అన్వేషించండి

KTR on Governors: రాజ్యాంగ పదవులు బీజేపీ చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయి: మంత్రి కేటీఆర్

KTR on Governors: రాజ్యాంగ పదవులను బీజేపీ రాజకీయ సాధనాలుగా మార్చుకుంటోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా గవర్నర్ల తీరుపై విమర్శలు చేశారు.

KTR on Governors: బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల తీరుపై మంత్రి విమర్శలు చేశారు. బీజేపీయేతర రాష్ట్రాలను చూస్తే కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ, ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తుందని ట్వీట్ చేశారు. రాజ్యాంగ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయంటూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేటీఆర్ తన ట్వీట్ లో ప్రస్తావించారు.

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం బహిరంగ రహస్యం. బాహాటంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం తెలిసిందే. అయితే చాలా కాలంగా రాజ్ భవన్ లో పెండింగ్ పడిన బిల్లుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ బిల్లుల వ్యవహారంలో కదలిక వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టిన నేపథ్యంలో.. మూడు సాధారణ బిల్లులపై ఆమోదముద్ర వేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్నవాటిలో కీలకమైన యూనివర్సిటీల నియామక బోర్డు, అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం కోసం నిలిపివేశారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం తిప్పి పంపించారు. ఇంకో రెండు బిల్లులపై మరింత పరిశీలన అవసరమని పేర్కొంటూ రాజ్ భవన్ లోనే పెండింగ్ లో ఉంచారు. 

మొత్తంగా గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇటీవలి వరకు రాష్ట్ర శాసన సభ ఆమోదించిన 10 బిల్లులకు సంబంధించి.. రాజ్ భవన్ ఇచ్చిన వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీం కోర్టుకు అందజేశారు. 

గవర్నర్ తీరుపై హరీష్ రావు ఆగ్రహం

ఈ విషయంపై మంత్రి హరీష్ రావు సీరియస్‌ అయ్యారు. కోర్టుల్లో కేసులు వేస్తే కానీ బిల్లులు పాస్‌ అవ్వని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. మంత్రులు కలిసినా గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను 7 నెలలుగా  గవర్నర్ ఆపారని హరీష్ గుర్తు చేశారు. రాజ్ భవన్ రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసన్నారు. ఎన్ని కుట్రలు చేసైనా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలనే బీజేపీ వైఖరి తేటతెల్లమైందని అన్నారు. ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని, రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా  అని ప్రశ్నించారు.

తమిళనాడు గవర్నర్ విషయంలోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయమే తీసుకుంది. బిల్లులను పెండింగులో పెట్టడంపై తమిళనాడు శాసనసభ ఏకంగా తీర్మానమే చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు నిర్దిష్ట వ్యవధిలో ఆమోదం తెలిపేలా తక్షణమే గవర్నర్‌కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది స్టాలిన్ ప్రభుత్వం. తీర్మానానికి అనుకూలంగా డీఎంకే, కూటమి పార్టీలు ఓటు వేశాయి. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ప్రజాస్వామ్య సూత్రాలను, అత్యున్నత శాసనసభ సార్వభౌమాధికారాన్ని గవర్నర్ కాలరాస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని ఈ సభ ఏకగ్రీవంగా కోరుతోందన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిర్దిష్ట వ్యవధిలో గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Jupally Krishna Rao: ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
Hyderabad Crime News:మేడ్చల్‌ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
మేడ్చల్‌ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget