అన్వేషించండి

Eatala Rajender: మంత్రుల మాటలు కేసీఆర్ కేర్ చెయ్యలేదు, అందుకే ఈ సమస్యలు - ఈటల రాజేందర్

కామారెడ్డి బీజేపీ ఇంఛార్జి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష పూర్తిగా న్యాయబద్ధమైందని, అతనికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఈటల రాజేందర్ వెల్లడించారు.

పెద్ద నాయకుల అవసరాలు తీర్చుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకువచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ధరణితో తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కేవలం కమీషన్ల కోసమే సీఎం కేసీఅర్ ధరణి తెచ్చారని, దీనివల్ల రైతులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ కేవలం కేసీఆర్ కోసం మాత్రమే ఉందని, ఆయన కుటుంబం కోసమే పని చేస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రజలు, రైతుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

తెలంగాణలో కేసీఆర్ చెప్పిందే వేదంలా నడుస్తుందని విమర్శించారు. కామారెడ్డి బీజేపీ ఇంఛార్జి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష పూర్తిగా న్యాయబద్ధమైందని, అతనికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంతో పోరాడి సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి దీక్ష విరమించాలని ఈటల కోరారు. ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ ధరణి సమస్య కేవలం కామారెడ్డి జిల్లా సమస్యే కాదని, రాష్ట్రంలో ఉన్న రైతులందరి సమస్య అని ఈటల అన్నారు. కాబట్టి బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లుగా మండిపడ్డారు. 

రైతుల సమస్యలు పరిష్కరించడంలో దేశంలోనే ధరణి మంచి ఫలితం సాధిస్తుందని కేసీఆర్ ఈ పోర్టల్ తెచ్చారు. ఫిర్యాదుల రూపంలో సుమారు 20 లక్షల దరఖాస్తులు ధరణి సమస్యలపై వచ్చాయి. ఈ పోర్టల్ ద్వారా వస్తున్న సమస్యలు చూసి ఇది వద్ద చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. కేసీఆర్ ఎవరి మాట వినే రకం కాదని, ఎమ్మెల్యేలు, మంత్రుల మాట అస్సలు కేర్ చేయరని అన్నారు. దేశంలోనే ఒక ఎమ్‌ఆర్ఓ మీద పెట్రోల్ పోసి చంపే నీచ సంస్కృతికి తెలంగాణలో తెర లేపారని విమర్శించారు.

తెలంగాణలో ప్రస్తుతం పండగలు వస్తే ఉద్యోగులకు టైంకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోవాలన్నా, అప్పుల కుంపటి నుంచి బయటపడాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేళ్లతో సహా కూల్చడమే ఇప్పుడున్న ఏకైక మార్గం అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ చుట్టూ వారసులు లేని భూముల వివరాలు తెప్పించుకుని ధరణి పోర్టల్ ద్వారా ఈటల రాజేందర్ వేల కోట్ల సంపాదనకు ప్లాన్ చేశారని విమర్శించారు. తన భూమి ఉంటుందో పోతుందో అని రైతులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి కేసీఆర్ హయాంలో ఉందని అన్నారు. సమస్య కోసం ఒక రైతు పదిసార్లు దరఖాస్తు చేస్తే రూ.10 వేలు ఖర్చవుతోందని, హైదరాబాద్ చుట్టూ 5,600 ఎకరాలు, 50 వేల కోట్ల భూములను ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూములను బినామీల పేరుతో ఉన్న కంపెనీలకు కట్టబెడుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు గట్టిగా ఉంటే తట్టుకోలేమని, అసెంబ్లీకి వస్తే వీటన్నింటిపైన ప్రశ్నిస్తారనే భయంతో అక్కడికి రాకుండా చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget