అన్వేషించండి

Nizamabad News: మరోసారి లైమ్‌లైట్‌లోకి బాబ్లీ ప్రాజెక్టు- ఈసారి మాత్రం వేరేలా

తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు. అందర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందం మేరకు ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరిచారు. జూలై 1 నుంచి ఆక్టోబర్29 వరకు తెరిచి ఉండనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు అధికారులు. అంతరాష్ట్ర నది జలాల ఒప్పందంలో భాగంగా మహారాష్ట్రలో ఉన్న బాబ్లి గేట్లను అధికారులు ఎత్తారు. గోదావరి నదిపై మహారాష్ట్రలో ఉన్న బాబ్లిగేట్లను ప్రతి ఏడాది జూలై 1న ఎత్తడం ఒప్పందంలో భాగం. అక్టోబర్ వరకు బాబ్లిగేట్లను ఎత్తి ఉంచుతారు. గోదావరి నదిపై నిర్మించిన బాబ్లి ప్రాజెక్టులో ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంది. బాబ్లీ డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనాధ్ ఖేడుకర్, సీడబ్ల్యుసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, చక్రపాణి, ఎస్సారెస్పీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవి వంశీయులు గేట్లను ఎత్తి నీటిని దిగవకు వదిలారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 23.432 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం ఉదయం 3,372 క్యూసెక్కుల ఇన్ ప్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందని తెలిపారు అధికారులు. 

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు జరిగింది

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ మాత్రం పొసగలేదు. మహారాష్ట్ర భూభాగంలో ఆ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. ఆంధ్రప్రదేశ్ ఎంత వారించినా వినలేదు. చివరకి సుప్రీం కోర్టు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తీర్పును మహారాష్ట్రకు అనుకూలంగా ఇచ్చింది. దీంతో సీడబ్ల్యూసీ అనుమతులతో నాందేడ్ జిల్లాలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లతో 2004లో రూపు దిద్దుకుంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టును నిర్మించారు. ఎందుకంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రధానంగా వరద వచ్చేది గోదావరి నది నుంచే... గోదావరి మహారాష్ట్ర నాసిక్ నుంచి మొదలై వరద శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. అప్పటికే మహారాష్ట్ర గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన చిన్న మధ్యతరగతి 12 ప్రాజెక్టులకుపైగా నిర్మించింది. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గిపోతుందన్న ఉద్దేశ్యంతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు  జరిగాయ్.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగున నుంచి 31 కిలో మీటర్ల దూరంలో బాబ్లీ ప్రాజెక్టు ఉంటుంది. 2.74 టీఎంసీల సామర్ధ్యంతో బాబ్లీ ప్రాజెక్టును నిర్మించారు. మొత్తం 14 గేట్లతో ఈ బ్యారేజీ నిర్మాణం జరిగింది. జూలై 1 నుంచి అక్టోబర్ 29 వరకు అంటే 120 రోజులపాటు వర్షాకాలం సీజన్‌లో బాబ్లీ గేట్లు తెరిగి ఉంటాయ్. ఈ మధ్య కాలంలో వచ్చిన వరదే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో స్టోరేజ్ అవుతాయ్. మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిసి గోదావరి నది ప్రవహిస్తేనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ వస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయ్. ఈ గేట్ల మరమ్మతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల రూపాయలను మంంజూరు చేసింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Embed widget