Tokyo Olympic 2020 LIVE: ‘కాంస్య’ సింధు... టోక్యో ఒలింపిక్స్లో కాంస్యంతో సరిపెట్టుకున్న సింధు... పతక పోరులో రెండు వరుస సెట్లలో విజయం
టోక్యో ఒలింపిక్స్లో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం గెలిచింది. స్వర్ణ పతకమే లక్ష్యంగా టోక్యో ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన సింధు సెమీఫైనల్లో ఓడి పసిడి పతకానికి దూరమైంది.

Background
టోక్యో ఒలింపిక్స్ మరో 8 రోజుల్లో ముగియనుండటంతో పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. భారత క్రీడాకాభిమానుల కోసం ఆసక్తికరమైన పోరు సిద్ధమైంది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోరు సెమీఫైనల్ చేరింది. ఇందులో భాగంగా శనివారం సింధు... మాజీ నంబర్ వన్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్తో తలపడనుంది. ఇప్పటి వరకు వీరిద్దరూ 18 మ్యాచుల్లో తలపడ్డారు. అందులో 15 సార్లు తైజుదే పైచేయి. కేవలం 3 సార్లు మాత్రమే సింధు విజయం సాధించింది. మరి, ఈ రోజు మ్యాచ్లో విజయం ఎవరిది?
11-8 తో రెండో సెట్ లో సింధు ఆధిపత్యం
రెండో సెట్లో సింధు 11-8తో బ్రేక్ తీసుకుంది. రెండో సెట్ కోసం ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు.
హోరాహోరీగా రెండో సెట్
కాంస్య పోరులో సింధుXబింగ్జియావో పోరు హోరాహొరీగా సాగుతోంది. తొలి సెట్ ను బింగ్జియావో కోల్పోయింది. దీంతో రెండోసెట్ ఆధిపత్యం కోసం ప్రత్యర్థి పోరాడుతోంది.





















