అన్వేషించండి
Liquor: జగన్ మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోవట్లేదంటున్న మహిళలు
వైన్ షాప్ ను తొలగించాలని కర్నూలు నగరంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీ వద్ద ఎక్సైజ్ అధికారులు నూతనంగా మద్యం షాపును ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి మద్యం షాపు ను తొలగించాలని పెద్ద ఎత్తున మహిళలు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకొని స్థానిక తో మాట్లాడారు. మద్యం షాపు తొలగించుకుంటే ధ్వంసం చేస్తామని మహిళలు అధికారులకు హెచ్చరించారు. దీంతో మద్యం షాపును తీసివేస్తామని అధికారులు హామీ ఇచ్చి ప్రస్తుతానికి మద్యం షాపును మూసివేయడంతో స్థానికులు ఆందోళన విరమించారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు





















