అన్వేషించండి

బాన్సువాడలో ఉద్రిక్తత- కేంద్రమంత్రి కాన్వాయ్‌ అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బాన్సువాడ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమె వచ్చినట్లు తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నిర్మలా సీతారామన్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. 

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాన్వాయ్ ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తోందని ఆరోపిస్తూ... గో బ్యాక్ నిర్మలా సీతారామన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పాటాపోటీగా నినాదాలు చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

వ్యాక్సినేషన్ సెంటర్ పరిశీలించిన కేంద్రమంత్రి..

తెలంగాణలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ రెండో రోజు కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడలో ఆమె పర్యటించారు. ఈ క్రమంలోనే వివాదం చోటు చేసుకుంది. దీని తర్వాత బీర్కూర్ మండల కేంద్రంలో రేషన్ షాప్ వద్ద లబ్ధిదారులతో ఆమె మాట్లాడారు. అనంతరం కోటగిరిలో వ్యాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించి ఆ తర్వాత రుద్రుర్ లో ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. నిన్న కామారెడ్డి జిల్లాలో తొలి రోజు పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు- కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు..

మిగులు ఉన్న తెలంగాణను అప్పులమయంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే చెందుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రం బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడం లేదని బడ్జెట్ లో చాలా అప్పులు చూపించడం లేదన్నారు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టే ప్రతీ పిల్లాడిపై లక్షా 25 వేల అప్పు ఉందని అన్నారు. దేశం మొత్తం తిరిగే ముందు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి తెలుసుకోవాలని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లుగా పెంచుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని తెలిపారు. తెలంగాణలో ప్రతి వంద మందిలో 99 మంది రైతులు అప్పుల పాలయ్యారని ఆరోపించారు. 

ఐఏస్ అధికారివి.. ఆమాత్రం తెలియదా..?

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంతని కలెక్టర్‌ను ప్రశ్నించారు. తనకు తెలియదన్న కలెక్టర్ సమాధానం చెప్పడంతో... ఐఏఎస్ ఆఫీసర్ అయిన మీకు ఆమాత్రం తెలియదా అంటూ కేంద్రమంత్రి ఫైర్ అయ్యారు. అరగంటలో అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుని చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బియ్యంలో ఒక్క కేజీకి 35  రూపాయలు ఖర్చు అవుతుందని.. అందులో 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే రూపాయి ప్రజలు ఇస్తారని తెలిపారు. మిగతా 29 రూపాయలను కేంద్రం ఖర్చు చేస్తుందని... అలాంటప్పుడు ప్రధాని మోడీ ఫ్లెక్సీ రేషన్ షాపులో పెట్టడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget