అన్వేషించండి

Semiconductor Plant: యూపీలోని జెవర్‌లో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు మోదీ కేబినెట్ ఆమోదం

Semiconductor Plant: కేంద్రమంత్రి చెప్పిన వివరాల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని జేవర్‌లో కొత్తగా సెమీకండక్టర్‌ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది.

Semiconductor Plant in Uttar Pradesh: మోదీ ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్‌లోని జెవర్‌లో భారతదేశంలో సెమీకండక్టర్ యూనిట్‌ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇది భారతదేశంలో ఆరో సెమీకండక్టర్ యూనిట్ అవుతుంది. ఈ మేరకు బుధవారం సమావేశమైన కేంద్రకేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, వీటిలో ఒక యూనిట్‌లో ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు.

అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే... 'భారతదేశంలో సెమీకండక్టర్ మిషన్ కింద ఇప్పటికే 5 సెమీకండక్టర్ యూనిట్లకు అనుమతి లభించింది. అక్కడ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో ఒక యూనిట్‌లో ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అదే సందర్భంగా మరో సూపర్-అడ్వాన్స్డ్ యూనిట్‌కు అనుమతి లభించింది. ఇది HCL , ఫాక్స్‌కాన్ సంయుక్త ప్రాజెక్టు.'

2000 మందికి ఉద్యోగాలు 

జెవర్‌లో భారతదేశంలో ఆరవ సెమీకండక్టర్ యూనిట్‌కు అనుమతి లభించడం వల్ల 2000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రమంత్రి అన్నారు. ఆయన మాట్లాడుతూ..."సెమీ కండక్టర్ యూనిట్‌లో 3706 కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటుంది. ఇక్కడ ప్రతి నెలా 3.6 కోట్ల డిస్ప్లే డ్రైవర్ చిప్‌లు తయారవుతాయి. 2027 నుంచి దీని ఉత్పత్తి ప్రారంభమవుతుంది. HCL-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ ప్లాంట్‌లో ప్రతి నెలా 20,000 వేఫర్లను తయారు చేస్తారు."

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఆపరేషన్ సిందూర్ భారతదేశం బలాన్ని, నాయకత్వాన్ని, మన సైన్యం శక్తిని  చూపిందని అన్నారు. "ఆపరేషన్ సిందూర్ భారతదేశం గుర్తింపు, మన సాయుధ దళాల పాత్ర, నిర్ణయాత్మక నాయకత్వం, కొత్త ఆలోచనల ఫలితాలు అన్నింటికీ ఇది ముఖ్యమైన ఉదాహరణ. ఇది నిజంగా దేశానికి గర్వకారణం. ఆపరేషన్ సిందూర్‌లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించారు. టెక్నాలజీ భారతదేశానికి చాలా పెద్ద బలాన్ని ఇస్తుంది. భవిష్యత్తు కోసం బలమైన పునాది ఏర్పరుస్తుంది." అని అన్నారు. 

'తాజా డిజైన్ టెక్నాలజీపై కసరత్తు'

కేంద్రమంత్రి మాట్లాడుతూ... , "సెమీకండక్టర్ పరిశ్రమ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త రూపు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి డిజైన్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం.  రాష్ట్ర ప్రభుత్వాలు డిజైన్ సంస్థలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాయి. 270 విద్యా సంస్థలు, 70 స్టార్టప్‌లలో విద్యార్థులు, ఉద్యోగులు కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి తాజా డిజైన్ టెక్నాలజీపై పని చేస్తున్నారు."

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇంకా ఏమన్నారంటే... "భారతదేశంలో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సర్వర్లు, మెడికల్ పరికరాలు, పవర్ ఎలక్ట్రానిక్స్, రక్షణ పరికరాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ తయారీ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో సెమీకండక్టర్‌ల డిమాండ్ పెరుగుతోంది, ఈ కొత్త యూనిట్ PM మోడీ ఆత్మనిర్భర్ భారత్ దృష్టికోణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది."

నిర్మాణ దశలో ఉన్న సెమీకండక్టర్‌ యూనిట్ల వివరాలు ఇవే 

1. వేదాంత, ఫోక్స్‌కాన్ కంబైండ్‌ వెంచర్‌: ఈ యూనిట్‌ గుజరాత్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్, సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌లను కలిగి ఉంది. 

2. మైక్రాన్ టెక్నాలజీ:- ఈ సంస్థ గుజరాత్‌లోని సనంద్‌లో ఒక సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. నిర్మాణ దశ చివరి స్టేజ్‌కు వచ్చింది. త్వరలోనే కార్యకలాపాలు ప్రాంభించే అవకాశం ఉంది. ఇది తయారీ యూనిట్ మాత్రమే కాకుండా అసంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌. 

3. టాటా గ్రూప్‌;- టాటా గ్రూప్‌నకు చెందిన సమీకండక్టర్ తయారీ రంగంలోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపిస్తోంది. తైవాన్‌కు చెందిన పవర్‌ చిప్‌ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం  కుదుర్చుకుంది. దీన్ని కూడా గుజరాత్‌లోని ఒక ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
5. హువానీ సహా ఇతర సంస్థల దరఖాస్తులు కూడా పరిశీలిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget