By: ABP Desam | Updated at : 05 Dec 2022 09:00 PM (IST)
అవినీతి బయటపెట్టగానే మంత్రి ఇంద్రకరణ్ అల్లకల్లోలం అయ్యారన్న బీజేపీ ఎంపీ
- చెరువు భూముల విషయంలో హైకోర్టు స్పందించి, ఎందుకు కమిటీని పంపింది?
- మీ అవినీతి ఏంటో ప్రజలకు తెలుసు... ప్రజలే సాక్ష్యం
- 25 ఏళ్ల క్రితం సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మింది మీరు కాదా?
- మీ అవినీతి ని పూర్తిస్థాయిలో బయటికి తీస్తాం
- D1 పట్టాలు ఎవరి పేరు మీద ఉన్నాయో కూడా మాకు తెలుసు
- అల్లోల కుటుంబం దోపిడీకి ఎలా పాల్పడిందో ప్రజలకు తెలీదా?
- సోయం బాపురావు గాలిలో గెలిస్తే... మరి నువ్వెలా గెలిచావ్ ఐకే రెడ్డి?
- ఐకే రెడ్డి భూ దందా అంతా బయటికి తీస్తాం: ఎంపీ సోయం బాపూరావు
నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎలా భూ కబ్జాలకు పాల్పడుతున్నారో తెలపడంతో ఒక్కసారిగా అల్లకల్లోలం అయి, ఐకే రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. చెరువు భూముల విషయంలో హైకోర్టు స్పందించి, ఎందుకు కమిటీని పంపింది? మీ అవినీతి ఏంటో ప్రజలకు తెలుసు, వారే సాక్ష్యం అన్నారు. 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మింది మీరు కాదా?, కచ్చితంగా మీ అవినీతి ని పూర్తిస్థాయిలో బయటికి తీస్తాం.. D1 పట్టాలు ఎవరి పేరు మీద ఉన్నాయో కూడా మాకు తెలుసు అన్నారు.
అల్లోల కుటుంబం దోపిడీకి ఎలా పాల్పడిందో ప్రజలకు తెలీదా, సోయం బాపురావు గాలిలో గెలిస్తే... మరి నువ్వెలా గెలిచావ్ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆదిలాబాద్ ఎంపీ ప్రశ్నించారు. ఇంద్రకరణ్ భూ దందా అంతా బయటికి తీస్తాం, రైల్వే ప్రాజెక్టులలో 40% వాటా రాష్ట్రప్రభుత్వం ఇస్తే... 60% నిధులను కేంద్రం భరిస్తుంది. ఈ మాత్రం మాకు తెలీదా అన్నారు. ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. కొన్ని రూల్స్ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా రూ. 2072 కోట్లతో జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. కేంద్రప్ర భుత్వం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు.
పోడు భూముల సమస్య పరిష్కరించలేదని, పట్టాల పంపిణీకి దిక్కే లేదన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు వారికి పట్టాలు పంపిణీ చేసుంటే, ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావును గొత్తి కోయలు ఎందుకు చంపేవారు? అని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీ లో ఏం జరుగుతుందో కూడా మంత్రికి తెలియదని, అన్యాయంగా విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. ట్రైబల్ యూనివర్సిటీ ని ఉట్నూర్ కి కేంద్రం మంజూరు చేస్తే, దాన్ని మీరు ములుగు కు తరలించారని చెప్పారు. ఐకే రెడ్డి (ఇంద్రకరణ్ రెడ్డి) కాదు, ఆయన సికే(చెరువుల కబ్జా) రెడ్డి అని, ఆయనను వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని మనం క్యాష్ చేసుకోవాలంటూ బీజేపీ శ్రేణులకు పార్టీ ఎంపీ సోయం బాపూరావు పిలుపునిచ్చారు.
ఎప్పుడైనా ఎన్నికలు, సిద్ధంగా ఉండాలి- నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్ కీలక ప్రకటన
Nizamabad KTR Convoy: మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
TS News Developments Today: కేటీఆర్ నిజామాబాద్ పర్యటన, వరంగల్లో వీరయ్య- తెలంగాణ హైలెట్స్ ఇవే!
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం- చలి సాధారణం!
Adilabad News : కట్టెల కోసం వెళ్లిన ఆదివాసీపై అటవీ అధికారుల దాడి, విషమంగా ఆరోగ్య పరిస్థితి
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!