అన్వేషించండి

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ నేతలారా ఖబర్దార్- ఇంకోసారి బీఆర్ఎస్ ఆఫీసు వైపు కన్నెత్తి చూసినా ఊరుకోం - కవిత

Kalvakuntla Kavitha : కాంట్రాక్టర్ల కోసమే తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ ను చేపట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు.

Kalvakuntla Kavitha : కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గట్టి హెచ్చరిక జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత.. 60 లక్షల మంది  సైనికులు ఉన్న కుటుంబం తమ బీఆర్ఎస్ పార్టీ అని, తమ పార్టీ కార్యాలయాలపై, ఇళ్లపై దాడులుకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా.. జాగ్రత్తగా ఉండండి, ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీ మూకలతో ఇతరుల పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి తమది కాదని చెప్పారు.

కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు

మూసీ మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలని కవిత చెప్పారు. రాష్ట్రాన్ని 60ఏళ్లు పాలించిన పారిశ్రామిక వ్యర్ధాలు మూసీలో కలుస్తుంటే కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న కొండపోచమ్మ సాగర్ ను వదిలేసి దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసీ - గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదన్నారు. మూసీని కాంగ్రెస్ నాయకులు ఏటీఎంగా మార్చుకోవాలని చూస్తున్నారని కవిత ఆరోపించారు. కాంట్రాక్టర్ల కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోందన్నారు. అందులో భాగంగానే అనుసంధాన ప్రాజెక్టు వ్యయాన్ని రూ.7,500 కోట్లకు పెంచారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.


Kalvakuntla Kavitha: కాంగ్రెస్ నేతలారా ఖబర్దార్- ఇంకోసారి బీఆర్ఎస్ ఆఫీసు వైపు కన్నెత్తి చూసినా ఊరుకోం - కవిత

కొండపోచమ్మ నుంచి మూసీ అనుసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పటికీ ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకని అడిగారు. ఈ విషయంపై నల్లగొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీలో మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న కవిత.. మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అప్పట్లోనే ప్రణాళికలు రూపొందించారని గుర్తు చేసుకున్నారు.

ఆ పనులను వెంటనే పూర్తి చేయాలి

మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలపైకి ఇళ్లపైకి బుల్డోజర్లను పంపి, కూల్చివేస్తోందని కవిత ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు అయ్యే వ్యయాన్ని మొదట్లో రూ.50 వేల కోట్లు అని, ఆ తర్వాత రూ. 1లక్ష కోట్లు, మరోసారి లక్షన్నర కోట్లు అని సీఎం చెబుతూ.. మూసీని ఏటీఎంగా మార్చుకొని ఆ డబ్బును ఢిల్లీకి పంపించే ప్రణాళిక చేస్తున్నారని చెప్పారు. మరోపక్క యాదాద్రిలో కేసీఆర్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలన్న కవిత.. యాదాద్రి వైభవాన్ని ప్రభుత్వం కాపాడాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని, అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేశారని చెప్పారు. ఫ్లోరైడ్ ని నిర్మూలించిన ఘనత కేసీఆర్ దేనని, ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన కూడా పోలేదని ఆరోపించారు.

Also Read : KTR: ‘పేరుకే ప్రజాపాలన కానీ దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు.. కాంగ్రెస్​పై మండిపడ్డ కేటీఆర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ippa Flower: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Yadadri Crime News: భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Another new airport for Delhi: ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
Kerala Elections 2026: కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
Embed widget