అన్వేషించండి

Niranjan Jyoti : ప్రజల సొమ్ము దోచిన నేతలను జైల్లో వేస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై సాధ్వీ నిరంజన్ జ్యోతి ఫైర్

Niranjan Jyoti : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజధనాన్ని దోచుకున్న వాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడతామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు.

Niranjan Jyoti : ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఉన్న జనాన్ని చూస్తే ప్రయాగ్ రాజ్ సంగమంలో జనంలా అనుభూతి కలుగుతోందని కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. హైదరాబాద్ కు గతంలో ఒక హిందూ సభకు వచ్చానన్న ఆమె, 2 నెలల క్రితం తిరంగా ర్యాలీలో కూడా హైదరాబాద్ లో పాల్గొన్నానన్నారు. హైదరాబాద్ లో మతమార్పిడులు జరుగుతున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. ఓవైసీ లాంటి వారు దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  యూపీలో ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ల ఇండ్లను సీఎం యోగి బుల్డోజర్లతో కూలగొట్టారని గుర్తుచేశారు. తెలంగాణ లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ల ఇండ్లను బుల్డోజర్లతో కూలగొడతామన్నారు.  దేశంలో మోదీకి వ్యతిరేకంగా దుష్ట శక్తులు ఏకం అయ్యాయని, ఇలాంటి దుష్ట శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. 

బీజేపీ ముస్లింలను వ్యతిరేకించదు 

"2014కు ముందు హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లాలన్నా ఉగ్రవాద ముప్పు భయం ఉండేది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే, హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ప్రారంభించారు. పేదలకు తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారా?. పేదల కోసం తెలంగాణకు మోదీ ప్రభుత్వం 2,40,000 ఇండ్లు మంజూరు చేసింది. తెలంగాణలో కుటుంబ పాలన పోయి, ప్రజల కేంద్రంగా ఉండే ప్రభుత్వం ఏర్పడాలి. 15వ ఆర్థికసంఘం నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లిస్తోంది. ఉగ్రవాదుల ఇండ్లు కూలిస్తే, ఎంఐఎం లాంటి పార్టీలకు ఎందుకు బాధ కలుగుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉగ్రవాదులను, ప్రజల సొమ్ము దోచిన పార్టీల నేతలను కూడా జైల్లో వేస్తాం. బీజేపీ ముస్లింలను వ్యతిరేకించదు. బీజేపీ ముస్లిం వ్యతిరేకే అయితే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసేదా? గిరిజనులకు బీజేపీ వ్యతిరేకే అయితే... రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూను చేసేదా?:"- సాధ్వి నిరంజన్ జ్యోతి 

రాహుల్ కు చివరి యాత్ర 
 
కరోనా సమయంలో 80 కోట్ల ప్రజలకు ఉచిత బియ్యం అందించామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. రాహుల్ గాంధీ చేసేది భారత్ జోడో యాత్ర కాదని, భారత్ చోడో యాత్ర అని విమర్శించారు. ఇదే రాహుల్ గాంధీకి చివరి యాత్ర అవుతుందన్నారు.  ఆ తర్వాత రాహుల్ గాంధీ వాళ్ల అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లాల్సిందే అన్నారు. రాహుల్ గాంధీ దళితుల ఇంట్లో కూర్చుని రోటీ తింటే, దళితుల పేదరికం పోతుందా? అని ప్రశ్నించారు. మోదీ పేదలకు మరుగుదొడ్లు, ఇండ్లు కట్టించి, ఉచిత గ్యాస్ ఇచ్చి, రైతులకు కిసాన్ యోజన కింద డబ్బులు ఇచ్చి, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు.  2014 నుంచి బీజేపీ కేంద్రంలో అవినీతి రహిత  పాలన అందిస్తోందని తెలిపారు. "తెలంగాణ విమోచన దినోత్సవం" ను ఎంఐఎంకు భయపడే 8 ఏళ్లుగా కేసీఆర్ జరపలేదని ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కేసీఆర్ ఓ వర్గాన్ని సంతృప్తి పరచడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకపోతే కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా 'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని' నిర్వహించిందన్నారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ లో 77 సీట్లు ఉంటే అక్కడ ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణలో 3 అసెంబ్లీ స్థానాల్లో ఉంటే ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా? అని ప్రశ్నించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena Meeting: నెలాఖరున విశాఖలో జనసేన కార్యకర్తల మీటింగ్ - కీలక ప్రకటన చేయనున్న పవన్ కల్యాణ్
నెలాఖరున విశాఖలో జనసేన కార్యకర్తల మీటింగ్ - కీలక ప్రకటన చేయనున్న పవన్ కల్యాణ్
Kaleshwaram report KCR: కేసీఆర్, హరీష్ సంచలన నిర్ణయం - జస్టిస్ ఘోష్ రిపోర్టు చెల్లదని హైకోర్టులో పిటిషన్లు
కేసీఆర్, హరీష్ సంచలన నిర్ణయం - జస్టిస్ ఘోష్ రిపోర్టు చెల్లదని హైకోర్టులో పిటిషన్లు
Nizamabad Pigeon arrested: బోధన్‌లో పావురాన్ని అరెస్టు చేసిన పోలీసులు -  ఎంత పని చేసిందంటే ?
బోధన్‌లో పావురాన్ని అరెస్టు చేసిన పోలీసులు - ఎంత పని చేసిందంటే ?
Suhas: సుహాస్ కెరీర్‌లో క్రూషియల్... 'మందాడి' ఎందుకంత స్పెషల్ అంటే!?
సుహాస్ కెరీర్‌లో క్రూషియల్... 'మందాడి' ఎందుకంత స్పెషల్ అంటే!?
Advertisement

వీడియోలు

Karate Kalyani on GHMC Mayor | బంజారాహిల్స్ భూవివాదంపై స్పందించిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి
Donald Trump Dealing With India | మోదీతో దోస్తీ అంటూనే భారత్ పై టారిఫ్ ల భారం దేనికి ట్రంప్.? | ABP Desam
Asia Cup 2025 Team India | ఆసియా కప్ కు టీమిండియా ఎంపిక..ఆ ప్లేయర్లను తొక్కేశారా.? | ABP Desam
Ramya Krishna in Allu Arjun and Atlee Movie | అల్లు అర్జున్ సినిమాలో రమ్య కృష్ణ ? | ABP Desam
Indi Alliance Candidate B Sudershan Reddy | ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Meeting: నెలాఖరున విశాఖలో జనసేన కార్యకర్తల మీటింగ్ - కీలక ప్రకటన చేయనున్న పవన్ కల్యాణ్
నెలాఖరున విశాఖలో జనసేన కార్యకర్తల మీటింగ్ - కీలక ప్రకటన చేయనున్న పవన్ కల్యాణ్
Kaleshwaram report KCR: కేసీఆర్, హరీష్ సంచలన నిర్ణయం - జస్టిస్ ఘోష్ రిపోర్టు చెల్లదని హైకోర్టులో పిటిషన్లు
కేసీఆర్, హరీష్ సంచలన నిర్ణయం - జస్టిస్ ఘోష్ రిపోర్టు చెల్లదని హైకోర్టులో పిటిషన్లు
Nizamabad Pigeon arrested: బోధన్‌లో పావురాన్ని అరెస్టు చేసిన పోలీసులు -  ఎంత పని చేసిందంటే ?
బోధన్‌లో పావురాన్ని అరెస్టు చేసిన పోలీసులు - ఎంత పని చేసిందంటే ?
Suhas: సుహాస్ కెరీర్‌లో క్రూషియల్... 'మందాడి' ఎందుకంత స్పెషల్ అంటే!?
సుహాస్ కెరీర్‌లో క్రూషియల్... 'మందాడి' ఎందుకంత స్పెషల్ అంటే!?
Abusing in Anger : కోపంలో ఎవరినైనా తిడితే.. చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా?
కోపంలో ఎవరినైనా తిడితే.. చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా?
Poonam Bajwa: ఎవర్రా మీరంతా? మరీ ఇలా ఉన్నారేంట్రా...? ఆ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన పూనమ్‌
ఎవర్రా మీరంతా? మరీ ఇలా ఉన్నారేంట్రా...? ఆ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన పూనమ్‌
War 2 Official Collection: 'వార్ 2' కలెక్షన్లు అనౌన్స్ చేసిన ప్రొడక్షన్ హౌస్... 300 కోట్ల క్లబ్బులో ఎన్టీఆర్ సినిమా... కానీ??
'వార్ 2' కలెక్షన్లు అనౌన్స్ చేసిన ప్రొడక్షన్ హౌస్... 300 కోట్ల క్లబ్బులో ఎన్టీఆర్ సినిమా... కానీ??
Seerat Kapoor: వైట్ సూట్‌లో బాస్‌ లేడీలా సీరత్ కపూర్... గ్లామర్ గాళ్ లేటెస్ట్ ఫోటోస్ చూశారా?
వైట్ సూట్‌లో బాస్‌ లేడీలా సీరత్ కపూర్... గ్లామర్ గాళ్ లేటెస్ట్ ఫోటోస్ చూశారా?
Embed widget