అన్వేషించండి

Paddy Procurement Issue: సీఎం కేసీఆర్ కు కాలాలపై అవగాహన ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు: జీవన్ రెడ్డి

Paddy Procurement Issue: రాష్ట్రంలో ధాన్యం సేకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రైతుల ఆందోళనకు మద్దతు పలికారు.

Telangana Paddy Procurement Issue: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రోహిణి కార్తెకు వేళ అవుతున్నా ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని.. రైతుల ఆవేదనను, ఆందోళనను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో తిప్పన్నపేట ఐకేపీ కేంద్రం వద్ద ధాన్యం కొనుగోళ్ల తీరును నిరసిస్తూ అన్నదాతలు ఆందోళన చేశారు. రైతుల ధర్నాకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఐకేపీ కేంద్రం వద్ద గంటకు పైగా రోడ్డుపై బైఠాయించారు. ముఖ్యమంత్రికి కాలాలపై అవగాహన ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు కొనుగోళ్లలో జాప్యం

అకాల వర్షాలు కురిసి పంట తడిసి రాష్ట్రంలో అన్నదాతలు ఆగమైపోతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. మరోవైపు కొనుగోళ్లలో ప్రభుత్వ జాప్యంతో రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఇంతా జరిగితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో అన్నదాతలను నిలువునా దోపిడి చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఒక రైతుకు చెందిన ధాన్యం 106 క్వింటాళ్లకు 6.90 కిలోల కోత విధించారని తెలిపారు. ఇప్పటికే రైతు బంధు పేరుతో అన్నదాతలకు కల్పించాల్సిన రాయితీలు, సౌకర్యాలు దూరం చేశారని అన్నారు. పంట చేతికొచ్చాక కొనుగోళ్ల తీరుతో ఇబ్బందులకు గురి చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అధికారులను కొనుగోళ్ల విషయం గురించి అడిగితే.. లారీలు ఇప్పుడే పంపిస్తామంటారు కానీ పంపించడం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. 

కామారెడ్డి జుక్కల్ లో రైతుల ధర్నా

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని వరి ధాన్యం రైతులు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. మొహ్మదాబాద్, కేంరాజ్ కల్లాలి, ఖండేబల్లూర్ తదితర గ్రామాల అన్నదాతలు జాతీయ రహదారి 161పై బైఠాయించారు. జుక్కల్ మండలంలో సింగిల్ విండో ద్వారా మొహ్మదాబాద్, కౌలాస్, కల్లాలి, ఖండేబల్లూర్ లో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20 వేల క్వింటాళ్ల వరి ధాన్యం తూకం వేసి వారాలు గడుస్తున్నాయి. అయినా లారీలు లేవని చెబుతూ అధికారులు ధాన్యం తరలించడం లేదు. దీంతో వరి ధాన్యం వద్దే రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇంకా దాదాపు 20 వేల క్వింటాళ్ల ధాన్యం తూకం వేయాల్సి ఉందని తెలిపారు. వారాల తరబడి ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం మార్పులు కారణంగా వానలు పడితే తమ పరిస్థితి ఏమిటని అన్నదాతలు వాపోతున్నారు. రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న తహసీల్దార్ గణేశ్, ఎస్సై మురళి రైతులను సముదాయించేందుకు ప్రయత్నించారు. వారు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా రైతులు ససేమిరా అన్నారు. లారీలు పంపించాలని, ధాన్యం మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు అన్నదాతలను సముదాయించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vemulawada Dargah History: వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
Rajinikanth - Shah Rukh Khan: కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
Ugadi Panchangam 2026: పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
Embed widget