By: ABP Desam | Updated at : 19 Sep 2023 04:51 PM (IST)
రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా పాత పార్లమెంటు భవన చరిత్ర గురించి మాట్లాడుతూ ప్రధాని మోదీ తెలంగాణ విభజన గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం.. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే అని అన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ తెలుగులో పోస్టు చేశారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇవే
75 ఏళ్లుగా దేశానికి సేవలు అందిస్తున్న పార్లమెంట్ భవనం గురించి మాట్లాడిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజన నాటి పరిస్థితులు వివరించారు. అంతకుముందు అదే పార్లమెంటు భవనంలో చాలా రాష్ట్రాల విభజన జరిగిందని గుర్తు చేశారు. అలా జరిగిన సమయంలో రెండు రాష్ట్రాల్లోని ప్రజలంతా హ్యాపీగా సంబరాలు చేసుకున్నారని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన టైంలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించలేదని చెప్పుకొచ్చారు.
దేశంలో కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పాటు సైతం ఇదే పార్లమెంట్ భవనంలో జరిగిందన్నారు. అయితే గతంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటులా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయి హయాంలో ఆ మూడు రాష్ట్రాలను ఓ ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేయగా, ఆ రాష్ట్రాల్లోనూ ప్రజలు సంబరాలు చేసుకున్నారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ హయాంలో జరిగిన ప్రక్రియ మాత్రం సరిగా జరగలేదన్నారు. ఈ విభజనతో ఏపీ, తెలంగాణగా తెలుగు రాష్ట్రాలు మారిపోయినా.. రెండు ప్రాంతాల్లోనూ సంబరాలు జరగలేదన్నారు. రెండు చోట్ల అసంతృప్తి మిగిలిందని, తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందంటూ మోదీ సంచనలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎన్నో బలిదానాలు జరగడంతో పాటు రక్తపుటేర్లు పారాయని అన్నారు. అందువల్లే కొత్త రాష్ట్రం ఏర్పడినా తెలంగాణలో సంబరాలు చేసుకోలేకపోయారని మోదీ వ్యాఖ్యానించారు.
తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రసంగం ఎందరికో స్ఫూర్తినిస్తుందని అన్నారు. మాజీ ప్రధానుల సేవల్ని పేరుపేరునా కొనియాడారు. జీఎస్టీ, ఒకే దేశం - ఒకే పింఛను, జమ్మూకశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు లాంటి బిల్లుపై మోదీ మాట్లాడారు. ఎన్నో సేవలు అందించిన పార్లమెంట్ బిల్డింగ్ లో నేడు చివరిసారి సమావేశం అవుతున్నాం అని అన్నారు.
TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
Epuri Somanna : షర్మిల పార్టీకి షాక్ - బీఆర్ఎస్లో చేరనున్న ఏపూరి సోమన్న !
Puvvada Ajay Kumar: అదే జరిగితే ఇవే నాకు చివరి ఎన్నికలు - మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు
Telangana Congress : ఢిల్లీలో కాంగ్రెస్ టిక్కెట్ల కసరత్తు - ఆశావహులంతా హస్తిన బాట !
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన
Agent OTT Release Date: ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!
/body>