అన్వేషించండి

గ్రూప్‌2 వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్- టీఎస్పీఎస్సీ నుంచి కీలక ప్రకటన

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలన్ని డిమాండ్ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కీలక ప్రకటన వచ్చింది.

గ్రూప్‌ 2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ అందుబాటులో లేనందున కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల డిమాండ్‌లను పరిశీలిస్తామని తెలిపారు. 

వరుసగా వస్తున్న పోటీ పరీక్షలకు ప్రిపేర్  అయ్యే టైం లేదని డిమాండ్ చేస్తూ గ్రూప్ 2 అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆగస్టు 29, 30న జరిగే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. 

టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ ముట్టడికి యత్నించిన అభ్యర్థులతో నాంపల్లి పరిసర ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. భారీగా వచ్చిన అభ్యర్థులు వారికి మద్దతు పలికిన రాజకీయా పార్టీల అనుచరులతో ఆప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ రూట్‌లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. 

దీంతో కొందరు అభ్యర్థులను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. రాజకీయ పార్టీల నాయకులను కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తూ పోలీసులతో ఘర్షణకు దిగారు. పరిస్థితి మరింత హాట్‌గా మారడంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు స్పందించాల్సి వచ్చింది. 

కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న అభ్యర్థులకు నాయకత్వం వహిస్తున్న కొందరు నాయకులను పిలిచి మాట్లాడారు. వారితో చర్చించి పరిస్థితి వివరించారు. వారిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపేశారు. 

విద్యార్థులతో మాట్లాడిన అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి వినతిపత్రం తీసుకున్నామని అందులో తెలిపారు. వారి విన్నపాలను పరిశీలిస్తామన్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుందని వివరించారు. 
ప్రస్తుతానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడలేదని స్పష్టం చేశారు అనిత రామచంద్రన్. దీనిపై టీఎస్‌పీఎస్‌సీ స్పష్టమైన ప్రకటన చేస్తుందని అంత వరకు తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు సూచించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
Rambha Re Entry: రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి అస్వస్థత - సబ్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు!
పోసాని కృష్ణమురళికి అస్వస్థత - సబ్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP DesamFlash Floods in Kullu Manali | బియాస్ నదికి ఆకస్మిక వరదలు | ABP DesamSuriya Jyothika With Kids First Time | సూర్య, జ్యోతిక పిల్లలు ఎంత పెద్ద వాళ్లైపోయారో | ABP DesamSLBC Tunnel Incident vs Uttarakhand Tunnel | ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్..SLBC లో దేనికి ఆటంకం.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
Rambha Re Entry: రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి అస్వస్థత - సబ్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు!
పోసాని కృష్ణమురళికి అస్వస్థత - సబ్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు!
Skype: చరిత్రలో కలిసిపోతున్న స్కైప్ - డిస్‌కంటిన్యూ చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం
చరిత్రలో కలిసిపోతున్న స్కైప్ - డిస్‌కంటిన్యూ చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం
ASHA Workers Good News: ఏపీలో ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త, త్వరలోనే ఉత్తర్వులు జారీ
ఏపీలో ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త, త్వరలోనే ఉత్తర్వులు జారీ
SBI PO: ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Uttarakhand Avalanche: మంచు కప్పిన విషాదం, నలుగురు కార్మికులు మృతి - మంచు చరియల కింద మరో ఆరుగురు!
మంచు కప్పిన విషాదం, నలుగురు కార్మికులు మృతి - మంచు చరియల కింద మరో ఆరుగురు!
Embed widget