అన్వేషించండి

Niranjan Jyoti : ప్రజల సొమ్ము దోచిన నేతలను జైల్లో వేస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై సాధ్వీ నిరంజన్ జ్యోతి ఫైర్

Niranjan Jyoti : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజధనాన్ని దోచుకున్న వాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడతామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు.

Niranjan Jyoti : ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఉన్న జనాన్ని చూస్తే ప్రయాగ్ రాజ్ సంగమంలో జనంలా అనుభూతి కలుగుతోందని కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. హైదరాబాద్ కు గతంలో ఒక హిందూ సభకు వచ్చానన్న ఆమె, 2 నెలల క్రితం తిరంగా ర్యాలీలో కూడా హైదరాబాద్ లో పాల్గొన్నానన్నారు. హైదరాబాద్ లో మతమార్పిడులు జరుగుతున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. ఓవైసీ లాంటి వారు దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  యూపీలో ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ల ఇండ్లను సీఎం యోగి బుల్డోజర్లతో కూలగొట్టారని గుర్తుచేశారు. తెలంగాణ లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ల ఇండ్లను బుల్డోజర్లతో కూలగొడతామన్నారు.  దేశంలో మోదీకి వ్యతిరేకంగా దుష్ట శక్తులు ఏకం అయ్యాయని, ఇలాంటి దుష్ట శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. 

బీజేపీ ముస్లింలను వ్యతిరేకించదు 

"2014కు ముందు హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లాలన్నా ఉగ్రవాద ముప్పు భయం ఉండేది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే, హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ప్రారంభించారు. పేదలకు తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారా?. పేదల కోసం తెలంగాణకు మోదీ ప్రభుత్వం 2,40,000 ఇండ్లు మంజూరు చేసింది. తెలంగాణలో కుటుంబ పాలన పోయి, ప్రజల కేంద్రంగా ఉండే ప్రభుత్వం ఏర్పడాలి. 15వ ఆర్థికసంఘం నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లిస్తోంది. ఉగ్రవాదుల ఇండ్లు కూలిస్తే, ఎంఐఎం లాంటి పార్టీలకు ఎందుకు బాధ కలుగుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉగ్రవాదులను, ప్రజల సొమ్ము దోచిన పార్టీల నేతలను కూడా జైల్లో వేస్తాం. బీజేపీ ముస్లింలను వ్యతిరేకించదు. బీజేపీ ముస్లిం వ్యతిరేకే అయితే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసేదా? గిరిజనులకు బీజేపీ వ్యతిరేకే అయితే... రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూను చేసేదా?:"- సాధ్వి నిరంజన్ జ్యోతి 

రాహుల్ కు చివరి యాత్ర 
 
కరోనా సమయంలో 80 కోట్ల ప్రజలకు ఉచిత బియ్యం అందించామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. రాహుల్ గాంధీ చేసేది భారత్ జోడో యాత్ర కాదని, భారత్ చోడో యాత్ర అని విమర్శించారు. ఇదే రాహుల్ గాంధీకి చివరి యాత్ర అవుతుందన్నారు.  ఆ తర్వాత రాహుల్ గాంధీ వాళ్ల అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లాల్సిందే అన్నారు. రాహుల్ గాంధీ దళితుల ఇంట్లో కూర్చుని రోటీ తింటే, దళితుల పేదరికం పోతుందా? అని ప్రశ్నించారు. మోదీ పేదలకు మరుగుదొడ్లు, ఇండ్లు కట్టించి, ఉచిత గ్యాస్ ఇచ్చి, రైతులకు కిసాన్ యోజన కింద డబ్బులు ఇచ్చి, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు.  2014 నుంచి బీజేపీ కేంద్రంలో అవినీతి రహిత  పాలన అందిస్తోందని తెలిపారు. "తెలంగాణ విమోచన దినోత్సవం" ను ఎంఐఎంకు భయపడే 8 ఏళ్లుగా కేసీఆర్ జరపలేదని ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కేసీఆర్ ఓ వర్గాన్ని సంతృప్తి పరచడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకపోతే కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా 'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని' నిర్వహించిందన్నారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ లో 77 సీట్లు ఉంటే అక్కడ ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణలో 3 అసెంబ్లీ స్థానాల్లో ఉంటే ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా? అని ప్రశ్నించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget