అన్వేషించండి

Kavitha Politics: ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్

ఓసారి మాతో పెట్టుకుంటే తెలంగాణ సాధించుకున్నాం, మళ్లీ జోక్యం చేసుకుంటే పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఏపీకి పార్సిల్ చేస్తామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ జోక్యం చేసుకుంటే ఏపీ నేతల పళ్లు రాలగొడతాం: కవిత
  • ఆంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణలో చక్రం తిప్పడానికి వీల్లేదు
  • ఏపీ పాలకుల ఏజెంట్ సీఎం రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు
  • అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చకుంటే ఉద్యమంగా మారుతుంది

హైదరాబాద్: పాలిటికల్ అవసరాల కోసం తెలంగాణ మీద పడి ఏడవటం సరికాదని, మేం రాజకీయ పరిణతి చెందిన వ్యక్తులమని.. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్లం కాదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ విషయాల్లో జోక్యం చేసుకుంటే పళ్లు రాలగొడతాం అని ఏపీ నేతలను హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు- సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విస్తరిస్తామన్న నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఆకాంక్షలపై కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ పాలకుల ఏజెంట్ తెలంగాణ సీఎంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ ఇష్టం వచ్చినట్లుగా విగ్రహాలు పెడుతున్నారని.. మేం అధికారంలోకి వచ్చాక బిడ్డా.. ఈ విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రాకు పార్సిల్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తనకు ఓపిక చాలా తక్కువ అని, పాత నాయకుల తీరుగా ఉండనని, తనకు అంత విశాల హృదయం లేదన్నారు. ఏపీ నుంచి రావొచ్చు పోవచ్చు. సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చు. రావొచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు పోవచ్చు అన్నారు.  వ్యాపారవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తాం. స్విట్జర్లాండ్, యూకే, జపాన్ వాళ్ల కాళ్లు పట్టుకుని ఇక్కడికి రండి భూములిస్తాం అంటున్నారు.  ఆంధ్రలో శేఖర్ రెడ్డి శ్రీ సిటీ కట్టారు. 30 దేశాల నుంచి వచ్చి చాలా కంపెనీలు పెట్టారు. వ్యాపారం చేసుకుంటే మాకు ఎలాంటి సమస్య లేదు. ఆంధ్ర రాజకీయ నాయకులు మళ్లొచ్చి చక్రం తిప్పుతాం అంటూ చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

Also Read: Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు

‘పవన్ కళ్యాణ్ మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ మాట అన్నారు. తరువాత పాశం యాదగిరన్న ఓ మాట మాట్లాడారు. ఇక్కడ ఏపీ పాలకుల ఏజెంట్ సీఎం కనుక మా ఇంటికి పోలీసులు వస్తున్నారు. ఇలా చేస్తే చూస్తూ ఊరుకేనేది లేది. మాకు అన్ని హక్కులు ఉన్నాయి. రాజకీయంగా దమ్ముంటే ఎదుర్కోండి. అక్కడ రాజధాని కట్టడానికి చేత కాలేదు కాదు. కానీ ఇక్కడ తెలంగాణను నవ నిర్మాణం చేస్తారా.. మా పనులు మేం చేసుకుంటాం. మా నిర్మాణం మేం చేసుకుంటాం. విడిపోయింది రాష్ట్రమే కానీ ప్రజలు కాదు. ప్రజల మధ్య చిచ్చుపెడితే మాట్లాడే వాళ్లు లేరనుకున్నారా.. ఈ జెండా రాకముందే లెక్క వేరు. ఇప్పుడు లెక్క వేరు. ఇప్పుడు టీఆర్ఎస్ 2.o ఇక్కడ. ఇదివరకు మాతో పెట్టుకుంటే రాష్ట్రం సాధించుకున్నాం. ఈసారి మాతో పెట్టుకుంటే మూతిపళ్లు రాలిపడతాయి. కాబట్టి మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడటం, మా మేధావులను టచ్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. లేనిపోని సాంస్కృతిక పెత్తనం చేయాలని చూస్తే సహించేది లేదు. మా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయం తరువాత చూసుకోండి. ముందు మీరు రాజధాని కట్టుకోండి. ఇక్కడ సెటిలైన ఆంధ్రవాళ్లు మా వాళ్లు. మాతో కలిసి ఉన్నారు. వాళ్లను కడుపున పెట్టుకుని చూసుకుంటాం. తెలంగాణ వాళ్లు ఎవ్వరిని ఇబ్బంది పెట్టే రకం కాదు. మా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాం, మీ సెక్రటేరియట్లో వేలు పెడతాం. మీ నీళ్లు దోచుకుంటాం అంటే కుదరదు. మా అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ప్రవర్తిస్తే ఊరుకోం. ఏపీ పాలకుల ఏజెంట్ అయిన సీఎం ఆ పని చేసినా సహించేది లేదన్నారు’ కవిత.

తెలంగాణ రాజకీయాలు తరువాత.. ముందు ఏపీలో రాజధాని కట్టుకోండి..

రెండున్నరేళ్లు అయింది. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేశాం. కమిటీలు వేసింది చాలు. కేకేలు పీకేలు మాకొద్దు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చాలి. వారి కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు హామీలు నెరవేర్చాలి. ఎవరిని చూసి ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారో వాళ్లు బాధ్యతగా ఇవి నెరవేర్చకపోతే ఉద్యమంగా మారుతుందన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే ప్రోగ్రాం వాయిదా వేసుకుని, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం కోసం పోరాడదాం. గోదావరి, కావేరి లింక్ ప్రాజెక్టు పోలవరం నుంచి పోతుందంటే ఒప్పుకుని సంతకం పెట్టి నీటి హక్కులు పోగొడుతున్నారని, ఇది సరికాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. రాష్ట్రం తెచ్చుకున్న వాళ్లం, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎలా నిలదీసి పోరాటం ద్వారా సాధించుకోవాలి, ఏపీ ప్రభుత్వం కుట్రలను ఎలా ఛేదించుకోవాలో ఈ సందర్భంగా చర్చించుకుంటామన్నారు. రౌండ్ టేబుల్ తరువాత తీర్మానాలు చేసుకుంటామని పేర్కొన్నారు.         

Frequently Asked Questions

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆంధ్ర నాయకులను ఎందుకు హెచ్చరించారు?

తెలంగాణ విషయాల్లో ఆంధ్ర నాయకులు జోక్యం చేసుకుంటే సహించేది లేదని, వారి పళ్లు రాలగొడతామని కవిత హెచ్చరించారు.

తెలంగాణలో విగ్రహాల ఏర్పాటుపై కవిత ఏమన్నారు?

రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ విగ్రహాలు పెడుతున్నారని, అధికారంలోకి వచ్చాక వాటిని పగలగొట్టి ఆంధ్రాకు పార్సిల్ చేస్తామని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

వ్యాపారవేత్తల విషయంలో కవిత వైఖరి ఏమిటి?

వ్యాపారవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తామని, స్విట్జర్లాండ్, యూకే, జపాన్ వంటి దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని కవిత తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో కవిత ఏమని డిమాండ్ చేశారు?

ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు హామీలు నెరవేర్చాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎంకు కవిత ఎలాంటి సూచన చేశారు?

పోలవరం నుంచి గోదావరి, కావేరి లింక్ ప్రాజెక్టు పోతుందంటే ఒప్పుకుని నీటి హక్కులు పోగొట్టుకోవద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కవిత సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అధికారం కోసం కాదు, బాధ్యత కోసమే కూటమి: తిరుపతి సభలో పవన్ కళ్యాణ్
అధికారం కోసం కాదు, బాధ్యత కోసమే కూటమి: తిరుపతి సభలో పవన్ కళ్యాణ్
Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Rains in Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
Breaking News:ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
King Maker CBN: పాతాళం నుంచి శిఖరాగ్రానికి - రెండేళ్లలోనే దేశ రాజకీయాన్ని శాసించే పవర్‌ఫుల్ లీడర్‌గా చంద్రబాబు ‘రైజ్’ !
పాతాళం నుంచి శిఖరాగ్రానికి - రెండేళ్లలోనే దేశ రాజకీయాన్ని శాసించే పవర్‌ఫుల్ లీడర్‌గా చంద్రబాబు ‘రైజ్’ !
Raghava Lawrence : మీరు ఎస్ అంటేనే... లేకుంటే... - పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్
మీరు ఎస్ అంటేనే... లేకుంటే... - పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
US Military Attack: పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Embed widget