అన్వేషించండి

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: రాజన్ని సరిసిల్లలో ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. 

KTR Convoy: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఏబీవీపీ కార్యకర్తలు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. సంజీవయ్య నగర్ లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కి ఎదురుగా వెళ్లారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటిఆర్ ను అడ్డుకోవడంతో ఒక్కసారిగా సిరిసిల్లలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఏబీవీపీ నాయకులను ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలోనే పలువురిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసన

మరోవైపు ఇదే జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా పలువురు నిరసన వ్యక్తం చేశారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ నోటికి నల్లగుడ్డ కట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టగా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్న దళితులను మాత్రం మరిచిపోయిందని వాపోయారు.

దళిత బంధు పేరిట ఓట్లు దండుకోవాలని పథకాన్ని ప్రవేశ పెట్టి తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో కొద్ది మందికి మాత్రమే సాయం అందజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట దళితులు బీఆర్ఎస్ కు ఓట్లు వేయలేదాని అని ప్రశ్నించారు. ఓట్లు వేస్తేనే కదా కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మండలంలోని పదిర గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు కింద ఎంపిక చేసి ఆ ఊరిలో మాత్రమే దళితబంధు అమలు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు చెన్ని బాబు, వార్డు సభ్యులు ఎర్పుల శ్రీనివాస్, అందె వీరయ్య, బక్కి రవి, బద్ది దేవరాజు, మస్కురి దేవయ్య, ఏర్పుల తిరుపతి, బక్కి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

రైస్ మిల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులు రాజేశ్వరి, విజయ్ కుమార్, లింగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైస్ మిల్లును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముగ్గురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం కేటాయించగా.. మొత్తం 30 లక్షల రూపాయలతో పాటు బ్యాంకు రుణాలతో పాటు ప్రభుత్వ పారిశ్రామిక రాయితీలు పొంది రైస్ మిల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లి రైస్ మిల్ ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పలువురు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు కూడా దళితబంధు అందజేయాలని కొందరు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత తీసుకుంటూ పదవికి రాజీనామా చేయాలని మంరి కొంత మంది కోరుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Revanth Reddy CM Change Rumors: తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్! కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ సిద్ధం చేస్తోందా?
తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్! కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ సిద్ధం చేస్తోందా?
Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Revanth Reddy unveils NTR statue: కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
Pre Diabetic Care : ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
IPL 2026 Qualifier-2  GT vs RR Preview: క్వాలిఫైయర్ 2 లో GT వర్సెస్ RR : ఫైనల్ టికెట్ కోసం హోరాహోరీ పోరు.. పిచ్ రిపోర్ట్, టాస్ కీలకం
క్వాలిఫైయర్ 2 లో GT వర్సెస్ RR : ఫైనల్ టికెట్ కోసం హోరాహోరీ పోరు.. పిచ్ రిపోర్ట్, టాస్ కీలకం
Embed widget