అన్వేషించండి

Niranjan Jyoti : ప్రజల సొమ్ము దోచిన నేతలను జైల్లో వేస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై సాధ్వీ నిరంజన్ జ్యోతి ఫైర్

Niranjan Jyoti : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజధనాన్ని దోచుకున్న వాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడతామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు.

Niranjan Jyoti : ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఉన్న జనాన్ని చూస్తే ప్రయాగ్ రాజ్ సంగమంలో జనంలా అనుభూతి కలుగుతోందని కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. హైదరాబాద్ కు గతంలో ఒక హిందూ సభకు వచ్చానన్న ఆమె, 2 నెలల క్రితం తిరంగా ర్యాలీలో కూడా హైదరాబాద్ లో పాల్గొన్నానన్నారు. హైదరాబాద్ లో మతమార్పిడులు జరుగుతున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. ఓవైసీ లాంటి వారు దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  యూపీలో ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ల ఇండ్లను సీఎం యోగి బుల్డోజర్లతో కూలగొట్టారని గుర్తుచేశారు. తెలంగాణ లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ల ఇండ్లను బుల్డోజర్లతో కూలగొడతామన్నారు.  దేశంలో మోదీకి వ్యతిరేకంగా దుష్ట శక్తులు ఏకం అయ్యాయని, ఇలాంటి దుష్ట శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. 

బీజేపీ ముస్లింలను వ్యతిరేకించదు 

"2014కు ముందు హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లాలన్నా ఉగ్రవాద ముప్పు భయం ఉండేది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే, హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ప్రారంభించారు. పేదలకు తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారా?. పేదల కోసం తెలంగాణకు మోదీ ప్రభుత్వం 2,40,000 ఇండ్లు మంజూరు చేసింది. తెలంగాణలో కుటుంబ పాలన పోయి, ప్రజల కేంద్రంగా ఉండే ప్రభుత్వం ఏర్పడాలి. 15వ ఆర్థికసంఘం నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లిస్తోంది. ఉగ్రవాదుల ఇండ్లు కూలిస్తే, ఎంఐఎం లాంటి పార్టీలకు ఎందుకు బాధ కలుగుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉగ్రవాదులను, ప్రజల సొమ్ము దోచిన పార్టీల నేతలను కూడా జైల్లో వేస్తాం. బీజేపీ ముస్లింలను వ్యతిరేకించదు. బీజేపీ ముస్లిం వ్యతిరేకే అయితే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసేదా? గిరిజనులకు బీజేపీ వ్యతిరేకే అయితే... రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూను చేసేదా?:"- సాధ్వి నిరంజన్ జ్యోతి 

రాహుల్ కు చివరి యాత్ర 
 
కరోనా సమయంలో 80 కోట్ల ప్రజలకు ఉచిత బియ్యం అందించామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. రాహుల్ గాంధీ చేసేది భారత్ జోడో యాత్ర కాదని, భారత్ చోడో యాత్ర అని విమర్శించారు. ఇదే రాహుల్ గాంధీకి చివరి యాత్ర అవుతుందన్నారు.  ఆ తర్వాత రాహుల్ గాంధీ వాళ్ల అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లాల్సిందే అన్నారు. రాహుల్ గాంధీ దళితుల ఇంట్లో కూర్చుని రోటీ తింటే, దళితుల పేదరికం పోతుందా? అని ప్రశ్నించారు. మోదీ పేదలకు మరుగుదొడ్లు, ఇండ్లు కట్టించి, ఉచిత గ్యాస్ ఇచ్చి, రైతులకు కిసాన్ యోజన కింద డబ్బులు ఇచ్చి, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు.  2014 నుంచి బీజేపీ కేంద్రంలో అవినీతి రహిత  పాలన అందిస్తోందని తెలిపారు. "తెలంగాణ విమోచన దినోత్సవం" ను ఎంఐఎంకు భయపడే 8 ఏళ్లుగా కేసీఆర్ జరపలేదని ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కేసీఆర్ ఓ వర్గాన్ని సంతృప్తి పరచడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకపోతే కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా 'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని' నిర్వహించిందన్నారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ లో 77 సీట్లు ఉంటే అక్కడ ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణలో 3 అసెంబ్లీ స్థానాల్లో ఉంటే ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా? అని ప్రశ్నించారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget