By: ABP Desam | Updated at : 07 May 2022 05:41 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి కేటీఆర్
Minister KTR : ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తో ఎప్పుడూ పొత్తులు పెట్టుకోమని ఆయన తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీతో ఎవరూ పొత్తులు పెట్టుకోరని తేల్చేశారు. టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్న రాహుల్ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ కు ఇతర పార్టీలకు బీ టీమ్, సీ టీమ్ అవ్వాల్సిన పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడే టీమ్ టీఆర్ఎస్ అన్నారు. ఇతర పార్టీలకు తొత్తులుగా ఉండే అవసరం టీఆర్ఎస్ కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరులోనే స్కామ్ లున్నాయన్నారు. ఎ టు జడ్ అన్ని కుంభకోణాలే అని ఎద్దేవా చేశారు. అగస్టా హెలికాప్టర్, స్పెక్ట్రమ్, బొగ్గు వరకు అన్ని కుంభకోణాలు కాంగ్రెస్ చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
గాంధీ భవన్ లో గాడ్సే
దేశంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొనే వారు ఎవరూ లేవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాలం చెల్లిన కాంగ్రెస్తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. తన సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని రాహుల్ ఇక కాంగ్రెస్ను గెలిపిస్తారా అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ గాంధీ భవన్ను గాడ్సేకు అప్పగించారన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్ గాంధీ చదివారన్నారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ అన్నారు. రైతుల ఆత్మహత్యలు తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప రైతు పార్టీ అయితే పంజాబ్లో ఎందుకు ఓడిపోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. వరంగల్ డిక్లరేషన్లో అసలు కొత్త అంశాలేవన్నారు. 2018లో చెప్పిన విషయాలే రాహుల్ గాంధీ మళ్లీ చెప్పారని విమర్శించారు. ధాన్యం సేకరణపై పార్లమెంటులో రాహుల్ గాంధీ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు.
వరంగల్ డిక్లరేషన్ ను నమ్మొద్దు
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎప్పుడూ నిరంతర విద్యుత్తు లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏవీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయాన్ని సంక్షోభంగా మారిస్తే సీఎం కేసీఆర్ గొప్ప శక్తిగా మార్చారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ రైతులకు పాతర వేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం జాతర లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలన్నారు. వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలను ఎవరూ నమ్మొద్దని కేటీఆర్ పేర్కొన్నారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, ఆగిపోయిన రైళ్లు
Breaking News Live Updates: కేబినెట్ నుంచి పంజాబ్ ఆరోగ్య మంత్రికి ఉద్వాసన
Hyderabad: వంట మాస్టర్తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎలక్షన్
Malla Reddy About Revanth Reddy: టార్గెట్ రేవంత్ రెడ్డి, మరోసారి రెచ్చిపోయిన మంత్రి మల్లారెడ్డి - మధ్యలో రేవంత్ పెళ్లి ప్రస్తావన
Punjab CM Bhagwant Mann : కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి - పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం
Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Quad Summit 2022: భారత్, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్లో మోదీతో బైడెన్