అన్వేషించండి

TS Cabinet Meet: నేడు తెలంగాణ కేబినేట్ భేటీ... సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం... దళిత బంధు, ఉద్యోగాల భర్తీ, వరిసాగుపై కీలక చర్చ

తెలంగాణ కేబినేట్ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్నాహ్నాం ప్రగతి భవన్ మంత్రి వర్గం సమావేశం కానుంది.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో గురువాం మధ్యాహ్నం కేబినెట్ భేటీకానుంది. కీలక అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గ సమావేశమవుతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం హుజూరాబాద్‌తో పాటు వాసాలమర్రిలో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది. మరో నాలుగు గ్రామాల్లోనూ దళితబంధును పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. మంత్రివర్గ సమావేశంలో పథకం అమలు తీరుపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు సమాచారం. 

ఉద్యోగాల భర్తీపై

గత కేబినెట్ సమావేశం జరిగినప్పుడు రెండ్రోజుల పాటు ఉద్యోగాల భర్తీపై సుదీర్ఘ చర్చ జరిగింది. కానీ నియామకాల ప్రక్రియ కొలిక్కిరాలేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఈ కేబినెట్‌ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏయే శాఖల్లో, ఎన్ని పోస్టుల భర్తీ చేయాలి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలపై నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాల భర్తీతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్‌ గత ఏడాది డిసెంబర్‌ 13న ప్రకటించారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని, తద్వారా ఏర్పడే కొత్త ఖాళీలను సైతం గుర్తించి భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే ఉద్యోగుల పదోన్నతులు, స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ కేడర్లుగా పోస్టుల విభజన, ఖాళీల గుర్తింపు ప్రక్రియలు సుదీర్ఘంగా సాగాయి. ఆర్థిక శాఖ ఇటీవలే ఈ అంశాలను కొలిక్కి తెచ్చింది. 65 వేలకుపైగా ఖాళీ పోస్టులను గుర్తించింది. ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. 50 వేల నుంచి 65 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఎత్తిపోతల పథకాలకు ఆమోదం!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ అవసరాలు, వనరుల సమీకరణ, దళితబంధు పథకానికి చట్టబద్ధత తదితర అంశాలపైనా కేబినెట్‌ చర్చించనున్నట్టు తెలుస్తోంది. వనరుల సమీకరణలో భాగంగా మైనింగ్‌ రంగంలో సంస్కరణల అమలు, భూముల వేలానికి సంబంధించిన పలు ప్రతిపాదనలపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతల పథకాలను నిర్మించాలనే ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వాటిపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతలను రూ.3,916 కోట్లతో, బసవేశ్వర లిఫ్టును రూ.2,750 కోట్లతో చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించారు. అయితే వ్యయాన్ని తగ్గించడం కోసం సీసీ లైనింగ్‌ పనులను తొలగించి మొత్తం రూ.4,500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పూర్తిచేయాలని, నాబార్డ్‌ నుంచి రూ.2 వేల కోట్ల సాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

వరిసాగుపై కీలక చర్చ

ఇక బాయిల్డ్‌ రైస్‌ కొనుగోళ్లపై కేంద్రం విముఖత నేపథ్యంలో వచ్చే యాసంగిలో వరి సాగుపై ప్రతిష్టంభన నెలకొంది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతులను సన్నద్ధం చేయడం, వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు తదితర అంశాలపై కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై కేంద్రం మొండి చేయి చూపడం. కేంద్రం తీరుపై ఎలాంటి విధానంతో ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు. ఇక గణేశ్ నిమజ్జనానికి హైకోర్టు అడ్డంకులు.. రాబోయే కాలంలో శాశ్వత పరిష్కారంపై కేబినేట్‌లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. 

Also Read: Green Tea: గ్రీన్ టీ తాగే పద్ధతి ఇది... ఎప్పుడుపడితే అప్పుడు తాగేయకూడదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Embed widget