అన్వేషించండి

Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్

Apple iPad Mini | యాపిల్ కొత్త ఐప్యాడ్ మినీలో OLED డిస్‌ప్లే ఇవ్వనున్నారు. ఇది ప్రస్తుతం ఇచ్చే LCD స్క్రీన్ కంటే మెరుగ్గా ఉంటుందని, యూజర్లకు నచ్చుతుందని భావిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యాపిల్ కొత్త ఐప్యాడ్ మినీ OLED డిస్‌ప్లేతో వస్తోంది.
  • ఇది మెరుగైన రంగులు, కాంట్రాస్ట్, విజువల్స్ అందిస్తుంది.
  • కొత్త ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్, పెన్సిల్‌పై యాపిల్ పని చేస్తోంది.

Apple iPad Mini: ప్రముఖ యాపిల్ కంపెనీ పలు ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. యాపిల్ ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతున్నాయంటే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో హాట్ కేకుల్లా కొనేస్తారు. ఐఫోన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడినా, Apple ఇతర ఉత్పత్తులు కూడా చాలా మందికి నచ్చుతాయి. ఈ క్రమంలో Apple iPad Mini మార్కెట్‌లో ఫేమస్ డివైజ్. యాపిల్ కంపెనీ ఇప్పుడు ఈ పరికరాన్ని కొత్త డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి రావడానికి చేయడానికి సిద్ధమవుతోంది. 

మొదటిసారి OLED ప్యానెల్

 బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం Apple కొత్త iPad Mini లాంచ్ చేయడంపై ఫోకస్ చేసింది. దీని అంతర్గత కోడ్‌నేమ్ J510 అంటారు. ఈ పరికరానికి 2021 తర్వాత ఇది మొదటి పెద్ద అప్‌డేట్ కానుంది. కొత్త iPad Miniలో OLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది ప్రస్తుత LCD స్క్రీన్ కంటే చాలా బెస్ట్‌గా ఉంటుంది. మెరుగైన రంగులు, ఎక్కువ కాంట్రాస్ట్, అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఈ అప్‌గ్రేడ్ కాంపాక్ట్ టాబ్లెట్ విభాగంలో మరిన్ని మార్పులకు శ్రీకారం చుడుతుంది. ఇంతకు ముందు ప్రో మోడల్స్‌లో OLED టెక్నాలజీ వాడేవారు. 

ప్రామాణిక ఐప్యాడ్‌లో LCD డిస్‌ప్లే కొనసాగింపు

ప్రస్తుతం వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, iPad Mini, iPad Air లలో OLED స్క్రీన్ వస్తుందని హాట్ టాపిక్ అవుతోంది. సాధారణ iPad మోడల్‌లో ప్రస్తుతం LCD డిస్‌ప్లే ఇస్తారని తెలిసిందే. డివైజ్ ధరను సాధ్యమైనంత తక్కువ ఉంచడానికి ఇది జరుగుతోంది. దీంతో పాటు, Apple Pencil ను కూడా కంపెనీ త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోందని భావిస్తున్నారు. ఈ కొత్త డివైజ్ లో వినియోగదారులు కొత్త టెక్నాలజీని ఆస్వాదిస్తారు.

Also Read: Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?

కొత్త ఐప్యాడ్ విడుదల 

Apple కేవలం iPad Miniకి మాత్రమే పరిమితం కాలేదు. కంపెనీ కొత్త ఎంట్రీ లెవల్ iPadపై కూడా వర్క్ చేస్తోంది. యాపిల్ కొత్త ఐపాడ్ త్వరలో భారత మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త మోడల్‌లో చాలా పవర్‌ఫుల్ ప్రాసెసర్ కూడా ఇవ్వనున్నారు. దీని వల్ల ఐపాడ్ పనితీరు చాలా మెరుగుపడుతుంది. అయితే, దీని డిజైన్‌లో గత ఐపాడ్‌తో పోల్చితే పెద్దగా మార్పులు ఉండవు.

Also Read: WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?

Frequently Asked Questions

కొత్త ఐప్యాడ్ మినీలో ప్రధాన అప్‌డేట్ ఏమిటి?

కొత్త ఐప్యాడ్ మినీ OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మెరుగైన రంగులు, ఎక్కువ కాంట్రాస్ట్, అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

కొత్త ఐప్యాడ్ మినీకి 2021 తర్వాత ఇదే మొదటి పెద్ద అప్‌డేట్ అవుతుందా?

అవును, ఈ కొత్త ఐప్యాడ్ మినీ 2021 తర్వాత విడుదలయ్యే మొదటి పెద్ద అప్‌డేట్. దీని అంతర్గత కోడ్‌నేమ్ J510.

ప్రామాణిక ఐప్యాడ్‌లలో ఏ డిస్‌ప్లే సాంకేతికత కొనసాగుతుంది?

ప్రామాణిక ఐప్యాడ్ మోడల్‌లలో LCD డిస్‌ప్లే కొనసాగుతుంది. డివైజ్ ధరను సాధ్యమైనంత తక్కువ ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

యాపిల్ కొత్త ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌ను విడుదల చేస్తుందా?

అవును, యాపిల్ కొత్త ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌పై కూడా పని చేస్తోంది. ఇది పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వస్తుంది, కానీ డిజైన్‌లో పెద్ద మార్పులు ఉండవు.

Apple కొత్త Apple Pencilను విడుదల చేస్తుందా?

అవును, Apple కొత్త Apple Pencilను త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం. దీనితో వినియోగదారులు కొత్త టెక్నాలజీని ఆస్వాదిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Embed widget