అన్వేషించండి

India vs England 2021: ఇంగ్లాండ్ వెళ్లనున్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్...

యువ ఆటగాళ్లు పృథ్వీ షా(Pruthvi Shaw), సూర్యకుమార్‌ యాదవ్‌(Suraya Kumar Yadav) ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు.

యువ ఆటగాళ్లు పృథ్వీ షా(Pruthvi Shaw), సూర్యకుమార్‌ యాదవ్‌(Suraya Kumar Yadav) ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. శ్రీలంకలో పర్యటిస్తున్న పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌ కోహ్లీసేనలో చేరడం ఖాయమైందని, వీరిద్దరూ ఇంగ్లాండ్‌ వెళ్లి టీమ్‌ఇండియా తరఫున ఆడతారని బీసీసీఐ ప్రకటించింది. స్టాండ్‌ బై ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ సైతం ప్రధాన జట్టులో భాగం కానున్నాడు. అతడితో పాటు వృద్ధిమాన్‌ సాహా, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ఐసోలేషన్‌ ముగిసిందని బోర్డు కార్యదర్శి జే షా ప్రకటించారు.

గాయాల కారణంగా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. స్టాండ్‌ బై పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ ఎడమచేతి బొటన వేలు విరగడంతో అతడూ భారత్‌కు బయల్దేరనున్నాడు. వీరి స్థానాలను పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, అభిమన్యు ఈశ్వరన్‌తో సెలక్షన్‌ కమిటీ భర్తీ చేయనుంది.


‘సెలక్షన్‌ కమిటీ పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్లను సూచించింది. వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడ్డ వేలికి వైద్యం తీసుకున్నాడు. కోలుకొనేందుకు మరింత సమయం పట్టనుంది. బౌలింగ్‌  ఫిట్‌నెస్‌ లేకపోవడంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. ఫాస్ట్‌బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ సైతం గాయంతో భారత్‌కు వచ్చేస్తున్నాడు’ అని జే షా తెలిపారు.

కొవిడ్‌-19 నుంచి రిషభ్ పంత్‌ పూర్తిగా కోలుకున్నాడని జే షా వెల్లడించారు. బీసీసీఐ వైద్య సిబ్బంది అనుమతి రావడంతో టెస్టులకు సన్నద్ధమవుతున్నాడని పేర్కొన్నారు. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌ను ఎంపిక చేస్తారని ఊహించినా అలాంటిదేం జరగలేదు. ప్రస్తుతం షా, సూర్యకుమార్ యాదవ్  శ్రీలంకలో బయో బుడగలో ఉన్నారు. అక్కడ్నుంచి నేరుగా ఇంగ్లాండ్‌లోని బుడగకు చేరుకుంటారు. కాబట్టి ఐసోలేషన్‌, క్వారంటైన్‌ నిబంధనలు ఉండకపోవచ్చు!

 అగస్టు 4 నుంచి ఇండియా-ఇంగ్లాండ్ మధ్య పటౌడి ట్రోఫీ ప్రారంభం కానున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ సిరీస్ కోసం బీసీసీఐ 24 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్ పంపించింది. అయితే వీరిలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ గాయపడి ఇంటికి తిరిగి వచ్చేశారు. దీంతో తమకు బ్యాకప్ క్రికెటర్లు కావాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ కోరింది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌ను టెస్టు జట్టు కోసం పంపిస్తోంది.

స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పృథ్వీషాను పక్కన పెట్టారు. అయితే ఇండియాలో జరిగిన తొలి దశ ఐపీఎల్‌లో పృథ్వీషా విశేషంగా రాణించాడు. స్వింగ్ డెలివరీలతో పడుతున్న ఇబ్బందిని అధిగమించి దేశవాళీ క్రికెట్‌లో కూడా రాణించాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి టెస్టు జట్టులో మరోసారి చోటు దక్కింది.

సూర్యకుమార్ యాదవ్ 2020 ఐపీఎల్‌లో అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పుడే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవుతాడని భావించినా కాలేకపోయాడు. కానీ, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వన్డేల్లో, శ్రీలంక పర్యటనలో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంక పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు. ఆదివారం జరిగిన తొలి టీ20లో అర్ద సెంచరీ చేశాడు. 2019-20 రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడిన యాదవ్.. 10 ఇన్నింగ్స్‌లో 508 పరుగులు చేశాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget