అన్వేషించండి

Mancherial Students: 'సార్ మేమూ మీతోనే వచ్చేస్తాం' - బదిలీ అయిన టీచర్ వెంటే విద్యార్థులు, అదే పాఠశాలలో 141 మంది చేరిక

Telangana News: తమకు విద్యాబుద్ధులు నేర్పి, అంకితభావంతో కృషి చేసిన టీచర్ బదిలీపై వెళ్లడాన్ని ఆ విద్యార్థులు తట్టుకోలేకపోయారు. టీచర్ వెంటే మేము సైతం అంటూ ఆయన బదిలీ అయిన పాఠశాలలోనే చేరిపోయారు.

Students Joined Where The Teacher Transfer In Jannaram In Mancherial: విద్యార్థులకు బాగా చదువు చెప్పిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఎవరైనా బదిలీపై వెళ్లిపోతుంటే 'వెళ్లొద్దు సార్' అంటూ ఆ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు చూశాం. ఆ టీచర్‌ను కన్నీటితో సాగనంపడమూ చూశాం. కానీ ఇక్కడ తమ భవితను తీర్చిదిద్ది తమ గురించి నిరంతరం కృషి చేసిన ఉపాధ్యాయుడిని ఆ విద్యార్థులు వదులుకోలేకపోయారు. ఆ టీచర్ బదిలీ అయిన స్కూల్లోనే వారంతా చేరిపోయారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 141 మంది విద్యార్థులు ఒకే పాఠశాలలో చేరిపోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

ఆ టీచర్ విజయ గాథ

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశాలలో 2012, జులై 13న ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్ చేరారు. అప్పుడు అక్కడ 5 తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. శ్రీనివాస్ పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. ఆట పాటలతో పాఠాలు బోధిస్తూ, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అంకితభావం, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే తపనతో తోటి ఉపాధ్యాయులతో కలిసి మంచి ఫలితాలు తీసుకొచ్చారు. గురుకుల, నవోదయ వంటి పరీక్షలకు శిక్షణ ఇస్తూనే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. అనతికాలంలోనే విద్యార్థుల సంఖ్య 252కు చేరింది. గత ఐదేళ్లుగా జూన్ చివరిలోనే ఆ పాఠశాలలో 'నో అడ్మిషన్' బోర్డు తగిలిస్తున్నారు. పొనకల్‌లో ఉన్న పాఠశాలకు మండలంలోని సుమారు 10 గ్రామాల నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ఆటోలో పంపించేవారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల కంటే ఈ పాఠశాల నుంచే గురుకుల, నవోదయ పరీక్షల్లో ఎక్కువగా విద్యార్థులు ఎంపికవుతున్నారు. శ్రీనివాస్ వారికి అత్యుత్తమ బోధన అందించడమే కాకుండా తోటి ఉపాధ్యాయులతో కలిసి అంకితభావంతో జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

టీచర్ వెంటే విద్యార్థులు

ఇటీవల ఎస్జీటీలను ప్రభుత్వం బదిలీ చేయగా.. జాజాల శ్రీనివాస్ జన్నారం మండలంలోని అక్కపెల్లిగూడ ప్రాథమిక పాఠశాలకు ఈ నెల 1న బదిలీ అయ్యారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు అక్కడికే వెళ్తామని పట్టుబట్టడంతో తల్లిదండ్రులు కూడా ఆయనపై నమ్మకంతో తమ పిల్లలను ఆ పాఠశాలలోనే చేర్పించారు. ఇప్పటివరకు 11 మంది ఉన్న అక్కపెల్లిగూడ పాఠశాలలో 141 మంది చేరారు. దీంతో 152 మంది విద్యార్థులతో ఆ పాఠశాల కళకళలాడుతోంది. టీజీపల్లి, దేవునిగూడ, కామన్పల్లి, కిష్టాపూర్, ఇందన్ పల్లి, గాంధీనగర్, జువ్విగూడ, జన్నారం గ్రామాల నుంచి విధ్యార్థులు ఆటోల్లో పాఠశాలకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో జాజాల శ్రీనివాస్‌తో పాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు.

ఆ టీచర్ ఏన్నారంటే.?

'ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా నా విధులు సక్రమంగా నిర్వర్తించాను. విద్యార్థులకు బోధన సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో నా తోటి ఉపాధ్యాయులతో కలిసి కష్టపడ్డాను. మంచి ఫలితాలు వచ్చాయి. నాపై, సిబ్బందిపై నమ్మకంతో వివిధ గ్రామాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను పంపారు. ఈ నెల 1న బదిలీపై అక్కపెల్లిగూడ పాఠశాలకు వెళ్లాను. బదిలీ విషయం తెలుసుకుని 141 మంది విద్యార్థులు కూడా నా పాఠశాలకు రావడం చాలా ఆనందంగా ఉంది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి ఫలితాలు తీసుకువస్తాను'  ప్రధానోపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్ చెబుతున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Owaisi College Lake Encroachment : కాంగ్రెస్‌కు కంటి చూపు సమస్యా? ఒవైసీ కాలేజీపై హైడ్రా ఎందుకు ఉలకదు?: బండి సంజయ్ ఫైర్!
కాంగ్రెస్‌కు కంటి చూపు సమస్యా? ఒవైసీ కాలేజీపై హైడ్రా ఎందుకు ఉలకదు?: బండి సంజయ్ ఫైర్!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget