By: ABP Desam | Updated at : 27 Jul 2021 06:51 PM (IST)
Tokyo Olympic 2020
బుధవారం(28-07-2021) టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఈ కింది క్రీడాంశాల్లో పాల్గొననుంది. తెలుగు తేజం పీవీ సింధు రెండో రౌండ్లో హాంకాంగ్ క్రీడాకారిణితో తలపడనుంది. సాయి ప్రణీత్ నామమాత్రపు మ్యాచ్లో తలపడుతున్నాడు. ఇప్పటికే అతడు క్వార్టర్స్కి అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. పతకం ఖాయమనుకున్న ఆర్చరీ క్రీడాకారిణి దీపక కుమారి ఇప్పటి వరకు మిక్స్డ్ డబుల్స్, డబుల్స్లో ఫైనల్కి కూడా అర్హత సాధించలేకపోయింది. మరి రేపు వ్యక్తిగత విభాగంలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. బాక్సింగ్లో పూజా రాణి రాణించాలి.
* హాకీ: మహిళల గ్రూప్-ఎ మ్యాచ్ (భారత్ × గ్రేట్ బ్రిటన్) ఉ.6.30 నుంచి.
* బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ గ్రూప్ - జె (పీవీ సింధు × చెంగ్) ఉ.7.30 నుంచి.
* ఆర్చరీ: పురుషుల వ్యక్తిగతం(తరుణ్ దీప్ రాయ్) ఉ.7.31నుంచి.
* రోయింగ్ : పురుషుల డబుల్ స్కల్స్ సెమీఫైనల్(అర్జున్ లాల్, అరవింద్ సింగ్) ఉ.8.00నుంచి.
* సెయిలింగ్ : పురుషుల స్కిఫ్ (గణపతి, వరుణ్) ఉ. 8.35నుంచి
* ఆర్చరీ: పురుషుల సింగిల్స్ (ప్రవీణ్ జాదవ్) మ.12.30నుంచి
* ఆర్చరీ: మహిళల సింగిల్స్ (దీపిక కుమారి) మ.2.14నుంచి
* బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ గ్రూప్-డి (సాయి ప్రణీత్)
* బాక్సింగ్: పూజా రాణి మ.2.33నుంచి.
ఇప్పటి వరకు భారత్ కేవలం ఒకే ఒక్క పతకం గెలిచింది. మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం గెలిచింది. మిగతా క్రీడాంశాల్లో గత నాలుగు రోజులుగా భారత్ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నారు. పతకాలు గెలుస్తారనుకున్న ఆటగాళ్లు సైతం తమ విభాగాల్లో ఘోరంగా విఫలమవుతున్నారు. ఫైనల్కు అర్హత సాధించడంలోనూ మన వాళ్లు చేతులెత్తేస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడికి లోనైన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్ర 3వ రౌండ్లో పరాజయం పాలైంది. మరోపక్క పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ లోనూ శరత్ కమల్ 3వ రౌండ్ నుంచే వెనుదిరిగాడు. ఈ రోజు జరిగిన సంచలనం ఏదన్నా ఉందంటే... బాక్సింగ్లో లవ్లీనా విజయం సాధించడమే. జర్మనీ క్రీడాకారిణిపై విజయం సాధించి తదుపరి రౌండ్ కి అర్హత సాధించింది. ఈ నెల 30న చైనీస్ తైపీ క్రీడాకారిణితో మ్యాచ్లో లవ్లీనా విజయం సాధిస్తే కనీసం కాంస్య పతకమైనా ఖాయమౌతుంది. మరి రేపటి క్రీడాంశాల్లో మన క్రీడాకారులు ఎంతవరకు పతకాలకు దగ్గరవుతారో చూద్దాం.
మరోపక్క పీవీ సింధు కూడా ఒత్తిడికి గురవుతోంది. కచ్ఛితంగా పతకం గెలుస్తోందన్న అంచనాలకు సింధు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రియో ఒలింపిక్స్ ఫైనల్లో చేసిన తప్పును సింధు చేయకుండా ఉంటే ఆమె తప్పకుండా విజయం సాధిస్తుంది.
భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్
Ravichandran Ashwin: ఆ టైంలో వాళ్లను చూసి చాలా బాధేసింది: అశ్విన్
ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్కప్ కు బెర్త్ ఖాయం చేసుకున్న ఉగాండా
India vs Australia 4th T20 match: సమం చేస్తారా, సాధించేస్తారా ..
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత
YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !
Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
Rs 2000 Notes: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్డేట్ ఇచ్చిన ఆర్బీఐ
/body>