అన్వేషించండి

TRS News: జాతీయపార్టీలో తెలంగాణ అధ్యక్షుడు ఎవరు? ఆ ఛాన్స్ కేటీఆర్‌కే దక్కుతుందా?

టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారాక రాష్ట్ర అధ్యక్షుడిగా తనయుడు కేటీఆర్‌ను నియమిస్తారని అంటున్నారు.

టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగుతున్నారు. కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఉన్నారు. అయితే, జాతీయ పార్టీగా ఏర్పడితే పరిస్థితి ఏంటి? జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆరే కచ్చితంగా ఉంటారు. మరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారాక రాష్ట్ర అధ్యక్షుడిగా తనయుడు కేటీఆర్‌ను నియమిస్తారని అంటున్నారు.

అక్టోబరు 5న ముహూర్తం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలనే నిర్ణయం మేరకు ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ పేరును జాతీయ స్థాయిలో ప్రతిబింబించేలా మార్చనున్న సంగతి తెలిసిందే. ఈ పేరు మార్పు ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభమవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకి పేరు ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి ఆమోదం తెలుపుకున్న అనంతరం, తర్వాతి రోజు అంటే ఈ నెల 6న ఢిల్లీకి టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్లనుంది. 

ఈసీకి దరఖాస్తు
టీఆర్ఎస్ పేరును జాతీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తారు. దాన్ని ఆమోదిస్తే వెంటనే ఆ పేరు అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో పార్టీ చేరుతుంది. ఇక కొత్తగా ఏర్పాటైన జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఉంటారు. తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిగా ప్రస్తుత టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ను నియమించే అవకాశం ఉంది. జాతీయ పార్టీగా పేరుకు ఆమోద ముద్ర పడ్డాక, ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. దాని ప్రకారం పార్లమెంటులో, శాసన సభలో, శాసన మండలిలో పార్టీ పేరును కూడా మార్చుతారు. శాసన సభలో పార్టీ పక్ష నేతగా కేసీఆర్‌ కొనసాగే అవకాశం ఉందని సమాచారం. జాతీయ పార్టీ తరఫున తొలుత సమన్వయ కర్తలను నియమించి ఆ తర్వాత కొత్త జాతీయ పార్టీకి రాష్ట్రాల్లో అధ్యక్షులను నియమించే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలతో పాటు సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలను తర్వాత కొనసాగిస్తారని తెలుస్తోంది.

కొత్త పార్టీ ఏర్పాటా? లేక ఉన్న పార్టీ పేరునే మార్చుతారా?
జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో నంబర్ వన్ గా ఉన్న టీఆర్ఎస్ ను అలాగే కొనసాగిస్తారా? లేక జాతీయ పార్టీ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ను అందులో విలీనం చేస్తారా? అదీ కాకుండా టీఆర్ఎస్ పేరు మార్చి జాతీయ పార్టీగా మార్చుతారా? అనే అంశంలో స్పష్టత లేదు. రెండు వేర్వేరు పార్టీలు ఉంటే రాష్ట్రంలో గందరగోళం ఏర్పడుతుందని, టీఆర్ఎస్ పేరుతో వెళితే ఇతర రాష్ట్రాల్లో ఆదరణ ఉండదనే అభిప్రాయాలు వచ్చాయి. అందుకని ప్రాంతీయ పార్టీ పేరునే మార్చి దేశవ్యాప్తంగా పోటీ చేయాలనే వ్యూహాన్ని అనుకుంటున్నట్లుగా సమాచారం. కొత్తగా పార్టీ పెడితే కారు గుర్తు ఉండక పోవచ్చు కాబట్టి, పార్టీకే పేరు మార్చడం వల్ల గుర్తు మారే సమస్య తలెత్తదని కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget