అన్వేషించండి

Bandi Sanjay: తెలంగాణలో పీఎఫ్ఐ బాంబులు పేల్చేందుకు కుట్ర చేస్తోంది - బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) బాంబులు పేల్చేందుకు కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఆ పార్టీ హిందువుల తలలు నరికేదని వివరించారు. 

Bandi Sanjay: తెలంగాణలో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. హిందువుల తలలు నరికి చంపే పీఎఫ్ఐ.. ఎంఐఎం నేతల కనుసన్నల్లోనే పని చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో పీఎఫ్ఐ విస్తరించడానికి టీఆర్ఎస్ యే కారణం అని, ఆ పార్టీ నేతలు కొంతమంది చందాలు ఇచ్చి మరి ఆ పార్టీని పెంచి పోషిస్తున్నారంటూ తీవ్ర కామెంట్లు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కు నాగోల్ చౌరస్తా వద్ద స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 100 రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా గజమాలతో సకత్కరించారు. ఓ గొర్రెపిల్లను కూడా బహుకరించారు. కాగా నాగోల్, కొత్తపేట డివిజన్ మోహన్ నగర్, చైతన్యపురిలో ఆయన ప్రసంగించారు. 

కవిత లిక్కర్ స్కాంపై సీఎం నోరెందుకు మెదపట్లేదు..?

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్... పీఎఫ్ఐకు చెందిన సంస్థలపై ఎన్ఐఏ దాడి చేసేంతవరకు ఎందుకు పట్టించుకోలేదని బండి సంజయ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ ముఠా బిహీర్ లో బాంబులు తయారు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పేల్చేందుకు కుట్ర చేసిందని చెప్పారు. 2040 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది ఒక్క బీజేపీయేనని తెలిపారు. అలాగే ఏ స్కాం బయటకు వచ్చినా అందులో కల్వకుంట్ల కుటుంబం పాత్ర ఉంటుందని ఎద్దేవా చేశారు. కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న సీఎం కేసీఆర్... కవిత లిక్కర్ స్కాంపై ఎందుకు నోరు మెదపట్లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలను గాలికి వదిలేసి దేశ రాజకీయాలంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి సీఎం కేసీఆర్ కుటుంబం క్వారంటైన్ కు వెళ్తుందంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

ఈరోజుతో ముగియనున్న ప్రజా సంగ్రామ యాత్ర.. 

ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 22 అంటే ఈరోజు వరకు కొనసాగుతోంది. ముగింపు కార్యక్రమం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఇబ్రహీంపట్నంలోని పెద్ద అంబర్ పేట సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. స్థలం కూడా ఖరారైంది. ఈ సభకు కేంద్ర గ్రామీణాభివ్రుద్ది సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సక్సెస్ చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలోనే పాదయాత్ర పేరిట దాదాపు 13 బహిరంగ సభలు నిర్వహించి విజయవంతం చేశామని అన్నారు. అధికారిక పార్టీ సహా మరే పార్టీ కూడా ఇంత తక్కువ సమయంలో ఈ సంఖ్యలో సభలు పెట్టిన దాఖలాలు లేవని అన్నారు. 4వ విడత పాదయాత్ర, పేద అంబర్ పేట బహిరంగ సభ మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావం చూపడంతో పాటు బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఇమేజ్ పెరుగుతుండటంతో పార్టీని దెబ్బ తీసేందుకు అధికార పార్టీ వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Embed widget