అన్వేషించండి

Sabitha Indra Reddy: కూరగాయలు కొన్న మంత్రి - ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన మహిళ

Sabitha Indra Reddy: కందుకూరులో శనివారం మార్కెట్‌ సముదాయాన్ని  మంత్రి సబితారెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. మార్కెట్‌‌లో తిరుగుతూ మహిళలందరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు.

Sabitha Indra Reddy: కందుకూరులో శనివారం (సెప్టెంబర్ 23) మార్కెట్‌ సముదాయాన్ని మంత్రి సబితారెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. మార్కెట్‌‌లో తిరుగుతూ మహిళలందరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా అక్కడ కూరగాయలు విక్రయించే మహిళతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. ఆమె గురించి ఆరా తీశారు. అంతే కాదు మంత్రి సబిత అక్కడే కూరగాయలు కొనుగోలు చేశారు. దీంతో మహిళా వ్యాపారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనందంలో తూకం వేయడం మరపోయింది. ‘సబితమ్మ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేసింది. తమ కోసం ఇంత మంచి మార్కెట్‌ నిర్మించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఆ మహిళా వ్యాపారి భర్త వేరే రాజకీయ పార్టీకి చెందిన కార్మిక విభాగంలో క్రియాశీలకంగా ఉన్నారు. 

పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కందుకూరులో పలు అభివృద్ధి పనులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. కందుకూరు, చిన్న రోడ్డు నుంచి ఫార్మాసిటీ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కందుకూరు, కొత్తగూడ గ్రామాలకు చెందిన నిరుపేదలకు 300 మందికి ఇంటి స్థలాల సర్టిఫికెట్లను జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల కాలంలో కందుకూరు, మహేశ్వరం, మండలాలతో పాటు నియోజకవర్గం పరిధిలోని అర్బన్‌ ప్రాంతాల్లో శరవేగంగా అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంతంపై ఉన్న అభిమానంతోనే దాసర్లపల్లి గేటు వరకు మెట్రో రైలు సౌకర్యం కల్పించడానికి నిధులు మంజూరు చేశారన్నారు. 

ఓర్వలేకే విమర్శలు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసమే పని చేస్తుందని మంత్రి సబిత అన్నారు. ఎక్కడా రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడడం లేదన్నారు. ప్రజాశ్రేయస్సుతోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం వల్లే 300 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగామన్నారు. దాదాపు 8 ఎకరాల్లో పట్టాలు తయారు చేయించి ఇస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమపై చూపుతున్న ఆదరణకు ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, అందుకే మోసపూరిత  మాటలు చెబుతున్నాయని ఆమె అన్నారు. అనంతరం కుమ్మరి సంఘం ఏర్పాటు చేసిన కవయిత్రి మొల్ల విగ్రహాన్ని జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ కవయిత్రి మొల్ల చేసిన సేవలు మరుపురానివన్నారు. రామాయణాన్ని తెలుగులో అనువదించిన తొలి మహిళ మొల్ల అన్నారు. 

అడుగడుగునా అభివృద్ధి
జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కాలంలో ప్రజలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలనే చెప్పుకుంటున్నామన్నారు. తెలంగాణలో అడుగడుగునా అభివృద్ధి కనిపిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు, ఉమ్మడి పాలనలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక తెలంగాణ రూపురేఖలు మారాయని ఆమె అన్నారు.  అయినా, ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. అనంతరం సభలో ప్రసంగించిన ఎంపీపీ మంద జ్యోతి కార్యక్రమం బీఆర్‌ఎస్‌ సభలా ఉందని మధ్యలోనే వెల్లిపోయారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు, అధికార పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Breaking News: కృష్ణా జిల్లా గూడూరులో విషాదం- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల ఆత్మహత్య  
కృష్ణా జిల్లా గూడూరులో విషాదం- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల ఆత్మహత్య  
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
How Car Airbags Work: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
Peddi OTT: పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
Chiluka Gorinka: చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
Embed widget