అన్వేషించండి

Niranjan Jyoti : ప్రజల సొమ్ము దోచిన నేతలను జైల్లో వేస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై సాధ్వీ నిరంజన్ జ్యోతి ఫైర్

Niranjan Jyoti : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజధనాన్ని దోచుకున్న వాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడతామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు.

Niranjan Jyoti : ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఉన్న జనాన్ని చూస్తే ప్రయాగ్ రాజ్ సంగమంలో జనంలా అనుభూతి కలుగుతోందని కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. హైదరాబాద్ కు గతంలో ఒక హిందూ సభకు వచ్చానన్న ఆమె, 2 నెలల క్రితం తిరంగా ర్యాలీలో కూడా హైదరాబాద్ లో పాల్గొన్నానన్నారు. హైదరాబాద్ లో మతమార్పిడులు జరుగుతున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. ఓవైసీ లాంటి వారు దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  యూపీలో ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ల ఇండ్లను సీఎం యోగి బుల్డోజర్లతో కూలగొట్టారని గుర్తుచేశారు. తెలంగాణ లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ల ఇండ్లను బుల్డోజర్లతో కూలగొడతామన్నారు.  దేశంలో మోదీకి వ్యతిరేకంగా దుష్ట శక్తులు ఏకం అయ్యాయని, ఇలాంటి దుష్ట శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. 

బీజేపీ ముస్లింలను వ్యతిరేకించదు 

"2014కు ముందు హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లాలన్నా ఉగ్రవాద ముప్పు భయం ఉండేది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే, హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ప్రారంభించారు. పేదలకు తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారా?. పేదల కోసం తెలంగాణకు మోదీ ప్రభుత్వం 2,40,000 ఇండ్లు మంజూరు చేసింది. తెలంగాణలో కుటుంబ పాలన పోయి, ప్రజల కేంద్రంగా ఉండే ప్రభుత్వం ఏర్పడాలి. 15వ ఆర్థికసంఘం నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లిస్తోంది. ఉగ్రవాదుల ఇండ్లు కూలిస్తే, ఎంఐఎం లాంటి పార్టీలకు ఎందుకు బాధ కలుగుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉగ్రవాదులను, ప్రజల సొమ్ము దోచిన పార్టీల నేతలను కూడా జైల్లో వేస్తాం. బీజేపీ ముస్లింలను వ్యతిరేకించదు. బీజేపీ ముస్లిం వ్యతిరేకే అయితే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసేదా? గిరిజనులకు బీజేపీ వ్యతిరేకే అయితే... రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూను చేసేదా?:"- సాధ్వి నిరంజన్ జ్యోతి 

రాహుల్ కు చివరి యాత్ర 
 
కరోనా సమయంలో 80 కోట్ల ప్రజలకు ఉచిత బియ్యం అందించామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. రాహుల్ గాంధీ చేసేది భారత్ జోడో యాత్ర కాదని, భారత్ చోడో యాత్ర అని విమర్శించారు. ఇదే రాహుల్ గాంధీకి చివరి యాత్ర అవుతుందన్నారు.  ఆ తర్వాత రాహుల్ గాంధీ వాళ్ల అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లాల్సిందే అన్నారు. రాహుల్ గాంధీ దళితుల ఇంట్లో కూర్చుని రోటీ తింటే, దళితుల పేదరికం పోతుందా? అని ప్రశ్నించారు. మోదీ పేదలకు మరుగుదొడ్లు, ఇండ్లు కట్టించి, ఉచిత గ్యాస్ ఇచ్చి, రైతులకు కిసాన్ యోజన కింద డబ్బులు ఇచ్చి, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు.  2014 నుంచి బీజేపీ కేంద్రంలో అవినీతి రహిత  పాలన అందిస్తోందని తెలిపారు. "తెలంగాణ విమోచన దినోత్సవం" ను ఎంఐఎంకు భయపడే 8 ఏళ్లుగా కేసీఆర్ జరపలేదని ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కేసీఆర్ ఓ వర్గాన్ని సంతృప్తి పరచడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకపోతే కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా 'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని' నిర్వహించిందన్నారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ లో 77 సీట్లు ఉంటే అక్కడ ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణలో 3 అసెంబ్లీ స్థానాల్లో ఉంటే ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా? అని ప్రశ్నించారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget