అన్వేషించండి

Revanth Reddy vs KTR: రాష్ట్రం ఏర్పాటయ్యాకే తెలంగాణలో డ్రగ్స్! సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

Drugs in Telangana: ఉమ్మడి ఏపీలో గంజాయి, డ్రగ్స్ మాఫియా లేకుండే.. ఏదో చోట లిక్కర్ సమస్య ఉండేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Telangana CM Revanth Reddy Speech on Drugs: హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో గంజాయి, డ్రగ్స్ మాఫియా లేకుండే.. ఏదో చోట లిక్కర్ సమస్య ఉండేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. కానీ టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో ఎటు చూసినా గంజాయి దాడులేనని, సింగరేణి కాలనీలో పసిపాపపై గంజాయి మత్తులో లైంగిక దాడి జరగడం దురదృష్టకరం అన్నారు. తెలంగాణలో దొరుకుగుతున్న డ్రగ్స్ కు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. డ్రగ్స్ కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసి, ఆ అధికారిని అర్ధాంతరంగా ఎక్కడికి పంపించారని ప్రశ్నించారు. విచారణలో లోపాలను బయటపెట్టడానికి గతంలో హైకోర్టును ఆశ్రయించామన్నారు. 

హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా గత ప్రభుత్వం డ్రగ్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, హార్డ్ డిస్కులను ఈడీకి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించిన మాట నిజం కాదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. పంజాబ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ నాశనం చేసిందని, పేద మహిళలు సైతం కుటుంబంలో మగవారికి డ్రగ్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. కనుక రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లాంటివి లేకుండా చూడాలని, వారి వెనుక ఎంత పెద్దవారున్నా బయటకు లాగి చర్యలు తీసుకుందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుండగా, ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్..
డ్రగ్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసిందన్నట్లు మాట్లాడుతున్నారు, కానీ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడే టీఎస్ న్యాబ్ ను అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తి సీవీ ఆనంద్ ను అపాయింట్ మెంటె చేశామన్నారు. పంజాబ్ లో నిన్న మొన్నటివరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ కు తెలియదన్నారు. ఉడ్తా పంజాబ్ అనే సినిమా కూడా పంజాబ్ లో డ్రగ్స్ సమస్యపై వచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. డ్రగ్స్ పై చర్యలు, ఉక్కుపాదం మోపాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండా యాంటో నార్కోటిక్ బ్యూరో లాంటివి ఎందుకు ఏర్పాటు చేస్తాం, సీవీ ఆనంద్ లాంటి అధికారికి బాధ్యతలు ఎందుకు అప్పగిస్తామన్నారు కేటీఆర్. 

షీ టీమ్స్, డ్రగ్స్ కు సంబంధించిన అంశంపై సైతం కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భిన్నాభిప్రాయాలు అని ప్రస్తావించారు. మేం మా అభిప్రాయాలు చెప్పనిదే భిన్నాభిప్రాయాలు ఎలా వచ్చాయో తనకు తెలియడం లేదన్నారు. తాము ఏర్పాటు చేసిన సంస్థపై కాంగ్రెస్ క్రెడిట్ కోసం ప్రయత్నిస్తుందన్నారు. మేం ఏం మాట్లాడినా మేనేజ్ మెంట్ కోటా అని అంటున్నారు. అయితే ఢిల్లీకి వెళ్లి టీపీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నది ఎవరు, పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ఆ పదవి తెచ్చుకున్నారని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. 

 డ్రగ్స్ విషయంపై సహకరించాలని కోరితే పరివర్తనలో మార్పు వస్తుందని భావించానని, కానీ కేటీఆర్ తనను నిరాశ పరిచారని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఎస్ న్యాబ్ అని పేపర్ పై  వివరాలు పొందుపర్చి, సీవీ ఆనంద్ కు అడిషనల్ ఛార్జ్ ఇచ్చారని రేవంత్ చెప్పారు. 300 మంది సిబ్బందిని ఇస్తే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని సంబంధిత అధికారి ప్రభుత్వానికి చెబితే.. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని రేవంత్ రెడ్డి అసలు విషయాన్ని వెల్లడించారు. సిబ్బంది, వాహనాలకు ఎంత ఖర్చయినా వెచ్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డ్రగ్స్ లాంటి విషయాల్లోనూ రాజకీయాలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget