అన్వేషించండి

Minister KTR Comments on Hyderabad Development: 'అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం' - 24 గంటలూ తాగు నీరు, విద్యుత్ అందించడమే లక్ష్యమన్న కేటీఆర్

Hyderabad News: ఉమ్మడి ఏపీలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నీ అధిగమించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలకు నిరంతర విద్యుత్, తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.

Minister KTR: ఉమ్మడి ఏపీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని విద్యుత్, తాగునీటి సమస్యలు అధికంగా ఉండేవని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో (Telangana) గతంలో తరచూ విద్యుత్‌ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పారు. తొమ్మిదినరేళ్లలో సీఎం కేసీఆర్ (CM kcr) ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందామని వివరించారు. హైదరాబాద్‌లో రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల (Hyderabad Resident Welfare Association) ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'అభివృద్ధి నేడు తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉంది. మిషన్‌ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశాం. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నగరంలో 24 గంటల తాగునీటిని అందించాలన్నదే మా స్వప్నం. మెట్రోను రాబోయే 10 ఏళ్లలో 415 కి.మీ విస్తరించాలన్నదే మా ఎజెండా' అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

'అది మా బాధ్యత'

మిషన్‌ భగీరథ ద్వారా భాగ్యనగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా తాగు నీటి సమస్య లేకుండా చేశామని, హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించామని వివరించారు. పెట్టుబడులు తేవడం, మౌలిక వసతులు కల్పిస్తేనే విశ్వనగరం సాధ్యమన్న ఆయన మెట్రో రైలు సేవలు మరింత విస్తరించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మెట్రో రైలు సేవలు 70 కి.మీ విస్తరించామన్న ఆయన, రాబోయే పదేళ్లలో 415 కి.మీ విస్తరించాలన్నదే తన ప్రధాన ఎజెండా అని అన్నారు. మెట్రో సేవలు ఎక్కువైతేనే ట్రాఫిక్ సమస్య తీరుతుందని తెలిపారు. చెత్త సేకరణలో మరింత సమర్థ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని, పురపాలనలో రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో పౌరుల భాగస్వామ్యం కల్పించే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు.

'గెలుస్తాం.. సమస్యలు తీరుస్తాం'

ప్రజలు పని చేసే ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారని, ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తాము చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తుందని అన్నారు. 'హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయి. అభివృద్ధిలో హైదరాబాద్ న్యూయార్క్ తో పోటీ పడుతుంది. చారిత్రక మహా నగరంగా పేరున్న ఈ భాగ్యనగరాన్ని కాపాడుకోవాలి. గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైఓవర్లు నిర్మించాం, 39 చెరువులను నవీకరించాం. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తాం. జీహెచ్ఎంసీకి ఒక కమిషనర్ సరిపోరు. మరో ఇద్దరు ప్రత్యేక కమిషనర్లను నియమిస్తాం. వీరిలో ఒకరు పచ్చదనం, పార్కుల పరిరక్షణకు, మరొకరు చెరువుల పరిరక్షణ చూసే విధంగా చూస్తాం' అని వివరించారు.

Also Read: Revanth Reddy: 30వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ రూ.1.5 లక్షల కోట్లతో నిర్మించారు: రేవంత్ రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Embed widget