అన్వేషించండి

మహబూబాబాద్ లోక్‌సభకు త్రిముఖ పోటీ- రేసులో నెగ్గేదెవరు, తగ్గేదెవరో !

Telangana News: మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, బలరాం నాయక్ లు అధృష్టనాన్ని పరీక్షించుకుంటున్నారు.

Mahabubabad lok sabha Constituency MP Candidates: మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో పోటీ చేస్తున్న వారంతా ఎంపీలుగా పనిచేసిన వారే. వీరంతా మరోసారి అదృష్టాన్ని పరిక్షించుబోతున్నారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గమే మహబూబాబాద్. మూడు ప్రధాన పార్టీ నుండి పోటీ చేసేవారు ఎంపీలుగా చేయడంతోపాటు ముగ్గురు ఒకే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు కావడంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది.

ఒకే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు
మహబూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ముగ్గురి మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నియోజక వర్గంలో ఆదివాసి గిరిజనులు, లంబాడీ గిరిజన ఓట్లు ఎక్కువ. అంతేకాకుండా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకొని ఉంది. ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్ని ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించిన వారిని రంగంలోకి దింపాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా, మంత్రిగా పనిచేసిన బలరాం నాయక్, బీఆర్ఎస్  నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజీపీ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ లు బరిలో ఉన్నారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. వీరంతా గతంలో ప్రజలకు హామీల మీద హామీలు ఇచ్చిన వారే. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, లంబాడీల 12 శాతం రిజ్వేషన్లు, పోడు భూములకు పట్టాలు ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఇవ్వని నెరవేరాయా... పాత హామీలతో ప్రజల్లోకి వెళ్తారా అనేది ప్రచారం మొదలుపెడితే తెలియనుంది.
నర్సంపేట తప్ప మిగతావి ఎస్టీ స్థానాలే
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లంద, భద్రాచలం అసెంబ్లీ నియోజకర్గాలు వస్తాయి. ఇందులో నర్సంపేట తప్ప మిగితా ఆరు నియోజకవర్గాలు ఎస్టీ స్థానాలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం మినహా ఆరు స్థానాలలో కైవసం చేసుకుంది.  గెలుపే ఎవరి ధీమా వారే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆరుగురు ఎమ్మేల్యే లు కాంగ్రెస్ వారే కాబట్టి గెలుపు పై దీమాతో ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అరు గ్యారెంటీలు విజయానికి బాటలు వేస్తాయనుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ విజయం తమదే అనే భావనలో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు అయిన నాటి నుండి మహబూబాబాద్ పార్లమెంట్ ప్రజలు రెండు సార్లు గెలిపించారని మూడవసారి సైతం గెలిపిస్తరని, 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు కలిసివస్తాయనే దీమాలో ఉన్నారు.  కాంగ్రెస్, బీ అర్ ఎస్  పార్టీ లను పక్కన పెట్టి ఈ సారి బీజేపీ కు పట్టంకడతారని, అసెంబ్లీ ఎన్నికలకు , పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ని కోరుకుంటున్నారని కాషాయం పార్టీ భావిస్తోంది. ఇలా తమ బలాబలాలను బేరీజు వేసుకుని గెలుపుకోసం వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు మూడు పార్టీ అభ్యర్థులు.

తెలంగాణ వచ్చాక పెరిగిన పోటీ
అత్యధికంగా ఎస్టీ ఓటర్లు ఉన్న పార్లమెంట్ స్థానం మహబూబాబాద్. ఎస్టీల్లో ఆదివాసి గిరిజనులు, లంబాడీ గిరిజనులు ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థానానికి పోటీ పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీతారామ్ నాయక్ మొదటి ఎంపీగా గెలుపొందగా, మాలోత్ కవిత గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ప్రస్తుతం సిట్టింగ్‌గా ఉన్నారు.  అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అనూహ్యంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్లమెంట్‌ నియోజకవర్గంలో మొత్తం 14 లక్షల 28 వేల ఓట్లు ఉన్నాయి.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌పై బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత సుమారు 1 లక్ష 46 మెజారిటీ గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3 లక్షల 15 వేల 445 ఓట్లు సాధించి రెండవ స్థానం లో నిలిచ్చారు. 25వేల 487 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ ఐదవ స్థానంలోకి వెళ్లారు.

రాష్ట్రంలో అధికారం లో ఉన్నామన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది. అధికారాన్ని కోల్పోయిన  100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత తోడు గులాబీ పార్టీ ఓటు బ్యాంక్ కలిసి వస్తుందనీ బీఆర్ఎస్  ఆలోచనలో ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ప్రజలు విగిపోవడంతో పాటు కేంద్రంలో ప్రజలు మోడీని కోరుకుంటున్నారని బీజేపీ ఆశాభావంలో ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Embed widget