అన్వేషించండి

Apple Event 2022: అత్యంత చవకైన యాపిల్ ఫోన్ వచ్చేస్తుంది - 5జీ కూడా - మార్చి 8న ముహూర్తం ఫిక్స్!

యాపిల్ తన చవకైన 5జీ స్మార్ట్ ఫోన్‌ను మార్చి 8వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Apple Event: యాపిల్ మార్చి 8వ తేదీన నిర్వహించే ఈవెంట్లో కొత్త ఐఫోన్ ఎస్ఈ 3 (iPhone SE 3), ఐప్యాడ్ ఎయిర్‌ను (iPad Air) లాంచ్ చేయడం దాదాపు పక్కా అయిపోయింది. ఈ రెండిటి లాంచ్‌కు సంబంధించిన సమాచారాన్ని యాపిల్ ఒక ఆసియన్ క్యారియర్‌కు అందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ ఎవాన్ బ్లాస్ తెలిపారు. సాధారణంగా మొబైల్ తయారీ కంపెనీ తాము లాంచ్ చేయబోయే స్మార్ట్ ఫోన్ల గురించిన సమాచారాన్ని క్యారియర్లకు అందిస్తాయి.

ఈ కార్యక్రమానికి సంబంధించిన మీడియా ఇన్వైట్లను కూడా యాపిల్ పంపిస్తుంది. ఇందులో కొత్త మ్యాక్‌బుక్ ప్రో (Macbook Pro), మ్యాక్‌బుక్ ఎయిర్ (Macbook Air), మ్యాక్ మినీ (Mac Mini), ఐమ్యాక్ ప్రో (iMac Pro) లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ ఎస్ఈ 3 లేదా ఐఫోన్ ఎస్ఈ+ 5జీ (iPhone SE+ 5G) లేదా ఐఫోన్ ఎస్ఈ 5జీ కూడా ఈరోజే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

యాపిల్ (Apple) ఈ సంవత్సరం నిర్వహించనున్న మొదటి పబ్లిక్ ఈవెంట్ ఇదే. మార్చి 8వ తేదీ ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు) ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. కంపెనీ వెబ్‌సైట్, యాపిల్ టీవీ యాప్‌లో దీన్ని లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు. యాపిల్ అధికారిక యూట్యూబ్ చానెల్లో కూడా దీన్ని స్ట్రీమ్ చేయవచ్చు.

యాపిల్ ఈవెంట్ అనౌన్స్‌మెంట్లు (అంచనా)
గతంలో లాంచ్ కానున్న మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే ఇప్పుడు లాంచ్ కానున్న మ్యాక్‌బుక్ ఎయిర్ డిజైన్ చాలా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. గతేడాది లాంచ్ అయిన మ్యాక్‌బుక్ ప్రో తరహాలో దీని డిజైన్ ఉండనుందని సమాచారం. మినీ ఎల్ఈడీ డిస్‌ప్లేలతో కలర్ ఫుల్‌గా ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ లాంచ్ కానుందని తెలుస్తోంది.

దీంతోపాటు కొత్త ఐఫోన్ ఎస్ఈ లాంచ్ కానుంది. దీనికి ఐఫోన్ ఎస్ఈ (2022) లేదా ఐఫోన్ ఎస్ఈ 5జీ, లేదా ఐఫోన్ ఎస్ఈ+ 5జీ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ ఎస్ఈ (2020) తరహాలో దీని డిజైన్ ఉండనుంది. కానీ ఇందులో 5జీ సపోర్ట్ అందించనున్నారు. దీంతోపాటు ఏ15 బయోనిక్ ప్రాసెసర్ కూడా అందించే అవకాశం ఉంది. దీని కెమెరాలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. దీని ధర 300 డాలర్ల (సుమారు రూ.22,700) రేంజ్‌లో ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

ఐప్యాడ్ ఎయిర్‌ను కూడా యాపిల్ అప్‌గ్రేడ్ చేయనుందని తెలుస్తోంది. ఇప్పుడు రానున్న ఐప్యాడ్ ఎయిర్ (ఐదో తరం)లో ఏ15 బయోనిక్ ప్రాసెసర్, 5జీ కనెక్టివిటీ ఉండనుందని తెలుస్తోంది.

Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో బిగ్ అప్‌డేట్! ఏఐ అప్‌గ్రేడ్‌తో మారిన నావిగేషన్ రూపురేఖలు!
గూగుల్ మ్యాప్స్‌లో బిగ్ అప్‌డేట్! ఏఐ అప్‌గ్రేడ్‌తో మారిన నావిగేషన్ రూపురేఖలు!
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
Internet Data Tax: ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget