అన్వేషించండి

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: రాజన్ని సరిసిల్లలో ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. 

KTR Convoy: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఏబీవీపీ కార్యకర్తలు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. సంజీవయ్య నగర్ లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కి ఎదురుగా వెళ్లారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటిఆర్ ను అడ్డుకోవడంతో ఒక్కసారిగా సిరిసిల్లలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఏబీవీపీ నాయకులను ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలోనే పలువురిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసన

మరోవైపు ఇదే జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా పలువురు నిరసన వ్యక్తం చేశారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ నోటికి నల్లగుడ్డ కట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టగా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్న దళితులను మాత్రం మరిచిపోయిందని వాపోయారు.

దళిత బంధు పేరిట ఓట్లు దండుకోవాలని పథకాన్ని ప్రవేశ పెట్టి తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో కొద్ది మందికి మాత్రమే సాయం అందజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట దళితులు బీఆర్ఎస్ కు ఓట్లు వేయలేదాని అని ప్రశ్నించారు. ఓట్లు వేస్తేనే కదా కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మండలంలోని పదిర గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు కింద ఎంపిక చేసి ఆ ఊరిలో మాత్రమే దళితబంధు అమలు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు చెన్ని బాబు, వార్డు సభ్యులు ఎర్పుల శ్రీనివాస్, అందె వీరయ్య, బక్కి రవి, బద్ది దేవరాజు, మస్కురి దేవయ్య, ఏర్పుల తిరుపతి, బక్కి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

రైస్ మిల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులు రాజేశ్వరి, విజయ్ కుమార్, లింగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైస్ మిల్లును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముగ్గురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం కేటాయించగా.. మొత్తం 30 లక్షల రూపాయలతో పాటు బ్యాంకు రుణాలతో పాటు ప్రభుత్వ పారిశ్రామిక రాయితీలు పొంది రైస్ మిల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లి రైస్ మిల్ ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పలువురు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు కూడా దళితబంధు అందజేయాలని కొందరు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత తీసుకుంటూ పదవికి రాజీనామా చేయాలని మంరి కొంత మంది కోరుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Kaushik Reddy  Vs Arikepudi Gandhi : అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
Mathu Vadalara 2 Twitter Review - మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావుLangur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Kaushik Reddy  Vs Arikepudi Gandhi : అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
Mathu Vadalara 2 Twitter Review - మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
Womens Empowerment : 2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్​గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే
2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్​గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే
In Pics: హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
Duleep Trophy highlights, 2nd Round Day 1: దులీప్ ట్రోఫీ టెస్టు మ్యాచ్ ఫస్ట్‌ డే హైలైట్స్‌- ఇషాన్‌ సెంచరీతో భారీ స్కోర్ దిశగా ఇండియా సీ జట్టు 
దులీప్ ట్రోఫీ టెస్టు మ్యాచ్ ఫస్ట్‌ డే హైలైట్స్‌- ఇషాన్‌ సెంచరీతో భారీ స్కోర్ దిశగా ఇండియా సీ జట్టు 
Sangareddy Court: ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
Embed widget