అన్వేషించండి

Breaking News Live: రేపు బోధన్ బంద్ కు బీజేపీ పిలుపు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: రేపు బోధన్ బంద్ కు బీజేపీ పిలుపు

Background

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది.  తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదగా కేంద్రంగా ఉందని భారత వాతావరణ కేంద్రం, అమరావతి కేంద్రం తెలిపాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ శనివారం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో నేడు (ఆదివారం) వాయుగుండంగా మారనుంది. 

వాయుగుండం సోమవారం (మార్చి 21న) తుఫాన్‌గా తీవ్ర రూపం దాల్చనుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడిగాలుతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ వాతావరణం (Temperature in Andhra Pradesh), తెలంగాణలోనూ పొడిగా మారింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏపీ, యానాంలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు వస్తాయి. మరో 24 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గత రెండు వారాలుగా పెరుగుతున్న ఎండల నుంచి ఉత్తర కోస్తా, యానాం ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని, గాలులు తీవ్రమైతే వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. గత మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. . 

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా మారుతుంది. అల్పపీడన ప్రభావం ఈ ప్రాంతాల్లో చాలా తక్కువ. రాయలసీమలో చలి గాలులు వేగంగా వేచనున్నాయి. మరో 24 గంటల్లో చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. బాపట్లలో 33 డిగ్రీలు, కావలిలో 35.3 డిగ్రీలు, మచిలీపట్నంలో 34.3 డిగ్రీలు, ఒంగోలులో 34.7 డిగ్రీలు, విశాఖపట్నంలో 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి.

తెలంగాణ వెదర్ అప్‌డేట్
అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తెలంగాణలో కొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి.  గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rain) కురిసింది. సైదాబాద్, సంతోష్ నగర్ చంపా పేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, మలక్ పేటలలో భారీ వర్షం పడటంతో హైదరాబాద్ ఉష్ణోగ్రత కాస్త తగ్గడంతో నగరవాసులకు ఉపశమనం కలిగింది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాడిపోవడంతో వాతావరణంలో ఉక్కపోత ఎక్కువైంది. ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీలు, హైదరాబాద్‌లో 39 డిగ్రీలు, ఖమ్మంలో 36, నల్గొండలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా మూడో రోజు నేడు (Todays Gold Rate) తగ్గింది. గ్రాముకు నేడు రూ.15 తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు కిలోకు రూ.600 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,300 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,600 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.72,300 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,300 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,300 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,300 గా ఉంది.

20:53 PM (IST)  •  20 Mar 2022

రేపు బోధన్ బంద్ కు బీజేపీ పిలుపు

రేపు బోధన్ పట్టణంలో బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. శివాజీ విగ్రహం ఏర్పాటుపై ఇవాళ బోధన్ లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, శివసేన, మైనార్టీ నాయకుల మధ్య దాడులు జరిగాయి. దీంతో బోధన్ లో 144 సెక్షన్ విధించారు. 

17:45 PM (IST)  •  20 Mar 2022

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ధర్నా 

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ధర్నాకు దిగారు. ఇడుపులపాయ క్యాంపస్ లోని అకాడమిక్ బ్లాక్ 1 వద్ద P1, P2 విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. P1, P2, విద్యార్థులను ఇడుపులపాయలోని ఓల్డో క్యాంపస్ లోకి వెళ్లమని చెప్పడంతో వివాదం చెలరేగింది.  ఓల్డో క్యాంపస్ లో సరైన మౌలిక వసతులు కల్పించే వరకు వెళ్లమని నిరసనకు దిగారు. విద్యార్థుల అరుపులతో క్యాంపస్ అంతా మారు మోగుతుంది. విద్యార్థులను ఆందోళన విరమింపజేసేందుకు డైరెక్టర్ సంధ్యారాణి బెదిరింపులకు దిగారు. ఆందోళన విరమించకపోతో పోలీసులతో విద్యార్థులను ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. 

13:33 PM (IST)  •  20 Mar 2022

Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న పండిట్ రవిశంకర్

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ గురూజీ దర్శించుకున్నారు.. ఆలయ వద్దకు చేరుకున్న ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ గురూజీకి విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు, డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈఓ ప్రభాకర్ రెడ్డిలు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు..‌ దర్శనానంతరం ఆశీర్వాదం అందించారు. మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

12:54 PM (IST)  •  20 Mar 2022

నకిలీ మద్యం బ్రాండ్లు నిషేధించాలని అనపర్తిలో టీడీపీ నేతల నిరసన

ఏపీలో నకిలీ మద్యం, కల్తీ సారా, జే బ్రాండ్ ట్యాక్స్‌కు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ర్యాలీ చేశారు. తాళిబొట్లు తెంచే కల్తీ సారా  అంటూ బ్రాందీ షాపు వద్ద నినాదాలు చేశారు. టీడీపీ ఇంచార్జి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసనలో పాల్గొన్నాయి. తాడేపల్లి మద్యాన్ని నిషేధించాలని జగన్ బ్రాండ్లలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

12:38 PM (IST)  •  20 Mar 2022

Nizamabad News: బోధన్‌లో ఉద్రిక్తత, శివాజీ విగ్రహం ఏర్పాటుతో ఘర్షణ

Nizamabad జిల్లా బోధన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికంగా శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం ఈ వివాదానికి మూలం అయింది. శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికి రాత్రి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీంతో మైనార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి ఇరువర్గాల నాయకులు, స్థానిక ప్రజలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ నెలకొనడంతో పోలీసుల జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇరువర్గాలకు నచ్చ చెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Must Have Gadgets: వర్షంలో కచ్చితంగా జేబులో ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవే - చిన్నవే కానీ కాపాడతాయి!
వర్షంలో కచ్చితంగా జేబులో ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవే - చిన్నవే కానీ కాపాడతాయి!
Embed widget