అన్వేషించండి

Malla Reddy Holds Protest: ఆస్పత్రి ఎదుట మంత్రి మల్లారెడ్డి ధర్నా- హైపర్ టెన్షన్ వల్లే అంటున్న వైద్యులు!

Malla Reddy Holds Protest: మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సూరారం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మంత్రి అదే ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఐటీ అధికారులు తన కొడుకును కొట్టారంటున్నారు.

Malla Reddy Holds Protest: మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సూరారం ఆస్పత్రికో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. హైపర్ టెన్షన్ వల్లే ఆయన అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తున్నారు. తమ కుమారుడిని చూడనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రంతా సీఆర్పీఎఫ్ బలగాలతో తమ కొడుకును కొట్టించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. తన కుమారుడికి ఏమవుతుందోననే భయం తనను తీవ్రంగా బాధిస్తున్నట్లు తెలిపారు. ఐటీ సోదాల్లో నగదు, పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి ఇంటి వద్ద భారీ సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి సోదాలు కొనసాగిస్తున్నారు. 

మంత్రి మల్లారెడ్డి దాడులపై ఏమంటున్నారంటే..?

ఐటీ అధికారులు తమపై కక్ష సాధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి మల్లారెడ్డి. తన కుమారుడిని కొట్టినందు వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారన్నారు. ఆయన్ని చూసేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఈ ఉదయం ఆసుపత్రిలో చేరారు. చాతీలో నొప్పి రావడంతో సూరారం ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని మీడియాలో చూసిన మల్లారెడ్డి ఆందోళనతో ఆసుపత్రికి బయల్దేరారు. మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. ఐటీ రైడ్స్ జరుగుతున్న ఈ టైంలో వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. దీంతో వారిపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడికి బాగాలేదంటే చూసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎవరు అడ్డువచ్చినా తాను మాత్రం ఆసుపత్రిలో ఉన్న తన కుమారుడిని చూసే తీరుతానంటూ చెప్పుకొచారు.

మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. ఐటీ రైడ్స్ జరుగుతున్న ఈ టైంలో వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. దీంతో వారిపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడికి బాగాలేదంటే చూసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎవరు అడ్డువచ్చినా తాను మాత్రం ఆసుపత్రిలో ఉన్న తన కుమారుడిని చూసే తీరుతానంటూ చెప్పుకొచారు. తన కుమారుడిని రాత్రంతా ఇబ్బంది పెట్టారని అందుకే ఆయన ఆసుపత్రిలో చేరారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే వెళ్లకుండా అడ్డుకోవడం ఇదెక్కడి దుర్మార్గమని ప్రశ్నించారు. ఆసుపత్రికి వెళ్లేందుకు మల్లారెడ్డి ప్రయత్నాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు ఐటీ అధికారులు. ఆయన కాన్వాయ్ తాళాలు తీసుకున్నారు. అందరి ఫోన్లు లాక్కున్నారు. వెళ్లేందుకు వీళ్లేదని చెప్పడంతో వారితో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. తమపై బీజేపీ కుట్ర చేస్తోందని... ఎలాంటి తప్పు చేయకున్నా నిన్నటి నుంచి విచారణ పేరుతో ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ఈ దాడులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. తాము పేద పిల్లలకు చదువులు చెప్పించడం తప్పా అని ప్రశ్నించారు.

నిన్న ఉదయం నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న సోదాలు..

నిన్న ఉదయం నుంచి మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆఫీస్‌లు, కాలేజీలు, ఇళ్లపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన కుమారులు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రఘునాథ్ రెడ్డి వద్ద రూ.2 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో రఘునాథ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. రఘునాథ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి రూ.2 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు. మరోవైపు, జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో మల్లారెడ్డికి వరుసకు అల్లుడు అయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి కూడా ఐటీ అధికారులు వెళ్లారు. సంతోష్ రెడ్డి తలుపు ఓపెన్ చేయకపోవడంతో ఐటీ అధికారులు వేచి చూస్తున్నారు. డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లే అలోచనలో ఐటీ ఆఫీసర్స్ ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget