అన్వేషించండి

Statue Of Equality: రామానుజాచార్యుల సమతా సూత్రం రాజ్యాంగానికి స్ఫూర్తి : ప్రధాని మోదీ

రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం ఇచ్చారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో నిర్మించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు.

హైదరాబాద్ ముచ్చింతల్‌ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి రోజున జాతికి అంకితం ఇచ్చారు. పంచలోహాలతో రూపొందించిన ఈ విగ్రహం కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాలు నిర్మించారు. సమతామూర్తి కేంద్రాన్ని ఎల్ఈడీ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన యాగంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యాగశాలలో ప్రధానికి చినజీయర్‌ స్వామి స్వర్ణకంకణం అలంకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు.  

130 కోట్ల ప్రజలకు యజ్ఞఫలం

ముచ్చింతల్ ఆశ్రమంలో 108 వైష్ణవ ఆలయాలను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శిస్తున్నారు. అనంతరం సమతాస్ఫూర్తి కేంద్రం రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఎంపీ బండి సంజయ్, సుధాకర్ రెడ్డి సమతా స్ఫూర్తి కేంద్రంలో మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని, గవర్నర్ విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్నారు. విష్వక్సేనేష్ఠి యాగం పూర్ణాహుతి చేశారు. ప్రధాని మోదీ శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశమంతా తిరిగి దేవాలయాలు చూసిన అనుభూతి కలిగిందన్నారు. గురువు వల్లే మనిషి జ్ఞానం వికసిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని పేర్కొన్నారు. చినజీయర్‌స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారన్న ప్రధాని.. ఆ యజ్ఞఫలం130 కోట్ల ప్రజలకు అందాలన్నారు. 

ఆధునిక అంబేడ్కర్ 

రామానుజాచార్యులు అంధ విశ్వాసాలను పారదోలారని ప్రధాని మోదీ అన్నారు. రామానుజుడి విశిష్టాద్వైతం ప్రజలందరికీ ప్రేరణ అని తెలిపారు. భక్తికి కులం, జాతి లేదని రామానుజాచార్యులు చాటి చెప్పారన్నారు. రామానుచార్యులు దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన మహానుభావుడు అన్నారు. మనిషికి జాతి కాదు, గుణం ముఖ్యమని ఆయన లోకానికి చాటిచెప్పారని గుర్తుచేశారు. రామానుజాచార్యుల సమతా సూత్రం రాజ్యాంగానికి స్ఫూర్తి అని ప్రధాని తెలిపారు. అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక అంబేడ్కర్ రామానుజాచార్యులు అన్నారు. హైదరాబాద్‌ ఏర్పాటులో సర్దార్ పటేల్‌ కీలక పాత్ర పోషించారన్ ప్రధాని... సర్దార్‌ పటేల్‌ చాణక్యం వల్లే హైదరాబాద్‌కు విముక్తి కలిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

అంతకు ముందు ఇక్రిశాట్ లో 

అంతకు ముందు ఇక్రిశాట్‌ 50వ వార్షికోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం స్మారక స్టాంపును కూడా విడుదల చేశారు. మొక్కల సంరక్షణపై వాతావరణ మార్పు పరిశోధన సౌకర్యం, రాపిడ్ జనరేషన్‌ అడ్వాన్స్‌ ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించారు. ఇక్రిసాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి... 2070 నాటికి నెట్‌జీరోను లక్ష్యంగా ఎంచుకున్నట్టు చెప్పారు.  పర్యావరణానికి అనుగుణంగా ప్రజల జీవితాలను జీవనశైలిని మార్చుకోవాల్సిన ఆవశ్యతకు గుర్తించామన్నారు మోదీ. ప్రోప్లానెట్‌ పీపుల్ ఉద్యానికి పిలుపునిచ్చామని.. వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి ఇవి తప్పనిసరి అన్నారాయన.  వ్యవసాయాన్ని సులభతరం చేయడం, నిలకడగా మంచి దిగుబడులు సాధించడంలో ఇక్రిసాట్‌కు ఐదు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు ప్రధానమంత్రి మోదీ. ఈ విషయంలో చాలా దేశాలకు ఇక్రిసాట్‌ సహాయం చేసిందని గుర్తు చేశారు. భారత దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఇక్రిసాట్‌ తన అనుభవాన్ని ఉపయోగిస్తుందని ఆశించారు మోదీ. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget