అన్వేషించండి

CM KCR: అల్పాహారం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, ఎన్నికల కోడ్ వచ్చేలోపే అమలుకు ప్రణాళిక

CM KCR: ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

CM KCR: ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దసరా నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని (సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం) ప్రారంభించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పుడు మరింత ముందుగానే ఈ స్కీమ్ ను అమలు చేయాలని భావిస్తోంది. శాసనసభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలు ఉండటంతో.. అంతకు ముందుగానే సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం ను అమలు చేయనుంది. ఈ నెల 4వ తేదీ నుంచే ప్రారంభించాలని మొదట అనుకున్నారు. అయితే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెద్ద మొత్తంలో గౌరవ వేతనం, బిల్లులు పెండింగ్ లో ఉన్నందు వల్ల, ఆ చెల్లింపులు పూర్తి చేసిన తర్వాత ఈ నెల 6వ తేదీ నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అల్పాహార పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. అదే రోజు ఆయా జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభించేలా సన్నాహాలు మొదలు పెట్టారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి పదో తరగతి తరగతుల విద్యార్థులకు ఉదయం సమయంలో అల్పాహారం అందించనున్నారు. ఈ పథకాన్ని అక్టోబర్ 24వ తేదీన లాంఛనంగా ప్రారంభించాలని మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ పథకం అమలు చేయడానికి గానూ ఒక విద్యా సంవత్సరానికి దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పాహార పథకాన్ని ముందస్తుగా ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 13వ తేదీ నుంచి దసరా  సెలవులు ఉన్నందు వల్ల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 6 రోజుల పాటు జిల్లాకు ఒక పాఠశాలలో అమలు చేయాలని అధికారులకు నిర్దేశించారు.

అల్పాహార పథకాన్ని అమలు చేయడానికి మన ఊరు - మన బడి కార్యక్రమం కింద పనులు పూర్తి అయిన పాఠశాలలను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయగల ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలనే మొదటగా ఎంచుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల మధ్యాహ్న భోజన పథకం అక్షయపాత్ర సంస్థ ద్వారా అమలు అవుతోంది. అక్కడ ఆ సంస్థకే అల్పాహారం అందించే బాధ్యత ఇవ్వనున్నారు. దసరా సెలవుల అనంతరం ఈ నెల 26వ తేదీన మళ్లీ బడులు మొదలు కానున్నాయి. అప్పటి నుంచి అన్ని పాఠశాలల్లో అమలు చేస్తారా.. లేదా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

అల్పాహారంలో ఏయే పదార్థాలు అందించాలి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. విద్యా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో.. మెనూ విషయంపై అడగ్గా.. మెనూ గురించి తర్వాత చెబుతామంటూ ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాతే మెనూపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
Embed widget