అన్వేషించండి

Hyderabad News: ఆ కారు ధర రూ.51 లక్షలు - రిపేర్లకు రూ.50 లక్షల అంచనా, అసలు ట్విస్ట్ ఏంటంటే?

Consumer Forum: తన కారు రిపేర్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన సర్వీస్ సెంటర్‌పై ఓ వ్యక్తి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. విచారించిన కమిషన్ రూ.31 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

Consumer Forum Verdict On Compesation Of Damaged Car: ఓ వ్యక్తి తన కారును రిపేర్ చేయించడం కోసం సర్వీస్ సెంటర్‌కు తరలించాడు. అయితే, వరదలు రావడంతో సర్వీస్ సెంటర్‌లో ఉన్న కారు పూర్తిగా పాడైంది. ఎంతలా అంటే కారు ధర రూ.51 లక్షలు కాగా రిపేర్లకు రూ.50 లక్షలు అంచనా వేసేంతగా పాడైపోయింది. అయితే, సరైన సమయానికి కారు రిపేర్ చేయకుండా అది వరదలో మునిగిపోవడానికి కారణమయ్యారంటూ సర్వీస్ సెంటర్‌పై సదరు వాహన యజమానికి ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాధ్యత తీసుకోవాలని కోరగా.. వారు నిరాకరించడంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారించిన కమిషన్ రూ.31 లక్షల పరిహారం చెల్లించాలని సర్వీస్ సెంటర్‌ను ఆదేశించింది. పూర్తి వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని (Hyderabad) బ్లూ ఓషన్ మల్టీ క్లయింట్ ఆఫీస్‌కు చెందిన ఓ వ్యక్తి 2015లో రూ.51 లక్షలు వెచ్చించి వోల్వో కారును కొనుగోలు చేశారు. 2019లో అకస్మాత్తుగా వాహనంలో ఏసీ పనిచేయలేదు. అంతే కాకుండా ఇంజిన్ వేడెక్కి ప్రమాదకరంగా మారింది. దీంతో అతను ఓ సర్వీస్ సెంటర్‌లో కారు రిపేర్ చేయించుకున్నాడు. 

Also Read: Metro Train Project : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు హ్యాపీ న్యూస్ -దసరా నుంచి రెండో దశ పనులు ప్రారంభం!

అనంతరం కొద్ది రోజులకు వాహనంలో మళ్లీ సమస్య ఏర్పడింది. కారు ఏసీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పలు రకాల సమస్యలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సదరు కారు యజమానికి 2020లో కృష్ణ ఎక్స్‌క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాడు. కారు రిపేర్ కోసం రూ.2.73  లక్షలు ఖర్చవుతాయని చెప్పి రిపేర్ కోసం వాహనాన్ని సర్వీస్ సెంటర్‌లోనే పెట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్‌లో వరదలు వచ్చి సర్వీస్ సెంటర్‌లో ఉన్న కారు పూర్తిగా మునిగిపోయి దెబ్బతింది. ఈ క్రమంలో కారు రిపేర్ కోసం రూ.50.45 లక్షల వరకూ ఖర్చవుతుందని సర్వీస్ సెంటర్ సిబ్బంది యజమానికి చెప్పారు. సకాలంలో కారు రిపేర్ చేయకుండా వాహనం వరదల్లో మునిగిపోవడానికి కారణమయ్యారని.. పూర్తిగా మీరే బాధ్యత వహించాలని సర్వీస్ సెంటర్ సిబ్బందిని నిలదీశాడు. దీనికి వారు అంగీకరించలేదు.

వినియోగదారుల ఫోరంలో పిటిషన్

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కారు యజమాని సర్వీస్ సెంటర్ యాజమాన్యంపై రంగారెడ్డి జిల్లా (Rangareddy District) వినియోగదారుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన కమిషన్.. సర్వీస్ సెంటర్‌ తీరును తప్పుబట్టింది. సర్వీస్ కోసం వచ్చిన కారును బయటకు తీయకుండా వాహనం పూర్తిగా దెబ్బతినడానికి సర్వీస్ సెంటర్ సిబ్బందే కారణమని తేల్చింది. రూ.31 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోపు పిటిషనర్‌కు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు సీహెచ్ లతాకుమారి, సభ్యులు పారుపల్లి జవహర్ బాబు, శ్యామలతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది.

Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఏపీ నుంచి స్పెషల్ వెహికిల్ - ఇది ఎంత బరువు మోస్తుందో తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget