అన్వేషించండి

Telangana Politics: కాంగ్రెస్ సీట్లకు ఫుల్ డిమాండ్, బీఎస్పీతో పొత్తు పొడిచేనా?

Telangana Politics: ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Telangana Politics: ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉండడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది.   పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీఆర్‌ఎస్‌లో సీట్లు ఆశించి భంగపడిన నేతలను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఆ పార్టీ నేతలు. బీఎఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తి నేతలకు కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉంచింది. ఎవరైనా పార్టీలో చేరవచ్చని, వారికి తగిన గుర్తింపు ఇస్తామని చెబుతోంది.

బీఎస్సీతో చర్చలు
తాజాగా రాష్ట్రంలో వామపక్షాల పార్టీలో చర్చలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం పొత్తు దిశగా అడుగులు వేస్తోంది. అంతటితో ఆగకుంగా తమ బలాన్ని పెంచుకునేందుకు ఇతర పార్టీలతో పొత్తులకు యత్నిస్తోంది. తాజాగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకారం తెలిపిందని సమాచారం.  జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి I.N.D.I.Aలో ఇప్పటికే కాంగ్రెస్, బీఎస్పీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోను ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. 

ముగ్గురికి ప్రయోజనం
ఇప్పటికే వామపక్షాలు, బీఎస్పీ ఓటు శాతంపై రాష్ట్ర వ్యాప్తంగా సునీల్ కనుగోలు సర్వే నిర్వహించారు. ఇందులో వామపక్షాలకు 1.5 శాతం ఓటర్లు ఉన్నట్లు గుర్తించారని, ప్రవీణ్‌ కుమార్ సారధ్యంలోని బీఎస్పీ పార్టీ ఓటు శాతం 1 నుంచి 3 శాతానికి ఓట్లు పెంచుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ ఈ రెండు పార్టీలతో స్నేహపూర్వకం, సానుకూలంగానే ఉంటూ వస్తోంది. దీంతో బీఎస్పీ, వామపక్షాలతో పొత్తులకు ఇబ్బంది ఉండదని, సీట్లు సర్దుబాటు చేసుకుంటే మూడు పార్టీల ఓట్లు బదలాయించుకునేలా ముందుకు సాగాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఫలితంగా అన్ని పార్టీలు ప్రయోజనం పొందవచ్చని కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు సమాచారం. 

పది సీట్లు అడుగుతున్న బీఎస్పీ, వామపక్షాలు
అయితే రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉన్న పది స్థానాల్లో సీట్లు కేటాయించానలి బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కోరగా సీపీఐ, సీఎం సైతం తమకు పది స్థానాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌లో సీట్ల కోసం ఒత్తిడి అధికంగా ఉంది. దీంతో సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా సీట్లను సర్దుబాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో బీఎస్పీ 10కి  రెండు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్ సమాధానం కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. 

ప్రవీణ్ కుమార్‌కే కాగజ్ నగర్ సీటు
ఇప్పటికే సిర్పూర్ కాగజ్ నగర్‌లో నిర్వహించిన సర్వేలో ప్రవీణ్ కుమార్‌కు అనుకూలంగా ఉండడంతో ఆ స్థానాన్ని ఆయనకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదనంగా మరో సీటు ఆదిలాబాద్‌లో ఇచ్చి బీఎస్పీకి నచ్చజెప్పాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మునుగోడు, వైరా, కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్ కేటాయించాలని సీపీఐ కోరగా, ఇబ్రహీంపట్నం, భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, పినపాక టికెట్లు కావాలని సీపీఎం కోరుతన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. 

17న పెద్ద ఎత్తున చేరికలు
అధికార బీఆర్​ఎస్​లో అసంతృప్తిగా ఉన్న పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఈ నెల 17న బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో పార్టీలో పెద్ద ఎత్తున నేతల చేరికలు ఉండేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మైనం పల్లి హనుంతరావు మెదక్ సీటుతో పాటు మరో స్థానం ఇవ్వాలని కోరుతుండడంతో మెదక్‌కు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. మరో సీటు కావాలంటే కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. 

అలాగే వేముల వీరేశం, యెన్నం శ్రీనివాసులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరంతా సోనియా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే తుమ్మల నాగేశ్వర రావు పార్టీలో చేరితే ఖమ్మం లేదా పాలారు సీటు కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీలో అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తామని కేసీ వేణుగోపాల్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget