అన్వేషించండి

TS Cabinet Meet: నేడు తెలంగాణ కేబినేట్ భేటీ... సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం... దళిత బంధు, ఉద్యోగాల భర్తీ, వరిసాగుపై కీలక చర్చ

తెలంగాణ కేబినేట్ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్నాహ్నాం ప్రగతి భవన్ మంత్రి వర్గం సమావేశం కానుంది.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో గురువాం మధ్యాహ్నం కేబినెట్ భేటీకానుంది. కీలక అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గ సమావేశమవుతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం హుజూరాబాద్‌తో పాటు వాసాలమర్రిలో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది. మరో నాలుగు గ్రామాల్లోనూ దళితబంధును పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. మంత్రివర్గ సమావేశంలో పథకం అమలు తీరుపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు సమాచారం. 

ఉద్యోగాల భర్తీపై

గత కేబినెట్ సమావేశం జరిగినప్పుడు రెండ్రోజుల పాటు ఉద్యోగాల భర్తీపై సుదీర్ఘ చర్చ జరిగింది. కానీ నియామకాల ప్రక్రియ కొలిక్కిరాలేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఈ కేబినెట్‌ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏయే శాఖల్లో, ఎన్ని పోస్టుల భర్తీ చేయాలి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలపై నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాల భర్తీతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్‌ గత ఏడాది డిసెంబర్‌ 13న ప్రకటించారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని, తద్వారా ఏర్పడే కొత్త ఖాళీలను సైతం గుర్తించి భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే ఉద్యోగుల పదోన్నతులు, స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ కేడర్లుగా పోస్టుల విభజన, ఖాళీల గుర్తింపు ప్రక్రియలు సుదీర్ఘంగా సాగాయి. ఆర్థిక శాఖ ఇటీవలే ఈ అంశాలను కొలిక్కి తెచ్చింది. 65 వేలకుపైగా ఖాళీ పోస్టులను గుర్తించింది. ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. 50 వేల నుంచి 65 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఎత్తిపోతల పథకాలకు ఆమోదం!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ అవసరాలు, వనరుల సమీకరణ, దళితబంధు పథకానికి చట్టబద్ధత తదితర అంశాలపైనా కేబినెట్‌ చర్చించనున్నట్టు తెలుస్తోంది. వనరుల సమీకరణలో భాగంగా మైనింగ్‌ రంగంలో సంస్కరణల అమలు, భూముల వేలానికి సంబంధించిన పలు ప్రతిపాదనలపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతల పథకాలను నిర్మించాలనే ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వాటిపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతలను రూ.3,916 కోట్లతో, బసవేశ్వర లిఫ్టును రూ.2,750 కోట్లతో చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించారు. అయితే వ్యయాన్ని తగ్గించడం కోసం సీసీ లైనింగ్‌ పనులను తొలగించి మొత్తం రూ.4,500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పూర్తిచేయాలని, నాబార్డ్‌ నుంచి రూ.2 వేల కోట్ల సాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

వరిసాగుపై కీలక చర్చ

ఇక బాయిల్డ్‌ రైస్‌ కొనుగోళ్లపై కేంద్రం విముఖత నేపథ్యంలో వచ్చే యాసంగిలో వరి సాగుపై ప్రతిష్టంభన నెలకొంది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతులను సన్నద్ధం చేయడం, వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు తదితర అంశాలపై కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై కేంద్రం మొండి చేయి చూపడం. కేంద్రం తీరుపై ఎలాంటి విధానంతో ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు. ఇక గణేశ్ నిమజ్జనానికి హైకోర్టు అడ్డంకులు.. రాబోయే కాలంలో శాశ్వత పరిష్కారంపై కేబినేట్‌లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. 

Also Read: Green Tea: గ్రీన్ టీ తాగే పద్ధతి ఇది... ఎప్పుడుపడితే అప్పుడు తాగేయకూడదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Embed widget