అన్వేషించండి

Warangal: వరంగల్ ఎంజీఎంలోకి మళ్లీ పాము, పేషెంట్ బెడ్ కిందే తాచుపాము ప్రత్యక్షం

ఆస్పత్రిలోని న్యూరో వార్డులో తాచుపాము కనపడడంతో జనం భయపడిపోయారు. పేషెంట్ బెడ్ కింద పామును రోగి బంధువులు గుర్తించారు.

వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్ ఎప్పుడూ లోపాలతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు ఓ పెషెంట్ ని కొరికిన ఘటన సంచలనం అయింది. ఆ తర్వాత ఏదో ఒక సమస్యతో ఎంజీఎం ఆస్పత్రి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఒకే నెలలో రెండుసార్లు పాము కనిపించడం ఆస్పత్రి నిర్వహణ తీరుకు అద్దం పడుతోంది. 

ఆదివారం (అక్టోబరు 23) సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో ఓ పాము కనిపించింది. ఆస్పత్రిలోని న్యూరో వార్డులో తాచుపాము కనపడడంతో జనం భయపడిపోయారు. పేషెంట్ బెడ్ కింద పామును రోగి బంధువులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది పాములు పట్టె వారిని పిలిపించి ఆ తాచుపామును దొరకబట్టారు. ఆ తర్వాత ఆ పామును పట్టి అడవిలో వదిలేశారు.

అక్టోబరు 13న కూడా..
అక్టోబర్ 13వ తేదీన కూడా ఓ పాము ఇదే ఆస్పత్రిలో కనిపించింది. ఫీవర్ వార్డులోని టాయిలెట్స్ లో తాచు పాము ఉన్నట్లుగా ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఈ పామును చూసి భయపడిపోయిన రోగులు, వారి బంధువులు బయటికి పరుగులు తీశారు. ఆస్పత్రి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే స్పందించిన సిబ్బంది స్నేక్ క్యాచర్స్ ను పిలిపించి ఆ పామును ప్రాణాలతో పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆ తర్వాత సీరియస్ గా స్పందించిన ఎంజీఎం సూపరింటెండెంట్ ఆస్పత్రిలో, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. వైద్యులు, సిబ్బంది అంతా కలిసి ఎంజీఎం పరిసరాలను శుభ్రం చేశారు. ఎలుకలు, పాములకు పాములకు ఆవాసంగా ఉన్న పుట్టలు, తుప్పలను తొలగించారు.

గతంలో పేషెంట్ ను కొరికిన ఎలుకలు
గత ఏప్రిల్‌లో ఓ పేషెంట్‌ను ఎలుకలు కొరికాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో వచ్చిన వ్యక్తిని ఐసీయూ(ICU)లో ఉంచికి చికిత్స అందిస్తున్నారు. ఆయన్ని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. వరంగల్‌లోని భీమరానికి చెందిన శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఏప్రిల్ 26 వ తేదీ సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. 27వ తేదీ ఉదయం లేచి చూసేసరికి శ్రీనివాస్ వేలును ఎలుకలు కొరికాయి. విషయాన్ని సిబ్బందికి చెప్పాడు. వెంటనే వాళ్లు చికిత్స చేశారు. మళ్లీ ఈ ఉదయం సుమారు మూడు గంటల ప్రాంతంలో ఎలుకలు శ్రీనివాస్ కాళ్లను తీవ్రంగా కొరికాయి. విపరీతమైన రక్తస్రావం జరిగింది. దీంతో ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీనిపై ప్రభుత్వం స్పందించి కారకులపై వేటు వేసింది. బాధితుణ్ని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేదు. ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు.

ఎలుకలు, పాముల కలకలంపై ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చర్చ మొదలైంది. అతి పురాతన భవనాలు, చుట్టూ చెత్త, పక్కనే మురికి కాలువ, మార్చురీ, పేషేంట్స్ అటెండెంట్స్ వదిలేసే ఆహారపు వ్యర్థాలే విష పురుగులు రావడానికి కారణమని చెబుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget