తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా పాలకుల ఏజెంట్ అని, రాజధానిపై పొలిటికల్ మైలేజీ కోసం కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు.
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
Telangana Politics | 12 ఏళ్లు అయినా రాజధాని కట్టుకోలేకపోయారని, జగన్ MAVIGUN బాంబు పేల్చడంతో పొలిటికల్ మైలేజీ కోసం కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

BRS Politics | హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆంధ్రా పాలకుల ఏజెంట్ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ MAVIGUN బాంబు పేల్చారని.. రాజధానిపై పొలిటికల్ మైలేజీ రావడం లేదని కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. వానకాలం వస్తే చాలు ఏపీ రాజధాని మునిగిపోతుందని, సెక్రటేరియట్ లో సీఎం సీటు కింద నీళ్లు రాకుండా చూసుకోవాలని సెటైర్లు వేశారు. గత కొన్నేళ్లుగా తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రోళ్ల విగ్రహాలు పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దాని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఉద్యమ ఆకాంక్షలు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి ఏపీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందన్నారు. 12 ఏళ్లలో రాజధాని కూడా కట్టుకోలేకపోయారు ఏపీ పాలకులు అని విమర్శించారు.
బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు - సాధన-రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘12 ఏళ్లు అయినా రాజధాని కూడా కట్టుకోలేకపోయారు. గతంలో కర్నూలులో గూడారాలలో రాజధాని ఉందని, ఈ ప్రాంతాన్ని కలుపుకుని హైదరాబాద్ ను రాజధాని చేసుకున్నారు. రాష్ట్రం విడిపోయాక రెండు ప్రభుత్వాలు పాలించినా రాజధాని కట్టుకోలేకపోయారు. దాంతో కేంద్రం జోక్యం లేకుండా రాష్ట్రం చూసుకోవాల్సిన రాజధాని అంశాన్ని కూటమి నేతలు పార్లమెంట్ కు తీసుకెళ్లారు. పార్లమెంట్ లో అమరావతి ఏపీ రాజధాని అని తీర్మానం చేసుకున్నారు. రాష్ట్రం విషయంలో కేంద్రం జోక్యం వద్దని వైసీపీ అధినేత జగన్ దాన్ని వ్యతిరేకించారు.
జగన్ మావిగన్ బాంబుకు తట్టుకోలేక..
ఏపీ మాజీ సీఎం జగన్ మావిగన్ MAVIGUN అని రాజధాని ప్రతిపాదనతో బాంబు పేల్చారు. మచిలిపట్నం విజయవాడ గుంటూరులకు అన్యాయం జరుగుతుందని వీటిని అభివృద్ధి చేయాలని మావిగన్ అని బాంబు వేశారు. కేంద్రం వరకు వెళ్లి రాజధానిపై విజయం సాధిస్తే అమరావతి విషయంలో మైలేజీ రావడం లేదని, ఆంధ్ర ప్రజలను డైవర్షన్ చేయడానికి తెలంగాణ వాళ్ల మీద పడి ఏడవాలి. ఇందుకోసం సీఆర్డీఏలో జగనన్న చెప్పిన మావిగన్ ఏరియాను కలిపారు. మహానాడు నిర్వహణలో పాల్గొన్న తెలంగాణ నేత నుంచే తెలంగాణ అనే పదమే లేదని చెప్పించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఈ మాటలు అంటాడా. భారత రాజ్యాంగంలో తెలంగాణ పదం ఉంది చూసుకోండి. ఆంధ్రోళ్ల డిక్షనరీలో ఈ పదం ఉంటే ఎంత. లేకపోతే ఎంత. అది మాకు అవసరం లేదు.
వానకాలం వస్తుంది.. సీఎం సీటు కింద నీళ్లు రాకుండా చూసుకోండి
తెలంగాణలో విస్తరిస్తాం అని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అంటున్నారు. ఇప్పుడు వానకాలం వస్తుంది. ప్రతి వానకాలం మీ సెక్రటేరియట్లో మీ సీఎం సీటు కింద నీళ్లు రాకుండా చూసుకోండి. ప్రతి వానకాలంలో మీ రాజధాని మునిగిపోతుంది. ఏపీ ప్రజలకు ఇది ఎంత అవమానం. ఇప్పటికీ ఆపరేషన్ల కోసం ఆంధ్ర మంత్రులు హైదరాబాద్కు వస్తున్నారు. మీరంటే హెలికాఫ్టర్లు, కార్లలో వస్తారు. రాష్ట్ర ప్రజలకు హాస్పిటల్స్ కట్టరా. వసతులు కల్పించరా. అనంతపురం వాళ్లు బెంగళూరు పోతున్నారు. నెల్లూరు వాళ్లు చెన్నైకి పోవాలి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు హైదరాబాద్కు వస్తున్నారు. ఇదేనా ఏపీ ప్రజలకు మీరు అందిస్తున్న పాలన, కల్పించే సౌకర్యాలు అని’ కవిత ప్రశ్నించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి కవిత ఏమన్నారు?
ఏపీ పాలకులు రాజధాని విషయంలో ఎందుకు విమర్శించబడ్డారు?
12 ఏళ్లలో ఏపీ పాలకులు రాజధానిని కూడా కట్టుకోలేకపోయారని, రాష్ట్రం విడిపోయాక కూడా రాజధాని కట్టుకోలేకపోయారని కవిత విమర్శించారు.
జగన్ 'మావిగన్' బాంబు అంటే ఏమిటి?
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులకు అన్యాయం జరుగుతుందని, వాటిని అభివృద్ధి చేయాలని జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' ప్రతిపాదనను కవిత 'మావిగన్ బాంబు' అని అభివర్ణించారు.
వానకాలంలో ఏపీ సచివాలయం గురించి కవిత ఏమన్నారు?
ప్రతి వానకాలంలో ఏపీ సచివాలయంలో సీఎం సీటు కింద నీళ్లు రాకుండా చూసుకోవాలని, ప్రతి వానకాలంలో వారి రాజధాని మునిగిపోతుందని కవిత సెటైర్లు వేశారు.
ట్రెండింగ్ వార్తలు























