అన్వేషించండి

Sericulture in AP: పట్టుకు పూర్వ వైభవం - ఏడు జిల్లాలకు ఇదే అతిపెద్ద మార్కెట్ ఇదే

Sericulture in Andhra Pradesh: పట్టు మార్కెట్ కు పూర్వ కళ వచ్చింది. డిమాండ్ తో పాటుగా పెరిగిన ఉత్పత్తితో మార్కెట్ కళకళ లాడుతోంది. ఈ మార్కెట్ విధానం అమలుతో దళారులకు చెక్ పడింది.

Sericulture in Andhra Pradesh: ఏపీలో పట్టు పరిశ్రమ కోలుకుంటుంది. కరోనా పరిస్థితుల కారణంగా దయనీయంగా మారిన పరిశ్రమకు ఇప్పుడు క్రమేణా మంచి రోజులు వస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అధిక దిగుబడితో రాబడి పెరిగిందని రైతులు అంటున్నారు. ఈ మార్కెట్ (E Market) విధానంలో పట్టు గూళ్ళ విక్రయాలు జరగటంతో దళారుల ప్రమేయం లేదని చెబుతున్నారు.
పట్టుకు పూర్వ కళ....
పట్టు మార్కెట్ కు పూర్వ కళ వచ్చింది. డిమాండ్ తో పాటుగా పెరిగిన ఉత్పత్తితో మార్కెట్ కళకళ లాడుతోంది. ఈ మార్కెట్ విధానం అమలుతో దళారులకు చెక్ పడింది. రైతులకు ఆదాయం, ప్రభుత్వ ఖజానాకు కాసులు వచ్చిపడుతున్నాయి. పట్టు పరిశ్రమ పూర్తిగా ప్రకృతి పైనే ఆధారపడి ఉంటుంది. రైతులు ప్రకృతిలోని వనరులను వినియోగించుకుని, వాటిని గూళ్ళుగా పరిరక్షించి సహజసిద్ధంగా పట్టు గూళ్ళను రెడీ చేస్తుంటారు. అయితే గత రెండు సంవత్సరాలుగా పట్టు పరిశ్రమకు పూర్తిగా గడ్డు కాలమనే చెప్పాలి. దీనిక తోడు మధ్యవర్తుల ప్రమేయంతో మార్కెట్ పూర్తిగా నాశనం అయ్యిందని రైతులు తీవ్ర ఆవేదనలో ఉండే పరిస్థితులు నుంచి నేడు మరోసారి పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పట్టుగూళ్ల విక్రయ కేంద్రం మరోసారి పట్టు రైతులతో కళకళ లాడుతుంది. తెలుపు రంగులో పట్టు గూళ్ళు మార్కెట్ లకు తరలి వస్తుంది. ఇక్కడ ఈ మార్కెట్ ద్వారా డిమాండ్ కు అనుగుణంగా సరుకును దక్కించుకున్న వ్యాపారులు స్టాక్ ను ప్రోసెసింగ్ సెంటర్ కు తరలించి, అక్కడ నాణత్య మేరకు ముడి సరుకును తయారు చేసుకుంటారు. అలా తయారైన ముడి సరుకును మగ్గం కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ వివిధ రకాల దుస్తులు, ఉత్పత్తులు తయారు చేస్తుంటారు.
ఏడు జిల్లాలకు ఇదే అతిపెద్ద మార్కెట్....
ఉమ్మడి కృష్ణాజిల్లా లోని హనుమాన్ జంక్షన్ లో పట్టుగూళ్ల విక్రయ కేంద్రం ఉంది. కోస్తా జిల్లాలో ఎక్కడ పట్టు పరిశ్రమలు ఉన్నా, వాటి సరుకు మాత్రం ఇక్కడకు రావాల్సిందే. పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడుపుతున్న మార్కెట్ కావటంతో గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ఇక్కడకు రావటానికి మక్కువ చూపుతుంటారు. కానీ చాలా మంది దళారులు రైతులను నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు వెలుగు లోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వం పక్కాగా ఈ మార్కెట్ ను అమలులోకి తీసుకువచ్చింది. దీని వల్ల రైతులు ఎక్కడ ఉన్నా తమ పంటను విక్రయించుకునేందుకు అవకాశం కలిగింది. అదే విధంగా కొనుగోలు దారులు ఈ మార్కెట్ లోనే క్రయవిక్రయాలు జరుపుతున్నారు. 
రైతులకు గిట్టుబాటు ధర లభించటంతో పాటుగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభిస్తోంది. గత ఏడాది నవంబర్ నాటికి 88టన్నుల పట్టు లావాదేవీలు జరిగాయి. దీంతో మార్కెట్ యార్డ్ కు 5 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది నవంబర్ నాటికి అత్యధికంగా 172 టన్నుల స్టాక్ వచ్చింది. మార్కెట్ ఫీజ్ కింద 13 లక్షల రూపాయలు ఆదాయం లభించిందని మార్కెట్ అధికారి దుర్గారావు వెల్లడించారు. ఏడు జిల్లాల నుంచి రైతులు తమ పంటను ఇక్కడి మార్కెట్ కు తీసుకురావడంతో రైతులకు ఆశించిన ధర లభిస్తుందని ఆయన తెలిపారు. గత ఏడాదితో పోల్చితే డిమాండ్ పెరగటంతో, మార్కెట్ ఊపందుకుందని వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget