అన్వేషించండి

Mancherial Latest News: సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలి.. దాడులు సరికాదు: మంచిర్యాల జిల్లా కలెక్టర్

Adilabad News Today | సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని, దాడులకు పాల్పడకూడదని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

Mancherial District Collector | మంచిర్యాల: సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో డీసీపీ ఎ.భాస్కర్ తో కలిసి దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని, దాడులకు పాల్పడకూడదని తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని దమ్మన్నపేట, మామిడిగూడ గ్రామాలలో జరిగిన ఘటనపై సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా సామరస్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అటవీ ప్రాంతాలలో కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద గిరిజనులను వెదురు పంట సాగుకు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.


Mancherial Latest News: సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలి.. దాడులు సరికాదు: మంచిర్యాల జిల్లా కలెక్టర్

అటవీ ప్రాంతాలలోని గిరిజనులు అటవీ భూములలో వెదురు పంట సాగు చేసేందుకు గుంతలు తవ్వడం, మొక్కలకు నీటిని అందించడం, యూరియా ఇతర పనులకు నిధులు మంజూరు చేయడమే కాకుండా వెదురు పంటను విక్రయించుకుని ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత అందించనున్నట్లు వెల్లడించారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భౌతిక దాడులకు పాల్పడవద్దన్నారు.

ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో విషాదం.. తల్లి, ముగ్గురు చిన్నారులు మృతి

ప్రమాదవశాత్తు వాగులో పడి తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి చెందిన మోర్లే బుజ్జి బాయి అనే మహిళ పొలం వద్ద పనిచేస్తున్న సమయంలో ఆమె కుమారుడు గన్ను,తోపాటు మహేశ్వరి, శశికళ అనే మరో ఇద్దరు బాలికలు నీటి కోసం ఓ కుంట వద్దకు వెళ్లారు. అనంతరం వారంతా కుంటలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో చిన్నారులు నీటిలో మునిగిపోయారు.


Mancherial Latest News: సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలి.. దాడులు సరికాదు: మంచిర్యాల జిల్లా కలెక్టర్

అది గమనించిన మహిళ.. చిన్నారులను రక్షించేందుకు నీటి గుంతలోకి దిగింది. గుంతలో నీరు, బురద ఎక్కువగా ఉండటంతో ఆమెతో సహా పిల్లలంతా ఇరుక్కుపోయారు. చివరికి ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారిని మోర్లే బుజ్జిబాయి (35), మోర్లే గన్ను (12), వాడే మహేశ్వరి(9), అదే శశికళ(9)గా గుర్తించారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Jana Nayagan Producer: 'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
Embed widget