![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Christmas 2023 Wishes: తెలుగు ప్రజలకు రేవంత్రెడ్డి, జగన్ సహా ప్రముఖుల క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ సంబరాలు దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, జగన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
![Christmas 2023 Wishes: తెలుగు ప్రజలకు రేవంత్రెడ్డి, జగన్ సహా ప్రముఖుల క్రిస్మస్ శుభాకాంక్షలు Telugu States CMs jagan revanth reddy and other leaders and celebrities Christmas 2023 Wishes To People Christmas 2023 Wishes: తెలుగు ప్రజలకు రేవంత్రెడ్డి, జగన్ సహా ప్రముఖుల క్రిస్మస్ శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/b47ed736b770c8b2c991ef25273588ae1703469162918215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశవ్యాప్తంగా క్రిస్మస్ ( Christmas) సంబరాలు అంబరాన్నంటాయి. చర్చిలు ( Churchs )విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. క్రిస్టియన్లు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఏసుప్రభువు బోధనలు, శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం ఎప్పటికీ అనుసరణీయమని రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషంతో, ఆనందోత్సాహాలతో క్రిస్మస్ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమా, సహనం, దాతృత్వం, త్యాగం...మానవాళికి ఏసుక్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తెలుగు ప్రజలకు క్రిస్మస్ విషెస్ చెప్పారు. సమాజంలోని బాధితుల పక్షాన ప్రేమను పంచడం, అందరినీ సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత స్థాపపన కృషి చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రేమ, కరుణ, క్షమాగుణాలను...తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినమే క్రిస్మస్ అన్నారు. దయామయుడు లోకానికి వచ్చిన పర్వదినమైన క్రిస్మస్ పండుగను అనందోత్సాహాలతో జరుపుకోవాలని లోకేశ్ అన్నారు.
క్రైస్తవ మత ఆరాధకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు జనసేనాని పవన్ కల్యాణ్. సామాజిక విలువలు చైతన్యం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం ఎల్లప్పుడూ ఆచరణీయమన్నారు. దేశ ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుకున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల అనాథాశ్రమంలో క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలోని జీవోదయ హోమ్ చిన్నారులతో కలిసి సందడి చేశారు. చిన్నారులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనాథాశ్రమానికి నిత్యావసర సరకులను అందజేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)