అన్వేషించండి

Hyderabad News: ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి

Telangana News: హైదరాబాద్‌ ప్రయాణికులకు షాక్‌ ఇచ్చింది టీఎస్‌ఆర్టీసీ. ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్నం వేళలో సిటీ బస్సులను సగానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. నేటి నుంచే ఈ విధానం అమలు కానుంది.

Hyderabad RTC Buses: ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం(Afternoon) 12గంటల అయితే... నడినెత్తిన చేరుతున్న భానుడు.. మాడు పగలగొడుతున్నాడు. ఇటీవల మూడు, నాలుగు రోజులు వాతావరణం కాస్త చల్లబడినా... మళ్లీ భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు... వాహనదారులను ఇబ్బందిపెడుతున్నాయి. కార్లలో వెళ్లే వారు సంగతి అటుంచితే... బైక్‌పై ప్రయాణించే వారు.. ఎండల ధాటిని  తట్టుకోలేకపోతున్నారు. సెకండ్‌ షిఫ్ట్‌ ఆఫీసులకు వెళ్లే వారు.. అత్యవసర పరిస్థితుల్లో మధ్యాహ్నం బయటకు వెళ్లాల్సిన మధ్యతరగతి ప్రజలు... ద్విచక్ర వాహనంపై వెళ్లలేక ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారంతా... బస్సుల్లో ప్రయాణించేందుకు  మొగ్గుచూపుతున్నారు. కానీ... ఇప్పుడు వారికి ఆ అవకాశం కూడా లేకుండా చేసింది టీఎస్‌ఆర్టీసీ (TSRTC). మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లో సగం సిటీ బస్సులను తగ్గించేసింది.

మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటలకు సిటీ బస్సులను తగ్గిస్తున్నట్టు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎండలు మండుతున్న వేళ ప్రయాణికులు అంతంతమాత్రంగానే ఉంటున్నారని.. బస్సులను ఖాళీగా  తిప్పలేక... ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బస్సు సర్వీసులను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం... ఇవాళ్టి నుంచే అమలు చేస్తున్నట్టు తెలిపారు. నేడు (మంగళవారం) ఉదయం 5గంటల నుంచి  అర్థరాత్రి 12గంటల వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉంటాయని స్పష్టం చేశారాయన.. కానీ.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4గంటల మధ్య పరిమితంగానే బస్సులను నడుపుతామని చెప్పారు. ఎండలు తగ్గేవరకు మధ్యాహ్నం  వేళ...అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న జీహెచ్‌ఎంసీ అధికారుల హెచ్చరికను కూడా గుర్తుచేశారు ఆర్టీసీ అధికారులు. 

మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు పరిమితంగా సర్వీసులు
హైదరాబాద్‌లో సిటీ బస్సులను నమ్ముకుని ప్రయాణించేవారు ఎంతో మంది ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రయాణికులు తక్కువగా ఉన్నారని.. బస్సు సర్వీసులు తగ్గించేసింది టీఎస్‌ఆర్టీసీ. మధ్యాహ్నం వేళ ప్రయాణికులు తక్కువే గానీ..  అసలు లేకుండా అయితే లేరు. మరి... వారి పరిస్థితి ఏంటి..? అసలే మిట్ట మధ్యాహ్నం... ఆపై మండుటెండ... వీటితోపాటు బస్టాపుల్లో పడిగాపులు కాయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. బస్సు సర్వీసులను సగానికి తగ్గిస్తున్నామని చెప్పిన  ఆర్టీసీ అధికారులు.. ఎన్ని తగ్గిస్తున్నామనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఐదు నిమిషాలకు ఒక బస్సు తిరిగే చోట... 10 నిమిషాలకు ఒకటి నడుపుతామని మాత్రం ఒక అధికారి చెప్పారు. 

హైదరాబాద్‌లో మొత్తం 2వేల 250 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు... ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఇవి ఈ బస్సులన్నీ తిప్పేవారు. కానీ... ఆర్టీసీ అధికారులు తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల... మధ్యాహ్నం వేళ 12వందల 75  బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొత్తం 2వేల 550 బస్సులు తిరుగుతాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల వరకు... సగం బస్సులకు విశ్రాంతి ఇస్తారు. అంటే ఆ  సమయంలో 12 వందల 75 బస్సులు మాత్రమే తిరుగుతాయి. మళ్లీ... సాయంత్రం 4గంటల నుంచి అర్థరాత్రి 12గంటల వరకు మొత్తం 2వేల 550 బస్సులను తిప్పుతామని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ అధికారులు తెలిపారు. మొత్తం బస్సులు  తిరుగుతున్నప్పుడే.. బస్సుల కోసం చాలా సేపు వేచి చూడాల్సి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు... ఎండల పేరుతో.. ప్రయాణికులు రావడంలేదన్న సాకుతో... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులను సగానికి తగ్గించేశారు. మరి... ఇప్పడు బస్సు కోసం  ఎంత సేపు వేచిచూడాలో మరి. 

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget