అన్వేషించండి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో లంపిస్కిన్ వ్యాధి కలకలం- అధికారులు అప్రమత్తం

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో లంపిస్కిన్ కలకలం రేపుతోంది. వ్యాధి వ్యాప్తిపై అనుమానాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పశువులకు లంపిస్కిన్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పాడి రైతుల్లో ఆందోళన నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం సాటాపూర్ పశువుల సంత ఫేమస్. ఇక్కడ మహారాష్ట్ర నుంచి భారీగా పశువులను తీసుకొస్తారు. అక్కడి నుంచి వస్తున్న పశులవుల వల్ల నిజామాబాద్‌ జిల్లాలో పశువులకు లంపిస్కిన్ వ్యాధి వ్యాపించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 
 
లంపిస్కిన్ వ్యాప్తితో పశువుల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందన్న ఆవేదన చెందుతున్నారు. క్రయవిక్రయాలు జరిగే పశువుల సంతతో వ్యాధి వ్యాప్తి జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లంపి స్కిన్‌తో ఉమ్మడి జిల్లాలో పశువులు ప్రమాద బారిన పడుతోందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. 
 
వేగంగా లంపిస్కిన్ వ్యాధి వ్యాప్తి..
 
ఉమ్మడి జిల్లాలో 3లక్షలకుపైగా పశువులు ఉన్నాయని సంబంధిత శాఖ అంచనా వేస్తోంది. ఇందులో తెల్లజాతి ఆవులు, గేదెలు ఉన్నాయి. ఆవుల్లోనే లంపి స్కిన్ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోంది. నందిపేట, రెంజల్ మండలంలో 5 ఆవులకు లంపి స్కిన్ లక్షణాలు బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. నవీపేట, డిచ్‌పల్లి మాక్లూర్, వర్ని, చందూరు మండలాల్లో చాలా పశువులకు వైరస్ బారిన పడ్డట్టు పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
వ్యాధి సోకిన పశువుల శరీరంపై బొబ్బలు రావడం, పూర్తిగా బలహీనపడడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు రైతులు. పశువులపై బొబ్బలు కనిపించగానే పాడి రైతులు వాటిని మందల నుంచి వేరు చేస్తున్నారు. మరి కొందరికి వ్యాధిపై అవగాహన లేక మందలోనే ఉంచుతున్నారు. దీంతో తెల్లజాతి ఆవుల్లో వేగంగా లంపిస్కిన్ విస్తరిస్తోందని అంటున్నారు. పశువైద్యాధికారులు వ్యాధి లక్షణాలు బయట పడగానే గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. 40వేలకుపైగా తెల్లజాతి పశువుల్లో వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 7 వేల పశువులకు వ్యాక్సినేషన్ చేశారు.
 
జిల్లా సరిహద్దుల్లోని మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నుంచి సాటాపూర్ మార్కెట్‌కు బోధన్ సాలూరా, కందకుర్తి మీదుగా పశువులు తరలిస్తారు. కర్నాటకలోని ఔరద్, బీదర్ జిల్లాల నుంచి మాసాయిపేట్, సలాబత్‌పూర్, జుక్కల్ నుంచి పశువులు తరలిస్తారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ అంగడిలో ప్రతి శనివారం పశువుల మార్కెట్‌లో మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు జిల్లాల నుంచి పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. సాటాపూర్ అంగడికి సుమారు 10 వేల వరకు పశువుల విక్రయాలు ఉంటాయి. జిల్లా నుంచి మహారాష్ట్ర వైపు పశువుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. జిల్లాలోని పలుచోట్ల కొనసాగుతున్న పశువుల మార్కెట్ లను  బంద్ చేయాలని పాడిరైతులు కోరుతున్నారు. సాటాపూర్, వర్ని, బోధన్ , బోర్గాం తదితర ప్రాంతాల్లో, మార్కెట్ లపై కూడా ఆంక్షలు విధించాలని డిమాండ్ వస్తోంది. 
 
లంపి స్కిన్ వ్యాధి వ్యాప్తి చెందకుండా పశుసంవర్ధక శాఖ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయాలని ప్రజలు రిక్వస్ట్ చేస్తున్నారు. పాడి రైతులకు అవగాహన కల్పించాలని అడుగుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన పశువులకు యుద్ధ ప్రాతిపదికన గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. గోట్ పాక్స్ వ్యాక్సిన్ కూడా అన్ని పశు వైద్యశాలలకు పంపిణీ చేయాలంటున్నారు. పాడి పరిశ్రమ ఎక్కువగా ఉన్న బోధన్, బాన్స్ వాడ, నిజామాబాద్ రూరల్ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అవగాహన శిబిరాలు నిర్వహించాలి. పాడి రైతులకు లంపి స్కిన్ వ్యాధి లక్షణాలు, దాని తీవ్రతను వివరించాలని వేడుకుంటున్నారు. పశువుల మందలో లంపిస్కిన్ లక్షణాలు కనిపించగానే పశువైద్యులకు రైతులు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి సోకిన పశువును ఇతర పశువులకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Embed widget