల మె. టన్నులు, ఎంఓపీ 0.70 లక్షల మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 0.94 లక్షల మె. టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 6.30 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని వివరించారు.

ఎరువుల రాక ఆలస్యంతో సరఫరాలో జాప్యం

కేంద్రం నుంచి ఆగస్ట్ నెలలో రావలసిన కొన్ని ఎరువులు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 10.39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయని, ప్రారంభ నిల్వలతో కలిపి మొత్తం 17.53 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఢిల్లీ రావు పేర్కొన్నారు. ఇప్పటివరకు 10.96 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేసినట్టు తెలిపారు. 6.56 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్రంలోని సహకార సంఘాలు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.


Atchannaidu: ఏపీలో యూరియా కొరత, రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు ఇబ్బందులు ఎదురైతే, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అవసరమైన ప్రాంతాలకు మార్క్‌ఫెడ్ గోదాముల్లోని నిల్వలను త్వరితంగా పంపాలన్నారు. ప్రైవేట్ డీలర్లు యూరియా, డీఏపీ వంటి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సమాచారం ఉన్నందున, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రానికి రావలసిన పెండింగ్ ఎరువుల విషయంపై కేంద్ర మంత్రి నడ్డాను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఎరువులలో 19,000 మెట్రిక్ టన్నులు RFC రామగుండం నుంచి, 30,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్, 18,500 మెట్రిక్ టన్నులు గంగవరం పోర్ట్ ద్వారా రావాల్సి ఉందన్నారు. ఇవి త్వరలో రాష్ట్రానికి చేరేలా చర్యలు తీసుకుంటామని, రైతులు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.

యూరియా కొరత విషయంలో, తదుపరి 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఎవరు కావాలనే కొరత సృష్టించినా ఉపేక్షించబోమని, రైతులకు ఇబ్బందులు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఫర్టిలైజర్స్ జేడీ కృపాదాస్, మార్క్‌ఫెడ్ జీఎం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
Embed widget