అన్వేషించండి

Mancherial Latest News: మందమర్రి ప్రజలకు గుడ్ న్యూస్‌- మంచినీటి సమస్యపై కీలక ప్రకటన చేసిన మంత్రి వివేక్‌  

Mancherial Latest News: మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్‌ మందమర్రి నీటి సమస్యకు పరిష్కారం చూపే ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కొటిగా అమలు చేస్తోందని అన్నారు.  

Mancherial Latest News: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం. నిరుపేద ప్రజలకు గూడు కల్పించే ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు చొప్పున కేటాయించి అర్హత గల లబ్ధిదారులకు అందిస్తున్నాం. అర్హత కలిగి ఉండి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానీ వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు" అని తెలిపారు. 

Mancherial Latest News: మందమర్రి ప్రజలకు గుడ్ న్యూస్‌- మంచినీటి సమస్యపై కీలక ప్రకటన చేసిన మంత్రి వివేక్‌  

గత 10 సంవత్సరాలలో అందని రేషన్ కార్డులను అర్హత గల ప్రతి ఒక్కరికి అందించి చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు. సన్న బియ్యం పంపిణీ కోసం 9 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. నూతన గనుల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మందమర్రి ప్రాంతంలో రహదారులు, మురుగు కాలువల వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించడం జరిగిందని, 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. 


Mancherial Latest News: మందమర్రి ప్రజలకు గుడ్ న్యూస్‌- మంచినీటి సమస్యపై కీలక ప్రకటన చేసిన మంత్రి వివేక్‌  

మందమర్రి ప్రజలను ఎప్పటి నుంచే పట్టి పీడిస్తున్న నీటి సమస్యు మంత్రి పరిష్కారాన్ని చూపారు. అమృత్ పథకం ద్వారా శాశ్వత మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యావ్యవస్థను పటిష్టపరిచే చర్యలలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించి, దాదాపు 10 వేల మంది నిష్ణాతులైన ఉపాధ్యాయులను భర్తీ చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విద్య సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. 

Mancherial Latest News: మందమర్రి ప్రజలకు గుడ్ న్యూస్‌- మంచినీటి సమస్యపై కీలక ప్రకటన చేసిన మంత్రి వివేక్‌  

ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం 500 రూపాయలకే రాయితీ గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 10 లక్షల రూపాయల పరిమితితో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మండలంలోని 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

తర్వాత క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో 6 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో నూతనంగా పునరుద్ధరించిన మెప్మా కార్యాలయాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, మందమర్రి మండల తహసిల్దార్ సతీష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఈ కార్యాలయం 567 స్వయం సహాయక సంఘాలలోని 5 వేల 948 మంది మహిళా సభ్యులు సమావేశాలు, బ్యాంకు సంబంధిత కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణ సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థిక స్వావలంబన పొందాలని సూచించారు. తమ కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. 

మహిళ సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే రాయితీ గ్యాస్ సిలిండర్ అందించడంతో పాటు బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సదుపాయం కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం క్యాతనపల్లి పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు 2 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget