అన్వేషించండి

KCR Karimnagar : చివరి రక్తపు బొట్టు వరకు దళితుల అభివృద్ధికి కృషి : కేసీఆర్

సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో దళిత బంధు పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. చివరి రక్తపు బొట్టు వరకూ దళితుల అభివృద్ధి కోసం పని చేస్తానన్నారు.


దళిత బంధు పథకం అమలుపై స్వయంగా పర్యవేక్షణ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నేరుగా కరీంనగర్ వెళ్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. దళిత బంధు అమలుకు సంబంధించి అధికారులకు స్పష్టమైన సూచనలుచేశారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళిత బంధు విజయవంతం కోసం పనిచేస్తానని ప్రకటించారు. "నా చివరి రక్తపు బొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా"నని సీఎం కేసీఆర్‌ దళితులకు హామీ ఇచ్చారు.  దళిత జాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సమాజమే కారణమన్నారు. దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలి రావాలని సీఎం కేసీఆర్‌ సమీక్ష సందర్భంగా పిలుపునిచ్చారు. 

హుజురాబాద్‌లో దళిత కుటుంబాలను గుర్తించడానికి సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఎలా సాగుతోందని అధికారులను కేసీఆర్ అడిగారు. అలాగే ఎక్కువ మంది లబ్దిదారులు ఏ యూనిట్లు అడుగుతున్నారో ఆరా తీశారు.  బ్యాంక్ అకౌంట్ల వివరాలు జాగ్రత్తగా చూడాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల అందజేత సమయంలో పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.  ఆగస్టు 16వ తేదీన రైతు బంధు ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ దళిత బంధు చెక్కులను అందించిన వారికి గురువారమే యూనిట్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం దళిత బంధు సర్వే హుజురాబాద్‌లో జోరుగా సాగుతోంది. నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. 
 
దళితబంధు పథకానికి పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న 20,929 దళిత కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. రెండు వేల కోట్ల రూపాయలను కలెక్టర్‌ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. మొత్తం రూ. 2 వేల కోట్లతో నియోజకవర్గంలోని దళితులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నది.  పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకుంది. నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు చక చకా అమలు చేయడమే మిగిలింది.

ఒకటి, రెండు నెలల్లో పథకం అమలును పూర్తి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఉపఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. ఇందు కోసం అధికార యంత్రాంగాన్ని సంపూర్ణ స్థాయిలో వినియోగిస్తున్నారు. దళిత బంధు అమలు ప్రత్యేకాధికారి సీఎంవో నుంచి రాహుల్ బొజ్జా పర్యవేక్షిస్తున్నారు. ఆయన కరీంనగర్‌లోనే మకాం వేశారు. సర్వే పూర్తయిన తర్వాత ఎక్కువ మంది అడిగే యూనిట్లు.. వారికి కావాల్సిన శిక్షణ అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Gachibowli DLF Road Closed 90 Days: మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో
మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget