అన్వేషించండి

Revanth Reddy Delhi Tour: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం

Revanth Reddy Meets Kishan Reddy | ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ భేటీ ఏర్పాటు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో రేవంత్ రెడ్డి ఢిల్లీలో భేటీ.
  • గాంధీ సరోవర్ భూములపై కృతజ్ఞతలు; రక్షణ ప్రాజెక్టులు చర్చించారు.
  • కిషన్ రెడ్డి చొరవతో అశ్విని వైష్ణవ్‌తో సీఎం రేవంత్ భేటీ.
  • మెట్రో విస్తరణ, ఐఆర్ఎఫ్ రుణాలపై కేంద్రంతో కీలక చర్చలు.

Revanth Reddy Delhi Tour | న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. సోమవారం ఉయదం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ కీలక సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు రక్షణ రంగ భూములు, ప్రాజెక్టుల అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. లంగర్ హౌస్ బాపూ ఘాట్ వద్ద చేపడుతున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించినందుకుగాను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


Revanth Reddy Delhi Tour: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్, డీఆర్‌డీవో ప్రాజెక్టులపై చర్చ
దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశం అయినందువల్ల ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయంలో ఎయిర్ ఫోర్స్ టెర్మినల్‌తో పాటు కార్గో, ఎమ్‌ఆర్‌వో (MRO), హ్యాంగర్‌ సౌకర్యాలను కల్పించాలని రక్షణ మంత్రిని ఆయన కోరారు. హ్యాంగర్స్‌ ఏర్పాటుకు ఆదిలాబాద్‌ విమానాశ్రయం ఎంతో అనుకూలంగా ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. వీటితో పాటు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ప్రతిపాదిత డీఆర్‌డీవో (DRDO) ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు.

 కిషన్ రెడ్డి చొరవతో సాయంత్రం అశ్విని వైష్ణవ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ రాజకీయాల్లో నేటి సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. నిత్యం విమర్శలు గుప్పించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఢిల్లీలో ఒకే సమావేశంలో పాల్గొనబోతున్నారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సాయంత్రం 6.30 గంటలకు సీఎం రేవంత్, కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా అశ్విని వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయగా, ఆయన సానుకూలంగా స్పందించి భేటీని ఖరారు చేశారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి కూడా  పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారని సమాచారం. 

Also Read: Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?

ఈ కీలక సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ టేకోవర్, మెట్రో ఫేజ్-2 విస్తరణతో పాటు, వీటికి సంబంధించిన ఐఆర్ఎఫ్ (IRCF) రుణాల విడుదల అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాష్ట్ర నిధులు, అభివృద్ధి విషయంలో లేఖల యుద్ధం కొనసాగిస్తున్న రేవంత్, కిషన్ రెడ్డి ఢిల్లీలో ఒకే సమావేశంలో పాల్గొనుండటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ తర్వాత తెలంగాణ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని కాంగ్రెస్ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. 

Frequently Asked Questions

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎందుకు సమావేశమయ్యారు?

రాష్ట్రానికి సంబంధించిన పలు రక్షణ రంగ భూములు, ప్రాజెక్టుల అంశాలపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాద్‌లోని విమానాశ్రయంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి ఏమిటి?

ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎయిర్ ఫోర్స్ టెర్మినల్, కార్గో, ఎమ్‌ఆర్‌వో, హ్యాంగర్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగే సమావేశంలో ఎవరు పాల్గొననున్నారు?

సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఈ సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.

అశ్విని వైష్ణవ్‌తో సమావేశంలో చర్చించబడే ముఖ్య అంశాలు ఏమిటి?

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ టేకోవర్, మెట్రో ఫేజ్-2 విస్తరణ మరియు వాటికి సంబంధించిన ఐఆర్ఎఫ్ రుణాల విడుదల అంశాలపై చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget