అన్వేషించండి

Sabitha Indra Reddy: కూరగాయలు కొన్న మంత్రి - ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన మహిళ

Sabitha Indra Reddy: కందుకూరులో శనివారం మార్కెట్‌ సముదాయాన్ని  మంత్రి సబితారెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. మార్కెట్‌‌లో తిరుగుతూ మహిళలందరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు.

Sabitha Indra Reddy: కందుకూరులో శనివారం (సెప్టెంబర్ 23) మార్కెట్‌ సముదాయాన్ని మంత్రి సబితారెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. మార్కెట్‌‌లో తిరుగుతూ మహిళలందరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా అక్కడ కూరగాయలు విక్రయించే మహిళతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. ఆమె గురించి ఆరా తీశారు. అంతే కాదు మంత్రి సబిత అక్కడే కూరగాయలు కొనుగోలు చేశారు. దీంతో మహిళా వ్యాపారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనందంలో తూకం వేయడం మరపోయింది. ‘సబితమ్మ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేసింది. తమ కోసం ఇంత మంచి మార్కెట్‌ నిర్మించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఆ మహిళా వ్యాపారి భర్త వేరే రాజకీయ పార్టీకి చెందిన కార్మిక విభాగంలో క్రియాశీలకంగా ఉన్నారు. 

పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కందుకూరులో పలు అభివృద్ధి పనులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. కందుకూరు, చిన్న రోడ్డు నుంచి ఫార్మాసిటీ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కందుకూరు, కొత్తగూడ గ్రామాలకు చెందిన నిరుపేదలకు 300 మందికి ఇంటి స్థలాల సర్టిఫికెట్లను జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల కాలంలో కందుకూరు, మహేశ్వరం, మండలాలతో పాటు నియోజకవర్గం పరిధిలోని అర్బన్‌ ప్రాంతాల్లో శరవేగంగా అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంతంపై ఉన్న అభిమానంతోనే దాసర్లపల్లి గేటు వరకు మెట్రో రైలు సౌకర్యం కల్పించడానికి నిధులు మంజూరు చేశారన్నారు. 

ఓర్వలేకే విమర్శలు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసమే పని చేస్తుందని మంత్రి సబిత అన్నారు. ఎక్కడా రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడడం లేదన్నారు. ప్రజాశ్రేయస్సుతోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం వల్లే 300 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగామన్నారు. దాదాపు 8 ఎకరాల్లో పట్టాలు తయారు చేయించి ఇస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమపై చూపుతున్న ఆదరణకు ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, అందుకే మోసపూరిత  మాటలు చెబుతున్నాయని ఆమె అన్నారు. అనంతరం కుమ్మరి సంఘం ఏర్పాటు చేసిన కవయిత్రి మొల్ల విగ్రహాన్ని జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ కవయిత్రి మొల్ల చేసిన సేవలు మరుపురానివన్నారు. రామాయణాన్ని తెలుగులో అనువదించిన తొలి మహిళ మొల్ల అన్నారు. 

అడుగడుగునా అభివృద్ధి
జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కాలంలో ప్రజలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలనే చెప్పుకుంటున్నామన్నారు. తెలంగాణలో అడుగడుగునా అభివృద్ధి కనిపిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు, ఉమ్మడి పాలనలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక తెలంగాణ రూపురేఖలు మారాయని ఆమె అన్నారు.  అయినా, ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. అనంతరం సభలో ప్రసంగించిన ఎంపీపీ మంద జ్యోతి కార్యక్రమం బీఆర్‌ఎస్‌ సభలా ఉందని మధ్యలోనే వెల్లిపోయారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు, అధికార పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Telangana Heatwave: వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Embed widget