అన్వేషించండి

Amit Shah: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ పర్యటనకు అమిత్ షా - షెడ్యూల్ ఇదే!

Telangana News: పార్లమెంట్ ఎన్నికల తరుణంలో తెలంగాణపై అమిత్ షా నజర్ వేశారు. పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్దం చేసేందుకు రాష్ట్రానికి వస్తున్నారు.

Amit Shah Tour in Telangana: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణపై కాషాయ పార్టీ దృష్టి పెట్టింది. అగ్రనేతలు వరుసగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే విజయ సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మోదీ పర్యటనతో టీబీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపగా.. పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం చేసేందుకు ఈ నెల 12న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

సోషల్ మీడియా వారియర్లతో మీటింగ్

ఈ నెల 12న హైదరాబాద్ రానున్న అమిత్ షా.. బీజేపీ సోషల్ మీడియా వారియర్లతో సమావేశం కానున్నారు. దాదాపు మూడు వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలు ఈ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అలాగే ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ అధ్యక్షులతో అమిత్ షా సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సూచనలు చేయనున్నారు. ఇటీవల మోదీ రాష్ట్రానికి రాగా.. కొద్ది రోజుల వ్యవధిలోనే అమిత్ షా కూడా రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అగ్రనేతల రాకను బట్టి చూస్తే తెలంగాణలో  పార్టీ బలోపేతంపై కమలదళం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే ప్రచారం నడుస్తోంది. అంతకంటే ముందు అమిత్ షా వస్తుండటం కీలకంగా మారింది.

పది ఎంపీ సీట్లపై కన్ను

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లను గెలుచుకోవాలనేది బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల విజయ సంకల్ప యాత్ర, రథ యాత్రలను నిర్వహించింది. అలాగే ఇటీవల ప్రకటించిన బీజేపీ తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి నేతలను చేర్చుకోవడంపై కూడా దృష్టి పెట్టింది. ఇటీవల బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.  నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కమలం గూటికి చేరారు. వారిలో రాములు నాయక్ కుమారుడు భరత్‌కు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ బీజేపీ కేటాయించగా.. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్‌కు అవకాశం ఇచ్చారు. బీజేపీ తరపున ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్ సిట్టింగ్‌లను పార్టీలో చేర్చుకుని బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఈ సారైనా పుంజుకుంటుందా?

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకుని సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లలో విజయం సాధించింది. దీంతో ఈ సారి అంతకంటే ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని బీజేపీ చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ఆ పార్టీలోని చాలామంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
Nirmal Udumpur Tribals Non Cooperation Movement : నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Embed widget